logo

విశాఖ పర్యాటక అభివృద్ధికి కేంద్రం నిధులు

విశాఖపట్నం ఓడరేవులోని ఔటర్‌ హార్బర్‌ క్రూయిజ్‌ బెర్త్‌ నిర్మాణం కోసం కేంద్ర పర్యాటకశాఖ నిధులు మంజూరు చేసిందని కేంద్ర పర్యాటక శాఖమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

Published : 24 Mar 2023 05:45 IST

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: విశాఖపట్నం ఓడరేవులోని ఔటర్‌ హార్బర్‌ క్రూయిజ్‌ బెర్త్‌ నిర్మాణం కోసం కేంద్ర పర్యాటకశాఖ నిధులు మంజూరు చేసిందని కేంద్ర పర్యాటక శాఖమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పార్లమెంటులో ఎంపీ జీవీఎల్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ విధంగా బదులిచ్చారని ఎంపీ జీవీఎల్‌ కార్యాలయవర్గాలు తెలిపాయి. క్రూయిజ్‌ బెర్త్‌ నిర్మాణ మొత్తం ప్రాజెక్ట్‌ వ్యయం 38.50 కోట్లు కాగా రూ.29.91 కోట్లను పర్యాటక శాఖ ఇప్పటికే పోర్టుట్రస్టుకు  మంజూరు చేసిందని కేంద్రమంత్రి తెలిపారన్నారు. క్రూయిజ్‌ టెర్మినల్‌ పనులు 64 శాతం పూర్తయ్యాయని.. అలాగే సింహాచలం దేవస్థానంలో ప్రసాద్‌ పథకం కింద రూ.54.04 కోట్ల నిధులు అందించడానికి కేంద్రం నిర్ణయించిందని మంత్రి తెలిపారని జీవీఎల్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని