logo

KS Bharat: శారదాపీఠంలో క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌

టీమ్‌ ఇండియా టెస్టు జట్టు వికెట్ కీపర్‌ కేఎస్‌.భరత్‌ గురువారం సతీసమేతంగా విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు.

Updated : 17 Mar 2023 09:29 IST

స్వామీజీతో మాట్లాడుతున్న భరత్‌ దంపతులు

చినముషిడివాడ(పెందుర్తి), న్యూస్‌టుడే: టీమ్‌ ఇండియా టెస్టు జట్టు వికెట్ కీపర్‌ కేఎస్‌ భరత్‌ గురువారం సతీసమేతంగా విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిని కలిసి ఆయన ఆశీర్వచనాలు అందుకున్నారు. గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడేందుకు అహ్మదాబాద్‌ వెళ్తున్నట్లు భరత్‌ స్వామీజీకి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని