logo

రోడ్డుప్రమాదంలో ఆప్ఘనిస్తాన్‌ విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో విదేశీ విద్యార్థి మృతిచెందాడు. దీనికి సంబంధించి ఎంవీపీ స్టేషన్‌ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్‌ వి.ఎస్‌.కృష్ణా కళాశాల దరి ఎలియంట్‌ మేనేజ్‌మెంటు కళాశాలలో ఆప్ఘనిస్తాన్‌కు చెందిన హబీబుల్లా హుస్సేన్‌ (24) ఎం.బి.ఎ. మూడో ఏడాది చదువుతూ జోడుగుళ్లపాలెంలో

Published : 15 Jan 2022 05:13 IST

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో విదేశీ విద్యార్థి మృతిచెందాడు. దీనికి సంబంధించి ఎంవీపీ స్టేషన్‌ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. డాక్టర్‌ వి.ఎస్‌.కృష్ణా కళాశాల దరి ఎలియంట్‌ మేనేజ్‌మెంటు కళాశాలలో ఆప్ఘనిస్తాన్‌కు చెందిన హబీబుల్లా హుస్సేన్‌ (24) ఎం.బి.ఎ. మూడో ఏడాది చదువుతూ జోడుగుళ్లపాలెంలో నివాసముంటున్నాడు. గురువారం రాత్రి లాసన్స్‌బేకాలనీలో ఉంటున్న తన స్నేహితుని వద్దకు బైకుపై వస్తుండగా లుంబినీపార్కు వద్ద బైకు అదుపుతప్పడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు వైద్యం కోసం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. ప్రస్తుతానికి బైకు అదుపుతప్పి పడిపోయినట్లు భావిస్తున్నా.. ఆ సమయంలో వర్షం పడుతుండటంతో సంఘటన స్థలంలో చెట్టు పడి ఉంది. ఒకవేళ చెట్టు ఇతని మీద పడి ఉంటుందా? అనేది కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. సి.ఐ. పి.రమణయ్య ఆధ్వర్యంలో ఎస్సై భాస్కరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని