కష్టం ఫలించె.. ర్యాంకు వరించె..!
ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ విద్యార్థులు. ఇంటర్ ప్రారంభం నుంచి చదువే లోకంగా సాగారు.. ప్రతి సబ్జెక్టును సమగ్రంగా అభ్యసించి పట్టుపెంచుకున్నారు. నిత్యం నమూనా పరీక్షలు రాస్తూ తమ స్థాయిని అంచనా వేసుకున్నారు.
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల మెరుపులు
న్యూస్టుడే, గురుద్వారా, అక్కిరెడ్డిపాలెం, కూర్మన్నపాలెం, మద్దిలపాలెం, వేపగుంట, అక్కయ్యపాలెం
కార్పొరేషన్, న్యూస్టుడే: ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ విద్యార్థులు. ఇంటర్ ప్రారంభం నుంచి చదువే లోకంగా సాగారు.. ప్రతి సబ్జెక్టును సమగ్రంగా అభ్యసించి పట్టుపెంచుకున్నారు. నిత్యం నమూనా పరీక్షలు రాస్తూ తమ స్థాయిని అంచనా వేసుకున్నారు. ఎక్కడ వెనుకబడి ఉన్నారో తెలుసుకుంటూ..వైఫల్యాలను అధిగమిస్తూ ముందుకు సాగారు.. తదేక దీక్షతో జేఈఈ మెయిన్స్కు సిద్ధమై పరీక్షలు రాశారు. కష్టం ఫలించి ఉత్తమ ర్యాంకులు సాధించారు.. అడ్వాన్స్డ్లో కూడా ఉత్తమ ర్యాంకులు సాధించేలా కఠోరంగా శ్రమిస్తున్నారు. సోమవారం విడుదలైన జేఈఈ మెయిన్స్లో ప్రతిభ చూపిన వారిలో కొందరి వివరాలు ఇలా.
అన్ని సబ్జెక్టుల సమగ్ర అధ్యయనం
* గనిప చైతన్య సాయితేజ నీ ఆలిండియా 48, ఓబీసీ 8 (పర్సంటైల్ 99.998)
* తల్లిదండ్రులు జి.కృష్ణారావు, శ్రీలక్ష్మి. తండ్రి ఆర్మీలో ఉద్యోగి. నివాసం శ్రీకాకుళం జిల్లా పలాస.‘అన్ని సబ్జెక్టులు సమగ్రంగా చదివా’ అని చైతన్య పేర్కొన్నారు.
* ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేయడం.
మెటీరియల్ తోడ్పాటుతో..
* వెచ్చ జ్ఞానమహేష్
* ఆలిండియా 93, ఈడబ్ల్యూఎస్ 11
* వీరిది అల్లిపురం. తల్లిదండ్రులు రామారావు, ఝాన్సీ. తండ్రి కొవ్వొత్తుల వ్యాపారం చేస్తుంటారు.
* ముంబయి ఐఐటీలో సీటు సాధించడం.‘మెటీరియల్ తోడ్పాటుతో ఈ ర్యాంకు వచ్చింది’.
పరిశోధనల వైపు వెళ్తా..
* కొణతాల రష్మిత
* ఆలిండియా 186, ఓబీసీ 21 (పర్సంటైల్ 99.986)
* తల్లిదండ్రులు శ్రీనివాసరావు, అనురాధ. తండ్రి ఖజానాశాఖలో సీనియర్ అసిస్టెంట. నివాసం కొమ్మాది.
* ముంబయి ఐఐటీలో సీటు సాధించి, ఇంజినీరింగ్ పూర్తయిన తరువాత పరిశోధన వైపు వెళ్తా..
8వ తరగతి నుంచే దృష్టి
* రెడ్డి లీలా జోగేందర్ సాయి నీ ఆలిండియా 312, ఓబీసీ 42
* తల్లిదండ్రులు ఆర్.పైడపు నాయుడు, భారతి. తండ్రి ఉపాధ్యాయుడు. నివాసం బొబ్బిలి సమీపంలోని గుచ్చిమి గ్రామం.
* ముంబయి ఐఐటీలో సీటు సాధించడం. ‘8వ తరగతి నుంచే దృష్టిసారించాను’.
నిత్యం 10గంటలపాటు చదివా..
* గెడ్డ సాయి శశాంక్
* ఆలిండియా 281, ఓబీసీ 33
* తల్లిదండ్రులు జి.వేణు, శిరీష. తండ్రి ఉపాధ్యాయుడు. నివాసం విజయనగరం.
* ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేయడం. ‘నిత్యం పది గంటలు సాధన చేశాను’.
ఎప్పటి పాఠాలు అప్పుడే పూర్తి
* వాలేటి యశ్వంత్సాయి
* ఆలిండియా 603, ఓబీసీ 76
* తల్లిదండ్రులు అప్పలనాయుడు, పావని. తండ్రి ఉపాధ్యాయుడు. స్వగ్రామం పార్వతీపురం సమీపంలోని కుంకిడివరం.
* ముంబయి ఐఐటీలో సీఎస్ చేసి యాప్ డెవలపర్ అవుతా.‘ఎప్పటి పాఠాలు అప్పుడే పూర్తి చేయడం కలిచొచ్చింది’
పాఠాలను ఏకాగ్రతతో వినేవాడ్ని
* అమరాపు అనూప్
* ఆలిండియాలో 525, ఓబీసీ 67
* తండ్రి వెంకట సత్యనారాయణ రైల్వేల్లో విధులు నిర్వహిస్తున్నారు. తల్లి స్వర్ణకుమారి గృహిణి. నివాసం షీలానగర్ ఎస్ఆర్ గార్డెన్స్ ప్రాంతం.‘ కళాశాలలో అధ్యాపకులు చెప్పిన పాఠాలను ఏకాగ్రతతో వినేవాడ్ని. అంతే కాకుండా నిత్యం ఇంటి వద్ద ఆరేడు గంటలు చదివే వాడ్ని. ఏ రోజు సిలబస్ ఆరోజే పూర్తి చేసుకునేవాడిని’ రి ఐఐటీ ముంబయిలో కంప్యూటర్ సైన్స్ చదవడం.
నమూనా పరీక్షలు ఎక్కువగా రాశా..
* మామిడి భవ్యశ్రీ
* ఆలిండియా 673, ఓబీసీ 87
* తల్లిదండ్రులు కేశవరావు, శారద. తండ్రి ఉపాధ్యాయుడు.
* ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేయడం. ‘నేను నమూనా పరీక్షలు ఎక్కువగా సాధన చేశా’.
ఐఐటీలో చదవాలని..
* పొట్ల సాయిఆదర్శ్
* ఆల్ ఇండియా 292.
* వీరిది శాతవాహననగర్, రోడ్డు నెం.8, కూర్మన్నపాలెం. తండ్రి పి.వెంకట రామారావు ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. తల్లి రాధిక గృహిణి. ‘‘కళాశాలలో చేరినప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు బోధించిన అంశాలను ఇంటివద్ద పునః పరిశీలన చేసుకోవడం అలవాటుగా మార్చుకున్నాను. ప్రతీ రోజు ఇంటివద్ద 4 గంటలు చదివాను ’’
* మంచి కళాశాలలో ఐఐటీ చేసి ఉన్నత ఉద్యోగంలో స్థిరపడాలన్నది నా కల.
ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ
* సీహెచ్ అభిజిత్
* ర్యాంకు 404
* తల్లిదండ్రులు వెంకట బదిరి నారాయణ, నాగ వెంకట నరసమ్మ. తండ్రి కస్టమ్స్లో అధికారి. ద్వారకానగర్లో నివాసం ఉంటున్నారు. ‘అధ్యాపకులు చెప్పిన పాఠాన్ని మననం చేయడం, ప్రతి అంశంపైనా ప్రత్యేక శ్రద్ధపెట్టడం ద్వారా ర్యాంకు సాధ్యమైంది’.
* ఐఐటీ ముంబయిలో సీటు సాధించడం.
రోబోటిక్స్ అంటే ఆసక్తి
* ఆమిటి ప్రియాంక నీ ఆలిండియా 744, ఈడబ్ల్యూఎస్ 79
* తల్లిదండ్రులు ప్రసాద్, భారతి. తండ్రి నీటి పారుదలశాఖలో ఇంజినీరు. నివాసం సంబర ప్రాంతం.
* రోబోటిక్స్ రంగం అంటే ఆసక్తి.. ముంబయి ఐఐటీలో పూర్తి చేస్తా. మొదటి నుంచి ప్రణాళిక ప్రకారం చదివాను.
16 గంటల సాధన
* మహదాసు మాధవరాజ్
* ఆలిండియాల్ 495
* తండ్రి దేవీప్రసాద్ ఉపాధ్యాయులు. తల్లి మాధవి గృహిణి. సుజాతనగర్ దరి పాపయ్యరాజుపాలెం ‘‘రోజు 16 గంటల పాటు సాధనచేశాను’.
* ఏదైనా ఐఐటీలో బీటెక్ చేసి ఎంఎస్సీ చేయడం
కంప్యూటర్ సైన్స్లో రాణించాలని...
* డి.జాన్ జోసఫ్
* ఆల్ఇండియా ర్యాంకు 82, కేటగిరి 1వ ర్యాంకు
* వీరిది సీతమ్మధార ప్రాంతం. తండ్రి డి.విల్సన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగి, తల్లి: జోషిరత్నం గృహిణి ‘రోజూ ప్రణాళిక ప్రకారం 13 నుంచి 14 గంటల వరకు సాధన చేశాను. సబ్జెక్టును అర్ధం చేసుకొని పదే పదే సాధన చేసేవాడిని. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మంచి ర్యాంకు సాధించగలిగాను’’.
* ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేయాలని కోరిక’
నిత్యం మెరుగుపర్చుకున్నా..
