స్టెప్పేస్తే మెరుపు.. లోకేష్దే గెలుపు
చిన్నప్పటి నుంచి నృత్యంపై ఉన్న ఆసక్తి ఆ యువకుడిని ఢీ టైటిల్ విజేతగా నిలిపేలా చేసింది. ఈటీవీలో ఢీ-15లో ఎస్9 టీంలో అనకాపల్లికి చెందిన కర్రి లోకేష్ తొమ్మిది మంది సభ్యుల్లో
ఢీ షోలో అదరగొట్టిన అనకాపల్లి కుర్రాడు
కుటుంబ సభ్యులతో..
అనకాపల్లి పట్టణం, న్యూస్టుడే: చిన్నప్పటి నుంచి నృత్యంపై ఉన్న ఆసక్తి ఆ యువకుడిని ఢీ టైటిల్ విజేతగా నిలిపేలా చేసింది. ఈటీవీలో ఢీ-15లో ఎస్9 టీంలో అనకాపల్లికి చెందిన కర్రి లోకేష్ తొమ్మిది మంది సభ్యుల్లో ఒకరిగా ఢీ టైటిల్ విజేత ట్రోఫీ అందుకున్నాడు. దీనికి గాను బృందానికి రూ.75 లక్షల నగదు వచ్చినట్లు లోకేష్ తెలిపారు.
అనకాపల్లికి చెందిన కర్రి లోకేష్ బీటెక్ పూర్తి చేశాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి నాగమణి కిరాణాషాపు పెట్టి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. ముగ్గురు కుమారుల్లో చిన్నవాడైన లోకేష్కు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఆసక్తి. తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో వారియర్స్ డాన్స్ ట్రూప్లో నృత్య సాధన చేసేవాడు. పలు ప్రదర్శనలు ఇచ్చాడు. 2019లో విశాఖపట్నం బాబీ మాస్టర్ గ్రూపులో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్గా తొలిసారిగా ఈటీవీ ఢీ షోలో పాల్గొన్నాడు. 2020లో చెర్రి మాస్టర్ గ్రూపులో, ఢీ-13 సాయి గ్రూపులో, ఢీ-14లో సోమేష్ మాస్టర్ గ్రూపులో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్గా గుర్తింపు పొందాడు. అలా ఢీ-15లో సోమేష్ సారథ్యంలో ఎస్9లో తొమ్మిది మంది డాన్సర్లతో కలిసి టీంగా పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో అద్భుత ప్రతిభతో ఈ టీం టైటిల్ విజేతగా నిలిచింది. మే 31న టైటిల్ను అందుకున్నారు. ఇది తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని లోకేష్ ‘న్యూస్టుడే’కు తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ను అనకాపల్లి వాసులు, కళాకారులు అభినందించారు.
జీవితాల్ని మార్చేసిన షో..
డాన్సర్లకు ఈటీవీ ఢీషో వరంగా మారింది. జీరోగా ఉన్న ఎంతో మందిని హీరోలుగా చేసింది. ఎంతో మంది డాన్స్ మాస్టర్లు ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చారు. నా లాంటి ఎంతో మందికి మంచి జీవితాన్ని అందించింది. ఒక్కసారి ఇందులో ప్రవేశిస్తే వారి జీవితమే మారిపోతుంది.
కర్రి లోకేష్, అనకాపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
అభివృద్ధికి చంద్రబాబు గెలుపు అవసరం
[ 25-04-2024]
రాష్ట్రానికి తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పరిపాలన ఎంతో అవసరమని, కూటమి పార్టీల నేతలందరూ సమన్వయంతో ప్రచారానికి సిద్ధం కావాలని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
నామినేషన్ల ఘట్టం నేటివరకే..
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం గురువారంతో ముగియనుంది. బుధవారం మూడు అసెంబ్లీ స్థానాలకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. అరకు అసెంబ్లీ స్థానానికి జై భారత్ జాతీయ పార్టీ తరఫున బురిడి ఉపేంద్ర మరో సెట్ నామపత్రాలు సమర్పించారు. -
జగన్ పాలన.. జ్వరాల విజృంభణ!
[ 25-04-2024]
మన్యంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. అసలు ఇక్కడ మలేరియా వ్యాప్తి లేదంటూ తప్పుడు లెక్కలు చూపుతూ కాలం వెల్లదీసిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల వేళ దోమల నివారణకు మందు పిచికారీ అంటూ హుడావుడి చేస్తోంది. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. -
చెక్ డ్యామ్లపై జగన్ ఉక్కుపాదం
[ 25-04-2024]
గిరిజన ప్రాంతంలోని పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో చెక్డ్యామ్లకు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. -
కూటమి అభ్యర్థుల విజయంతో పేదలకు మేలు
[ 25-04-2024]
ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్ధి మిరియాల శిరీషాదేవిలను గెలపించాలని కోరుతూతెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం చింతూరు సంత, ఎటపాక మండలం నెల్లిపాక పంచాయతీ బొట్లకుంటలో ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..