Kushboo: ఇష్టానుసారం మాట్లాడితే సమాధానం వస్తుంది.. ఖుష్బూకు ‘మురసొలి’ హెచ్చరిక
మైక్ చేతికి అందింది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే వాటికి సమాధానాలు కూడా వస్తాయని భాజపా జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యురాలు, నటి ఖుష్బూని డీఎంకే అధికారిక దినపత్రిక ‘మురసొలి’ హెచ్చరించింది.
చెన్నై, న్యూస్టుడే: మైక్ చేతికి అందింది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే వాటికి సమాధానాలు కూడా వస్తాయని భాజపా జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యురాలు, నటి ఖుష్బూని డీఎంకే అధికారిక దినపత్రిక ‘మురసొలి’ హెచ్చరించింది. తన కథనంలో... భాజపా తరఫున చెన్నైలో జరిగిన ఆందోళనలో అసలు విషయాన్ని పక్కనపెట్టి నోటికొచ్చినట్టు ఖుష్బూ మాట్లాడారని తెలిపింది. రాజకీయాల్లోకి వచ్చిన అనతికాలంలోనే చాలా పార్టీలు ఫిరాయించారంటూ ఆమెను ‘తావల్ తిలగం’ (ఫిరాయింపు తిలకం) అని విమర్శించింది. వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలను కేంద్రం పెంచుతున్నప్పుడు మండని ఆమె కడుపు రాష్ట్రంలో విద్యుత్తు ఛార్జీలు, పాల ధరలు పెరగడంతో మండుతుందా? అని ప్రశ్నించింది. అది కడుపు మండటం కాదని, కడుపు మంట అని ఎద్దేవా చేసింది. డీఎంకే నిర్వాహకుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు స్టాలిన్ కూడా క్షమాపణ కోరాలని ఖుష్బూ డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించింది. నేడు భాజపా కార్యవర్గ కమిటీ సభ్యులుగా ఉన్న ఆమె గురించి నాటి జాతీయ కార్యదర్శి హెచ్.రాజా చేసిన దిగుజారుడు వ్యాఖ్యలు మళ్లీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయని తెలిపింది. దీని కోసం హెచ్.రాజాను, అమిత్ షా, ప్రధానినీ క్షమాపణ కోరాలని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.