భూ వివాదాలు.. తేలేనా?
విశాఖలో సంచలనం రేపిన భూ వివాదాలెన్నో. ఆక్రమణలు.. కుంభకోణాలు.. ఇతరత్రా సమస్యలు కోకొల్లలుగా అధికారుల దృష్టికి వచ్చినా వాస్తవాలేమిటో తేల్చడం లేదు. ఇందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు (సిట్) నివేదికలు కీలకంగా మారాయి.
లబోదిబోమంటున్న 22ఏ బాధితులు
ఈనాడు, విశాఖపట్నం
సిట్ పరిశీలనకు వచ్చిన దస్త్రాలు(పాతచిత్రం)
విశాఖలో సంచలనం రేపిన భూ వివాదాలెన్నో. ఆక్రమణలు.. కుంభకోణాలు.. ఇతరత్రా సమస్యలు కోకొల్లలుగా అధికారుల దృష్టికి వచ్చినా వాస్తవాలేమిటో తేల్చడం లేదు. ఇందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు (సిట్) నివేదికలు కీలకంగా మారాయి.
ఏళ్లుగా అనుభవదారులుగా ఉన్న రైతులకు చెందిన జిరాయితీ భూములను 22ఏ చేర్చడంపై ఫిర్యాదులు అందాయి. కార్యాలయాల చుట్టూ బాధితులు తిరుగుతున్నా వారికి ఉపశమనం దక్కడం లేదు. విశాఖ కేంద్రంగా 4న జరిగే ప్రాంతీయ రెవెన్యూ సదస్సులో ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చించాలని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
మొదటి సిట్లో..
అప్పటి గ్రేహౌండ్స్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 2017లో ఏర్పాటు చేసిన మొదటి సిట్కు మొత్తంగా 2,875 ఫిర్యాదులు అందాయి. ఇందులో 330 వినతులను పరిగణలోకి తీసుకున్నారు. వీటితో పాటు 15 ఏళ్లలో జారీ చేసిన 68 ఎన్వోసీ(నిరభ్యంతర పత్రం)లపైనా అప్పట్లో దర్యాప్తు చేశారు. ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. భూ ఆక్రమణల్లో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు వ్యక్తులు, రియల్టర్లు, కొందరు ప్రజాప్రతినిధులు... ఇలా 450 మంది పాత్ర ఉన్నట్లు అందులో పేర్కొన్నట్లు సమాచారం.
* అనంతరం దీనిపై ముగ్గురు సీనియర్ అధికారులతో గత ప్రభుత్వం కమిటీ వేసింది. విశాఖలో గతంలో కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లుగా పనిచేసిన 8 మంది ఐఏఎస్లు, 16 మంది డిప్యూటీ కలెక్టర్లు, ఇంకా వంద మంది అధికారులపై క్రమశిక్షణ చర్యలు, క్రిమినల్ కేసులు పెట్టాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. ఇందులోనే పలు భూములకు ఎన్వోసీలు ఇచ్చిన వారిపైనా క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసినట్లు తెలిసింది.
* వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖలోని భూ వివాదాలను నిగ్గుతేలుస్తామని 2019లో విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్కుమార్ను సిట్ ఛైర్మన్గా నియమించి ఇద్దరు సభ్యులతో కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక సమర్పించినా దాని మీదా ఎటువంటి చర్యలు లేవు. ఆక్రమణలపై ప్రభుత్వాల కంటితుడుపు చర్య తప్ప బాధితుల సమస్యలను పట్టించుకోవడం లేదని గగ్గోలుపెడుతున్నారు.
ఆశగా ఎదురు చూస్తూ..
రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని ఎందరో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా 22ఏ జాబితాల్లో ఉన్న ఆస్తులను... అందులోనుంచి తొలగించుకోవడానికి వినతులు అందిస్తూనే ఉన్నారు. ఇటీవల న్యాయస్థానం ఆదేశాల మేరకు కొన్ని భూములను 22ఏ జాబితా నుంచి తొలిగించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇదే సమయంలో సామాన్యులకు చెందిన సమస్యలూ పరిశీలించి చర్యలు తీసుకుంటారని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ఆ భూముల నివేదిక పంపితే దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. నిషేధిత భూములపై శనివారం నాటి సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఎవరు స్పందిస్తారో..
మధురవాడలో అన్ని అనుమతులు ఉన్నాయనడంతో ప్లాటు కొనుగోలు చేశా. తీరా ఆ స్థలాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. జీవీఎంసీ వివరణ కోరితే వీఎంఆర్డీఏ లేఅవుట్ అనుమతి ఇవ్వడంతో తాము అనుమతి ఇచ్చామన్నారు. వీఎంఆర్డీఏను అడిగితే.. రెవెన్యూ అధికారులు సమస్య లేదని చెబితేనే అనుమతిచ్చామన్నారు. రెవెన్యూ వారిని ఎన్నిసార్లు అడిగినా... మా సమస్యను పరిష్కరించడం లేదు.
* దీంతో విసిగిపోయిన నేను నలుగురు సీసీఎల్ఏలు, ఇద్దరు సీఎంలను కలిసి వినతులు ఇచ్చా. ఎంతకూ న్యాయం జరగకపోవడంతో కొందరు ఉన్నతాధికారుల సూచనతో ఎనిమిది మంది అధికారుల మీద చీటింగ్ కేసు పెట్టా. ఈ మోసంపై ఇప్పటికే స్పందనలో నాలుగుసార్లు అధికారుల మీద ఫిర్యాదు చేశా. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి దీని మీద వినతి పత్రం ఇచ్చా. ఎవరూ పట్టించుకోవడం లేదు. మరి ఎవరు స్పందిస్తారో అర్థం కావడం లేదు. ఎక్కడ తప్పు జరిగిందో తేల్చి చర్యలు తీసుకోవాలన్నదే మా విన్నప్పం.
చిన్నారావు, విశాఖపట్నం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చింది.. ఆటో డ్రైవర్లను జగన్ ఆదుకుంటాడని అంతా ఊహించారు. రూ.పది వేల సాయం చేశాడని సంబరపడిపోయారు. ఆటోల మీద పన్నుల బాదుడు మొదలైన తరువాత కొద్ది రోజులకే పరిస్థితి వారికి అర్థమైంది. -
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడాశాఖను నిర్వీర్యం చేసింది. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. -
పేట వైకాపాలో రోజుకో వికెట్
[ 27-04-2024]
వైకాపా నుంచి రోజుకో వికెట్ పడుతోంది. తెదేపాలోకి చేరేందుకు నాయకులు క్యూ కడుతుండటంతో ఆ పార్టీ నాయకులకు శిరోభారం తప్పడం లేదు. -
ఎన్నికల వేళ..‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
విశాఖ లోక్సభ స్థానానికి 33 నామపత్రాల ఆమోదం
[ 27-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి దాఖలైన 39 నామపత్రాల్లో 33 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ), కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆమోదించారు. -
‘విశాఖ - మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు. -
ఎంపీ అభ్యర్థుల నామినేషన్లలో 22 ఆమోదం
[ 27-04-2024]
అనకాపల్లి ఎంపీ స్థానానికి 25 మంది అభ్యర్థుల నామినేషన్లలో మూడింటిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి తిరస్కరించారు. -
జగన్ వాహన మిత్రద్రోహి
[ 27-04-2024]
ఆటోలు, టాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు నడుపుతూ జీవనం సాగించే వారికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటిస్తూ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వాహన మిత్ర పథకం.. వాహన చోదకుల పాలిట శాపంగా మారింది. -
అనువుగాని ప్రాంగణం.. ఆడేందుకు అవస్థలు
[ 27-04-2024]
క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు క్రీడలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు. -
రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు
[ 27-04-2024]
కూటమి విజయంతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ పేర్కొన్నారు. -
కూటమితోనే అన్ని వర్గాలకు న్యాయం
[ 27-04-2024]
ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి చివరికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని పెందుర్తి తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు ధ్వజమెత్తారు. -
కూటమితోనే బంగారు భవిష్యత్తు
[ 27-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బంగారు భవిష్యత్తు సాధ్యమని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
అనుమానం పెనుభూతమై..
[ 27-04-2024]
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబంలో అనుమానపు బీజం పడింది. -
వైకాపా నాయకులు దోచుకున్న నగదే పంచి పెడుతున్నారు
[ 27-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైకాపా నాయకులు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని, దాన్ని ప్రజలు తిప్పికొట్టాలని భాజపా (కూటమి) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు అన్నారు. -
జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి
[ 27-04-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతికి చేరుకుందని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు గండిబాబ్జీ అన్నారు. -
ఎంవీవీ నామపత్రం ఆమోదంలో ఉత్కంఠ
[ 27-04-2024]
విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ నామపత్రం ఆమోదించే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
సుప్రభాత సేవ టికెట్ల పునః ప్రారంభం
[ 27-04-2024]
శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. -
డీఎల్ఈడీలో ప్రవేశాలకు ఆహ్వానం
[ 27-04-2024]
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ)లో ప్రవేశాల కోసం మే 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.