logo

ఐశ్వర్య ఇంట్లో చోరీకి గురైన మరో 43 సవర్ల నగల స్వాధీనం

ఐశ్వర్య రజనీకాంత్‌ ఇంట్లో నగలు చోరీ అయిన కేసులో మరో 43 సవర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated : 30 Mar 2023 06:12 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: ఐశ్వర్య రజనీకాంత్‌ ఇంట్లో నగలు చోరీ అయిన కేసులో మరో 43 సవర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నటుడు రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య తన లాకర్లో ఉంచిన బంగారు, వజ్రాభరణాలు చోరీ అయినట్లు తేనాంపేట పోలీసులకి ఫిర్యాదు చేశారు ఈ కేసులో ఇంటి పనిమనిషి ఈశ్వరి, కారు డ్రైవరు వెంకటేశన్‌లను పోలీసులు అరెస్టు చేసి పెద్ద మొత్తంలో నగలను  స్వాధీనం చేసుకున్నారు. నగలను కొనుగోలు చేసిన మైలాపూర్‌కి చెందిన వినాల్క్‌ శంకర్‌ నవాలిని అరెస్టు చేసి, అతని నుంచి 340 గ్రాముల నగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదులో పేర్కొన్న దానికంటే ఎక్కువ మొత్తంలో నగలను స్వాధీనం చేసుకోవడంతో ఈశ్వరి, వెంకటేశన్‌లను పోలీసులు కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. అనంతరం వారు ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం మరో 43 సవర్ల నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని