logo

నామినేషన్‌ దాఖలు చేసిన అన్నామలై

భాజపా తరపున కోయంబత్తూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు.

Published : 28 Mar 2024 00:19 IST

పార్టీ వర్గీయులతో కలిసి నామినేషన్‌ దాఖలు చేస్తున్న అన్నామలై

కోయంబత్తూర్‌, న్యూస్‌టుడే: భాజపా తరపున కోయంబత్తూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. జిల్లా కలెక్టరు కార్యాలయానికి పార్టీ వర్గీయులతో చేరుకున్న ఆయన ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి క్రాంతికుమార్‌కు నామినేషన్‌ పత్రం అందించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ భాజపాకు ప్రజల మద్దతు అధికంగా ఉందన్నారు. అంత్యంత మెజార్టీ ఓట్లతో ఘన విజయం సాధిస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ మరోసారి అధికారం చేపడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. కోయంబత్తూరు నుంచి తాను విజయం సాధించి నియోజకవర్గ సమస్యలను లోక్‌సభలో చర్చిస్తానన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని