కుటుంబ రాజకీయాలకు ఫుల్స్టాప్ పెట్టండి
దేశంలో కుటుంబ రాజకీయాలకు ప్రజలు ఫుల్స్టాప్ పెట్టాలని కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్నాథ్సింగ్ కోరారు. తిరువణ్ణామలై లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా అశ్వథామన్ పోటీ చేస్తున్నారు.
మాట్లాడుతున్న రాజ్నాథ్సింగ్
తిరువణ్ణామలై, న్యూస్టుడే: దేశంలో కుటుంబ రాజకీయాలకు ప్రజలు ఫుల్స్టాప్ పెట్టాలని కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్నాథ్సింగ్ కోరారు. తిరువణ్ణామలై లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా అశ్వథామన్ పోటీ చేస్తున్నారు. మంగళవారం ఆయనకు మద్దతుగా రాజ్నాథ్సింగ్ ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ పాలనలో దేశానికి, ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. మోదీ పాలనలో ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టారని, దేశాన్ని కాపాడింది మోదీ అని చెప్పారు. తమిళనాడులో కుటుంబ రాజకీయ పాలన సాగుతోందన్నారు. మంత్రికి పార్టీ ప్రముఖులు ఘనస్వాగతం పలికారు.
సైదాపేట, న్యూస్టుడే: రాష్ట్రానికి డీఎంకే కుటుంబ పాలన, అవినీతి తప్ప వేరే ఏమిచ్చిందో చెప్పాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ నిలదీశారు. కృష్ణగిరి భాజపా అభ్యర్థి సి.నరసింహన్కు మద్దతుగా మంగళవారం కృష్ణగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవినీతిరహిత, అభివృద్ధి ఆధారిత పాలన అందించే సామర్థ్యం డీఎంకేకు లేదన్నారు. తెలిపారు. కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవటమే డీఎంకే, దాని మిత్రపక్షమైన కాంగ్రెస్ ఏకైక లక్ష్యమని ధ్వజమెత్తారు. భాజపాకు దేశమే మొదట అని, డీఎంకేకు కుటుంబమే ముఖ్యమని చెప్పారు. జయలలిత కూడా పేదల కోసం పని చేశారని, ఆమెపై తనకు ఎప్పుడూ గౌరవం ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుటుంబ సమేతంగా కొడైకెనాల్కు సీఎం
[ 30-04-2024]
ముఖ్యమంత్రి స్టాలిన్ ఐదు రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా కొడైకెనాల్కు వెళ్లారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రం, పుదుచ్చేరిలోని 40 నియోజకవర్గాల్లోనూ ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటనతో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. -
హోటల్ టమోటా సాస్లో పురుగులు
[ 30-04-2024]
నీలగిరి జిల్లా కున్నూర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో సప్లై చేసిన టమోటా సాస్లో పురుగులు ఉండటం చూసి నటుడు విజయ్ విశ్వ దిగ్భ్రాంతి చెందారు. -
మరో స్వచ్ఛంద సంస్థ ప్రారంభించిన లారెన్స్
[ 30-04-2024]
నృత్యదర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ పలు స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘మాట్రం’ అనే సంస్థనూ ఏర్పాటు చేశారు. దాని ద్వారా నిస్సహాయకులకు సాయం అందించనున్నట్టు ప్రకటించారు. -
పెళ్లి చేసుకోలేదని మహిళపై హత్యాయత్నం
[ 30-04-2024]
విరుదునగర్ జిల్లా రాజపాళయానికి చెందిన పెరుమాళ్సామి, జ్యోతి భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. మూడో కుమార్తె పాండిసెల్వి వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. -
రీ రిలీజ్కు సిద్ధంగా విజయ్ సేతుపతి సినిమాలు
[ 30-04-2024]
కోలీవుడ్లో ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. ‘వారణం ఆయిరం’, ‘వేట్టైయాడు విళైయాడు’, ‘3’, ‘విణ్ణైతాండి వరువాయా’ తదితర చిత్రాలు విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!