* మజ్జి హర్షవర్థన్
* ఆలిండియా 807, ఓబీసీ 106 (పర్సంటైల్ 99.924)
* తల్లిదండ్రులు గౌరీశ్వరరావు, శారద. తండ్రి ఉపాధ్యాయుడు. ‘‘నిత్యం కళాశాలలో పరీక్షలు పెట్టేవారు. తద్వారా ఎప్పటికప్పుడు నా స్థాయి ఏమిటో తెలిసేది. నిత్యం నన్ను నేను మెరుగు పరుచుకుంటూ రావడంతో ర్యాంకు వచ్చింది’.
* ఐఐటీలో కంప్యూటర్ చేసి, ఐటీ ఎనలిస్ట్ అవుతా.
అదనంగా మరో 4 గంటలు
* జొన్నాడ యశోధర్
* 10 (రిజర్వు కేటగిరి), ఓపెన్లో 586
* వీరిది కంచరపాలెం. తండ్రి ప్రైవేటు కళాశాలలో ఉద్యోగి ‘‘ప్రతిరోజు కాలేజీలోనే కాకుండా అదనంగా నాలుగు గంటలు చదివేవాడిని.’’
* భవిష్యత్తులో ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేయాలని ఉంది.
అధ్యాపకుల శిక్షణలో...
* మయాంక్ అగర్వాల్
* ర్యాంక్ : 719
* వీరిది కిర్లంపూడి లేఅవుట్. తండ్రి అజేయ్కుమార్ కాంట్రాక్టర్. అమ్మ దీపాలి గృహిణి. ‘ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కళాశాలలో అధ్యాపకుల శిక్షణలో తర్ఫీదు పొందేవాడ్ని. ఇంటి దగ్గర ప్రతిరోజూ నాలుగు నుంచి ఐదు గంటల పాటు చదివేవాడ్ని’.
* ముంబయి ఐ.ఐ.టి.లో చేరి ఇ.ఇ.ఇ. చేయాలని కోరిక.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చింది.. ఆటో డ్రైవర్లను జగన్ ఆదుకుంటాడని అంతా ఊహించారు. రూ.పది వేల సాయం చేశాడని సంబరపడిపోయారు. ఆటోల మీద పన్నుల బాదుడు మొదలైన తరువాత కొద్ది రోజులకే పరిస్థితి వారికి అర్థమైంది. -
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడాశాఖను నిర్వీర్యం చేసింది. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. -
పేట వైకాపాలో రోజుకో వికెట్
[ 27-04-2024]
వైకాపా నుంచి రోజుకో వికెట్ పడుతోంది. తెదేపాలోకి చేరేందుకు నాయకులు క్యూ కడుతుండటంతో ఆ పార్టీ నాయకులకు శిరోభారం తప్పడం లేదు. -
ఎన్నికల వేళ..‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
విశాఖ లోక్సభ స్థానానికి 33 నామపత్రాల ఆమోదం
[ 27-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి దాఖలైన 39 నామపత్రాల్లో 33 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ), కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆమోదించారు. -
‘విశాఖ - మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు. -
ఎంపీ అభ్యర్థుల నామినేషన్లలో 22 ఆమోదం
[ 27-04-2024]
అనకాపల్లి ఎంపీ స్థానానికి 25 మంది అభ్యర్థుల నామినేషన్లలో మూడింటిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి తిరస్కరించారు. -
జగన్ వాహన మిత్రద్రోహి
[ 27-04-2024]
ఆటోలు, టాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు నడుపుతూ జీవనం సాగించే వారికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటిస్తూ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వాహన మిత్ర పథకం.. వాహన చోదకుల పాలిట శాపంగా మారింది. -
అనువుగాని ప్రాంగణం.. ఆడేందుకు అవస్థలు
[ 27-04-2024]
క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు క్రీడలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు. -
రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు
[ 27-04-2024]
కూటమి విజయంతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ పేర్కొన్నారు. -
కూటమితోనే అన్ని వర్గాలకు న్యాయం
[ 27-04-2024]
ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి చివరికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని పెందుర్తి తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు ధ్వజమెత్తారు. -
కూటమితోనే బంగారు భవిష్యత్తు
[ 27-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బంగారు భవిష్యత్తు సాధ్యమని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
అనుమానం పెనుభూతమై..
[ 27-04-2024]
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబంలో అనుమానపు బీజం పడింది. -
వైకాపా నాయకులు దోచుకున్న నగదే పంచి పెడుతున్నారు
[ 27-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైకాపా నాయకులు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని, దాన్ని ప్రజలు తిప్పికొట్టాలని భాజపా (కూటమి) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు అన్నారు. -
జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి
[ 27-04-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతికి చేరుకుందని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు గండిబాబ్జీ అన్నారు. -
ఎంవీవీ నామపత్రం ఆమోదంలో ఉత్కంఠ
[ 27-04-2024]
విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ నామపత్రం ఆమోదించే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
సుప్రభాత సేవ టికెట్ల పునః ప్రారంభం
[ 27-04-2024]
శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. -
డీఎల్ఈడీలో ప్రవేశాలకు ఆహ్వానం
[ 27-04-2024]
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ)లో ప్రవేశాల కోసం మే 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.