బాధితులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు: ఉదయనిధి
ఒడిశా రైలు ప్రమాదంలో చిక్కుకున్న తమిళులను రక్షించి రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు వేగవంతం చేస్తామని రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ తెలిపారు.
సైదాపేట, న్యూస్టుడే: ఒడిశా రైలు ప్రమాదంలో చిక్కుకున్న తమిళులను రక్షించి రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు వేగవంతం చేస్తామని రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. ప్రమాదానికి గురైన కోరమాండల్ రైలులో చెన్నై సెంట్రల్కు వచ్చేందుకు 101 మంది రిజర్వేషన్ చేయించుకోగా అందులో 17 మంది ప్రమాణించలేదని తెలుస్తోంది. ఘటనాస్థలికి మంత్రులు ఉదయనిధి స్టాలిన్, శివశంకర్, రవాణాశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఫణీంద్రరెడ్డి, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి కుమార్ జయంత్, ఉపాధ్యాయ ఎంపిక సంఘం అధ్యక్షురాలు అర్చనా భట్నాయక్ తదితరులు చేరుకున్నారు. ఒడిశా వెళ్లేముందు చెన్నై విమానాశ్రయంలో మంత్రి ఉదయనిధి విలేకర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. గాయపడిన తమిళులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందినవారి వివరాలు ఇంకా పూర్తిగా తెలియలేదన్నారు. వారిని రక్షించి చికిత్స అందించేందుకు తగిన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి