ఈ-టాయిలెట్ల ఏర్పాటుకు సన్నాహాలు
రైల్వే స్టేషన్లలో మరుగుదొడ్లను అధునాతన పద్ధతిలో అందరూ వినియోగించుకునేలా మరమ్మతులు చేసేందుకు దక్షిణ రైల్వే సన్నద్ధమవుతోంది.
చెన్నై సెంట్రల్లో మరమ్మతులు చేస్తున్న మరుగుదొడ్డి
వడపళని, న్యూస్టుడే: రైల్వే స్టేషన్లలో మరుగుదొడ్లను అధునాతన పద్ధతిలో అందరూ వినియోగించుకునేలా మరమ్మతులు చేసేందుకు దక్షిణ రైల్వే సన్నద్ధమవుతోంది. తక్కువ నిర్వహణతో, ప్రయాణికులకు పరిసరాలు శుభ్రంగా ఉండే రీతిలో చెన్నై డివిజన్లోని స్టేషన్లలో దక్షిణ రైల్వే ఈ-టాయిలెట్లు ఏర్పాటు చేయనుంది. ముందుగా చెన్నై సెంట్రల్ స్టేషనులో వీటిని ఏర్పాటు చేయనుంది. వీటి ఏర్పాటుకు కాంట్రాక్టు కూడా అప్పగించింది. మొట్టమొదట చెన్నై సెంట్రల్ స్టేషనులో ‘రినోవేట్, ఆపరేట్, మెయిన్టెయిన్ అండ్ ట్రాన్స్ఫర్’ (ఆర్ఓఎంటీ) పద్ధతిలో పనులు జరగనున్నాయి. చెన్నై డివిజన్ సీనియర్ అధికారి మాట్లాడుతూ... ఈ విధానంతో కాంట్రాక్టు అప్పగించేందుకు టెండర్ ఆహ్వానించామన్నారు. నగదు చెల్లించి మరుగుదొడ్లను వాడుకునే వీలుంటుందని, ఈ పద్ధతిని ప్రవేశపెట్టేందుకు ముందుగా అన్ని కోణాల్లో అధ్యయనాలు జరిపినట్లు తెలిపారు. రూ.3.23 కోట్లతో పదేళ్లు కాంట్రాక్టు పద్ధతిలో బాధ్యతలు అప్పగించారు.
సెల్ఫ్ క్లీనింగ్.. ఈ-టాయిలెట్ సెల్ఫ్ క్లీనింగ్ (ఎవరికి వారే శుభ్రం చేసుకునే పద్ధతి)తో కూడుకున్నది. నాణేలు/క్యూఆర్ కోడ్ విధానంతో పనిచేసే ఈ మరుగుదొడ్లకు కనీస నిర్వహణ ఉంటే సరిపోతుంది. మరుగుదొడ్లలో సెరమిక్ ఫ్లోరింగ్, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, కాంతివంతమైన దీపాలు, నీటి సదుపాయాలు ఉంటాయి. దక్షిణ రైల్వే నుంచి అనుమతి అందిన తర్వాత మరమ్మతుల కోసం సరికొత్త రీతిలో డిజైన్ రూపొందిస్తామని అధికారులు అన్నారు. చెన్నై డివిజన్లోని ఆవడి, కాట్పాడి, తిరువళ్లూరు, మాంబలం వంటి స్టేషన్లలో సదుపాయాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. పట్టాభిరాం రైల్వే స్టేషనులో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్డి నెలల తరబడి మూసే ఉందని, ఇటీవలే తెరిచారని సామాజిక కార్యకర్తలు పేర్కొన్నారు. నిర్వహణకు సరైన కాంట్రాక్టరు కుదరకపోవడంతో తాళం వేసినట్లు దక్షిణ రైల్వే పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.