logo

మహిళా రెజ్లర్లకు మద్దతుగా ఆందోళన

మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీˆ బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలని డిమాండు చేస్తూ బుధవారం అన్నై ఇందిరాగాంధీ మహిళల అభివృద్ధి సంక్షేమ సంఘం తరఫున చెన్నై రాజరత్నం స్టేడియం వద్ద ఆందోళన చేపట్టారు.

Updated : 08 Jun 2023 06:53 IST

ఆందోళన చేస్తున్న నిర్వాహకులు

చెన్నై, న్యూస్‌టుడే: మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలని డిమాండు చేస్తూ బుధవారం అన్నై ఇందిరాగాంధీ మహిళల అభివృద్ధి సంక్షేమ సంఘం తరఫున చెన్నై రాజరత్నం స్టేడియం వద్ద ఆందోళన చేపట్టారు. సంఘం అధ్యక్షురాలు గౌరీ నేతృత్వంలో నిర్వహించిన ఈ  కార్యక్రమంలో కాంగ్రెస్‌ కమిటీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రంజన్‌ కుమార్‌,  సాహిత్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పూంగొడి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని