ప్రధాని నాటకాలు ప్రజలకు తెలుసు
ప్రధాని మోదీ ఎన్నికల నాటకాలు ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్లో డీఎంకే ఎన్నికల ప్రచార సమావేశం బుధవారం రాత్రి జరిగింది.
ముఖ్యమంత్రి స్టాలిన్
వేదికపైకి వస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్, వెంట అభ్యర్థులు మాణిక్కం ఠాగూర్, రాణిశ్రీ కుమార్
ప్యారిస్, న్యూస్టుడే: ప్రధాని మోదీ ఎన్నికల నాటకాలు ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్లో డీఎంకే ఎన్నికల ప్రచార సమావేశం బుధవారం రాత్రి జరిగింది. తెన్కాశి డీఎంకే అభ్యర్థి రాణిశ్రీ కుమార్, విరుదునగర్ కాంగ్రెస్ అభ్యర్థి మాణిక్కం ఠాగూర్కి మద్దతుగా ముఖ్యమంత్రి ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోట్ల మంది ప్రజలు లబ్ధిపొందేలా స్వర్ణయుగ పాలన అందిస్తున్నామన్నారు. నేడు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు విద్య, ఉపాధి అవకాశాలు పొంది అభివృద్ధి సాధిస్తున్నారంటే వందేళ్ల ముందు తీసుకొచ్చిన చట్టాలే కారణం అన్నారు. సామాజిక న్యాయానికి భాజపాతో ప్రమాదం ఏర్పడిందన్నారు. రిజర్వేషన్కి భంగం కలిగించింది భాజపా అన్నారు. కుల గణన లెక్కించాలని డిమాండ్ చేసినా అందుకు నిరాకరిస్తోందన్నారు. మైనారిటీలకు మాత్రమే కాక మెజారిటీ ప్రజలకు భాజపా శత్రువు అన్నారు. ఎన్నికల బాండ్ల ద్వారా భాజపా అతిపెద్ద అవినీతికి పాల్పడిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్తే తెలిపారన్నారు. పదేళ్లలో దేశాన్ని అగాధంలోకి నెట్టిందని, భాజపా నుంచి దేశాన్ని రక్షించడానికి ఇండియా కూటమి ఏర్పాటైందన్నారు. తమిళనాడుకి, తమిళులకు ద్రోహం చేయడమే అలవాటుగా పెట్టుకున్న ప్రధాని మోదీ ఎన్నికలు వచ్చినప్పుడు పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరలు తగ్గిస్తున్నారన్నారు. మోదీ ఎన్నికల హామీలకు గ్యారెంటీ, వారెంటీ లేదన్నారు. పదేళ్లలో పాలనలో ఏమీ చేయని మోదీ సేల్స్మ్యాన్లాగా ప్రకటనలు చేసుకుంటున్నారని విమర్శించారు. రూ.410గా ఉన్న వంట గ్యాసు సిలిండర్ ధర రూ.1000కి పైగా చేయడం వారి ఘనత అన్నారు. బాణసంచాకు జీఎస్టీ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వమని తెలిపారు. శివకాశి బాణసంచా పరిశ్రమను కాపాడేందుకు కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చైనా టపాసులపై నిషేధం విధిస్తారన్నారు. బాణసంచా పరిశ్రమను కాపాడేందుకు భాజపా ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు.
పాల్గొన్న జనసందోహం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంగ నాన్తాన్ కింగు ట్రైలర్ విడుదల
[ 28-04-2024]
ఆనంద్ నారాయణన్ దర్శకత్వంలో సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్తాన్ కింగు’. ప్రియాలయ, మనోబాలా, తంబి రామయ్య, మునీశ్కాంత్, బాల శరవణన్ తదితరులు ఇతర తారాగణం. -
తాగునీటి ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించాలి
[ 28-04-2024]
వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని తాగునీటి ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ముఖ్యమంత్రి స్టాలిన్ సూచించారు. -
రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు కేసు చెన్నైలో ఎన్ఐఏ దర్యాప్తు
[ 28-04-2024]
బెంగళూరు రామేశ్వరం కేఫ్లో బాంబు దాడి వ్యవహారానికి సంబంధించి చెన్నైలో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో గత నెల బాంబు పేలుడు సంభవించింది. -
కరవులో ఆదుకోనున్న క్వారీలు
[ 28-04-2024]
చెంగల్పట్టు జిల్లా పరిధిలోని గ్రామాలకు వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా రాళ్ల క్వారీల నుంచి నీటిని సేకరించేందుకు చెంగల్పట్టు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. -
రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వేడి గాలులు
[ 28-04-2024]
రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వేడి గాలులు వీచే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. -
గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ రాష్ట్రానికి అన్యాయం
[ 28-04-2024]
కేంద్రంలో గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనూ తమిళనాడుకు నిధులు అందించలేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఆరోపించారు. -
స్పీడ్ పోస్ట్ ద్వారా 2.5 లక్షల ఎల్ఎల్ఆర్లు
[ 28-04-2024]
‘లెర్నర్స్ లైసెన్స్’ (ఎల్ఎల్ఆర్), వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను స్పీడ్ పోస్టు ద్వారా పంపడంలో విజయం సాధించినట్టు ‘ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ సేఫ్టీ’ విభాగం పేర్కొంది. -
శ్రీవారిని దర్శించుకున్న దుర్గా స్టాలిన్
[ 28-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల వేంకటేశ్వరస్వామిని పలువురు ప్రముఖులు శనివారం దర్శించుకున్నారు. -
నిరంతర కృషితో ఉన్నత పదవులకు..
[ 28-04-2024]
టీఎన్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో తిరుప్పూర్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగినులు ఉత్తీర్ణత సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్