క్షీణిస్తున్న.. ‘ఆయుష్’
మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఇది.. ఇక్కడ పనిచేసే వైద్యాధికారిణి ఎం.సుమ సోమ, బుధ, శుక్రవారాలు ఇక్కడ
వైద్యులు, సిబ్బంది కొరత..
రోగులకు తప్పని వెతలు
మధురవాడ ఆయుర్వేద వైద్యశాల
మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఇది.. ఇక్కడ పనిచేసే వైద్యాధికారిణి ఎం.సుమ సోమ, బుధ, శుక్రవారాలు ఇక్కడ; మిగతా మూడురోజులు కేజీహెచ్ ఆయుర్వేద వైద్యశాలలో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ విధులు చేపడుతున్నారు. ఇలా మిగిలిన కేంద్రాల్లోనూ వేర్వేరు కారణాలతో వైద్యులు కాకుండా..సహాయకురాలే వైద్య సేవలు అందిస్తుండడంతో జిల్లాలో ఆయుష్ విభాగంలో ఉన్న వైద్య కేంద్రాలు నిరాదరణకు గురవుతున్నాయి.
న్యూస్టుడే, కొమ్మాది
* దేశీయ సంప్రదాయ వైద్యాన్ని అందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆయుష్ విభాగాన్ని 2007లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఆయుష్ అంటే ఆయుర్వేదం (ఎ), యోగా (వై), యునాని (యు), సిద్ధ (ఎస్), హోమియోపతి (హెచ్)గా పేర్కొన్నారు. వీటిని విశాఖ జిల్లా పరిధిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. మందులు సరిగా లేకపోవడం, వైద్యులు, సిబ్బంది కొరత తదితర కారణాలతో బాధితులు ఈ ఆసుపత్రుల వైపు రావడం తగ్గించేశారు. కరోనా ప్రభావంతో ఆయుర్వేదంపై ప్రజలకు ఆసక్తి పెరిగినా.. ఆ మేరకు ప్రభుత్వం ఈ కేంద్రాల్లో వైద్య సేవలు మెరుగుపరిచే చర్యలు చేపట్టడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.
ఇదీ జిల్లాలో పరిస్థితి...
విశాఖ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 12 ఆయుష్ వైద్యశాలలున్నాయి. ఇందులో
ఆయుర్వేదం 5, హోమియోపతి 5, యునాని 2 ఉన్నాయి.
* కేజీహెచ్ ఆవరణలో, మధురవాడ, శొంఠ్యాం, ఉక్కునగరం, రేవిడిలలో ఆయుర్వేద వైద్యశాలలు ఉండగా ఉక్కు నగరంలో సహాయకులే తప్ప వైద్యాధికారి లేరు. మధురవాడ, కేజీహెచ్ కేంద్రాల్లో వారానికి మూడు రోజులు చొప్పున వైద్యాధికారిణి విధులు చేపడుతున్నారు.
*హోమియోపతి వైద్యశాలలు ప్రసాద్ గార్డెన్స్, అడివివరం, మింది, అగనంపూడి, వేపగుంట ప్రాంతాల్లో ఉన్నాయి. వేపగుంట వైద్యులు బదిలీపై వెళ్లగా అక్కడ వైద్యులెవరూ అందుబాటులో లేరు.
* ఇక యునాని వైద్యశాలలు ఏవీఎన్ కళాశాల సమీప రెల్లివీధిలో ఒకటి ఉండగా, భీమునిపట్నంలో ఒకటి ఉంది. రెల్లివీధిలో ఉన్న కేంద్రంలో సీనియర్ వైద్యులు ఉండగా భీమునిపట్నంలో వైద్యులే లేరు. ఇన్ఛార్జి వైద్యులతో, అటెండర్లతో మమ అనిపిస్తున్నారు. ఏళ్ల తరబడి ఖాళీలు భర్తీ చేయడం లేదు. కొన్ని చోట్ల పక్కా భవనాలు, సరిపడా మందులు కూడా లేవు.
ఇవి అవసరం...
* అన్ని ఆయుష్ వైద్య కేంద్రాల్లో వైద్యులు, కాంపౌండర్, అటెండర్లు ఉండేలా నియామకాలు చేపట్టాలి.
* గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు అధికంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. వీటిలో కీళ్లనొప్పులు, ఉబ్బసం, అలర్జీ, థైరాయిడ్, పక్షవాతం, చర్మవ్యాధులతో పాటు జలుబు, దగ్గు, జ్వరం, సాధారణ నొప్పి, మూత్ర పిండాల్లో రాళ్లు, పైల్స్, టాన్సిలైటిస్ వంటి శస్త్ర చికిత్సలు అవసరం లేకుండా వినియోగించే నాణ్యమైన మందులు అందుబాటులో ఉంచాలి.
* సహజ సిద్ధమైన ఉచిత వైద్య సేవలపై అవగాహన కల్పించి ప్రజలను చైతన్యవంతులను చేయాలి. ఇలా చేస్తే ప్రాణాంతక వ్యాధుల తీవ్రతను తగ్గించగలమని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.
వైద్యుల ఖాళీల భర్తీకి చర్యలు
ఆయుష్ ఆసుపత్రుల్లో వైద్యుల ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటికే సంబంధిత నివేదిక ఉన్నతాధికారులకు పంపించాం. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. ప్రకృతి సిద్ధమైన మందుల వినియోగం, వివిధ రకాల వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం. -డాక్టర్ శేఖర్, ఆయుష్ ప్రాంతీయ ఉపసంచాలకుడు, జోన్-1
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడాశాఖను నిర్వీర్యం చేసింది. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. -
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చింది.. ఆటో డ్రైవర్లను జగన్ ఆదుకుంటాడని అంతా ఊహించారు. రూ.పది వేల సాయం చేశాడని సంబరపడిపోయారు. ఆటోల మీద పన్నుల బాదుడు మొదలైన తరువాత కొద్ది రోజులకే పరిస్థితి వారికి అర్థమైంది. -
పేట వైకాపాలో రోజుకో వికెట్
[ 27-04-2024]
వైకాపా నుంచి రోజుకో వికెట్ పడుతోంది. తెదేపాలోకి చేరేందుకు నాయకులు క్యూ కడుతుండటంతో ఆ పార్టీ నాయకులకు శిరోభారం తప్పడం లేదు. -
ఎన్నికల వేళ..‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
విశాఖ లోక్సభ స్థానానికి 33 నామపత్రాల ఆమోదం
[ 27-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి దాఖలైన 39 నామపత్రాల్లో 33 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ), కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆమోదించారు. -
‘విశాఖ - మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు. -
ఎంపీ అభ్యర్థుల నామినేషన్లలో 22 ఆమోదం
[ 27-04-2024]
అనకాపల్లి ఎంపీ స్థానానికి 25 మంది అభ్యర్థుల నామినేషన్లలో మూడింటిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి తిరస్కరించారు. -
జగన్ వాహన మిత్రద్రోహి
[ 27-04-2024]
ఆటోలు, టాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు నడుపుతూ జీవనం సాగించే వారికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటిస్తూ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వాహన మిత్ర పథకం.. వాహన చోదకుల పాలిట శాపంగా మారింది. -
అనువుగాని ప్రాంగణం.. ఆడేందుకు అవస్థలు
[ 27-04-2024]
క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు క్రీడలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు. -
రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు
[ 27-04-2024]
కూటమి విజయంతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ పేర్కొన్నారు. -
కూటమితోనే అన్ని వర్గాలకు న్యాయం
[ 27-04-2024]
ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి చివరికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని పెందుర్తి తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు ధ్వజమెత్తారు. -
కూటమితోనే బంగారు భవిష్యత్తు
[ 27-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బంగారు భవిష్యత్తు సాధ్యమని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
అనుమానం పెనుభూతమై..
[ 27-04-2024]
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబంలో అనుమానపు బీజం పడింది. -
వైకాపా నాయకులు దోచుకున్న నగదే పంచి పెడుతున్నారు
[ 27-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైకాపా నాయకులు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని, దాన్ని ప్రజలు తిప్పికొట్టాలని భాజపా (కూటమి) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు అన్నారు. -
జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి
[ 27-04-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతికి చేరుకుందని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు గండిబాబ్జీ అన్నారు. -
ఎంవీవీ నామపత్రం ఆమోదంలో ఉత్కంఠ
[ 27-04-2024]
విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ నామపత్రం ఆమోదించే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
సుప్రభాత సేవ టికెట్ల పునః ప్రారంభం
[ 27-04-2024]
శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. -
డీఎల్ఈడీలో ప్రవేశాలకు ఆహ్వానం
[ 27-04-2024]
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ)లో ప్రవేశాల కోసం మే 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.