ప్రలోభాలపై నిఘా... ఉల్లంఘనలపై కఠిన చర్యలు
జిల్లాలో ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించబోమని, రాజకీయ పార్టీల ప్రలోభాలపై అనుక్షణం నిఘా ఉంచామని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు.
ఇంత వరకు రూ.85లక్షల విలువ చేసే సొత్తు సీజ్
భద్రతకు అదనంగా నాలుగు కంపెనీల కేంద్ర బలగాలు
ఇంటర్వ్యూలో కలెక్టర్ మల్లికార్జున
జిల్లాలో ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించబోమని, రాజకీయ పార్టీల ప్రలోభాలపై అనుక్షణం నిఘా ఉంచామని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. పార్టీల ప్రచారాలు, వాహనాల వినియోగానికి 48గంటలలోపు అనుమతులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు mవివరించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లు, నియమావళి అమలు సహా వివిధ అంశాలపై కలెక్టర్ బుధవారం ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు.
న్యూస్టుడే, వన్టౌన్
జిల్లాలో పోలింగ్ శాతం పెంపునకు చర్యలు తీసుకుంటున్నాం. 2019 ఎన్నికల్లో 65 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈ సారి 75శాతం నమోదయ్యేలా చూస్తున్నాం. అపార్టుమెంట్ వాసులు, గేటెడ్ కమ్యూనిటీ నివాసితులకు ఓటు వేయాలని అవగాహన కల్పిస్తున్నాం. తటస్తులై ఉండి, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల ద్వారా ఓటు ప్రాముఖ్యతపై అవగాహన శిబిరాలు నిర్వహించనున్నాం. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని నీడ లేని పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ రోజున షామియానాలు వేయనున్నాం. వృద్ధులు, దివ్యాంగులు అధికంగా ఉంటే కుర్చీలను ఏర్పాటు చేస్తాం. ఈసారి మూడు క్యూలైన్లు ఏర్పాటు చేయబోతున్నాం. పురుషులు, మహిళలు, దివ్యాంగులు/వృద్ధులకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించనున్నాం.
10 మంది వాలంటీర్లపై వేటు
ఎపిక్ కార్డులో తప్పులు ఉన్నంత మాత్రాన ఓటు వేయడానికి అభ్యంతరం ఉండబోదు. 1950 టోల్ఫ్రీ నెంబరుకు ఫోను చేసి ఓటు సమాచారం తెలుసుకోవచ్చు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ 0891-2590100కు ఫోను చేసి సమాచారం పొందవచ్చు. అర్హులైన వారు ఇప్పటికీ ఆన్లైన్లో ఓటు నమోదు చేసుకోవచ్చు. బీఎల్ఓలు ఇళ్లకు వచ్చి పరిశీలన చేస్తారు. దరఖాస్తు దారునితో సెల్ఫీ కూడా తీసుకుంటారు. దొంగ ఓట్ల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉంటున్నాం. ఈసీ నిబంధనల ప్రకారం వాలంటీర్లు రాజకీయ పార్టీల సమావేశాల్లో పాల్గొనరాదు. ఉల్లంఘించిన 10మంది వాలంటీర్లు, పొరుగు, ఒప్పంద సేవలకు చెందిన ఇద్దరు ఉద్యోగులపై వేటు వేశాం.
479 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
ఎన్నికల ప్రచారాలకు అనుమతులు ఇచ్చే విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాం. ఈసీ నిబంధనల ప్రకారం పార్లమెంటు పరిధిలో నేను, అసెంబ్లీల పరిధితో ఆర్ఓలు అనుమతులు ఇస్తున్నారు. ఇంతవరకు అసెంబ్లీల పరిధిలో 46, నా పరిధిలో 32 అనుమతులు ఇచ్చాం. పోలింగ్ నిర్వహణకు పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో 1991 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వెయ్యి కేంద్రాల పరిధిలో వెబ్ కాస్టింగ్ పెడుతున్నాం. మిగిలిన 991 కేంద్రాల్లో 479 సమస్యాత్మకంగా గుర్తించాం. కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. నాలుగున్నర కంపెనీల కేంద్ర బలగాలు అవసరమని ప్రతిపాదనలు పంపాం.
సీ-విజిల్ ఫిర్యాదులపై తక్షణం చర్యలు..
సీ-విజిల్కు ఇంత వరకు 165 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 35 ఎన్నికలతో సంబంధం లేనివిగా గుర్తించి పక్కన పెట్టాం. మిగిలిన వాటి విషయంలో వెంటనే చర్యలు తీసుకున్నాం. రాజకీయ పార్టీల ప్రలోభాలపై 88 బృందాలు నిఘా పెట్టాయి. ఇంత వరకు రూ.85లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నాం. ఇంటింటి ప్రచారాలు, వాహనాల అనుమతులకు దరఖాస్తులు వస్తున్నాయి. నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇంత వరకు జిల్లా వ్యాప్తంగా 11,200 జెండాలు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామగ్రిని తొలగించామని కలెక్టర్ మల్లికార్జున వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చింది.. ఆటో డ్రైవర్లను జగన్ ఆదుకుంటాడని అంతా ఊహించారు. రూ.పది వేల సాయం చేశాడని సంబరపడిపోయారు. ఆటోల మీద పన్నుల బాదుడు మొదలైన తరువాత కొద్ది రోజులకే పరిస్థితి వారికి అర్థమైంది. -
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడాశాఖను నిర్వీర్యం చేసింది. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. -
పేట వైకాపాలో రోజుకో వికెట్
[ 27-04-2024]
వైకాపా నుంచి రోజుకో వికెట్ పడుతోంది. తెదేపాలోకి చేరేందుకు నాయకులు క్యూ కడుతుండటంతో ఆ పార్టీ నాయకులకు శిరోభారం తప్పడం లేదు. -
ఎన్నికల వేళ..‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
విశాఖ లోక్సభ స్థానానికి 33 నామపత్రాల ఆమోదం
[ 27-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి దాఖలైన 39 నామపత్రాల్లో 33 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ), కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆమోదించారు. -
‘విశాఖ - మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు. -
ఎంపీ అభ్యర్థుల నామినేషన్లలో 22 ఆమోదం
[ 27-04-2024]
అనకాపల్లి ఎంపీ స్థానానికి 25 మంది అభ్యర్థుల నామినేషన్లలో మూడింటిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి తిరస్కరించారు. -
జగన్ వాహన మిత్రద్రోహి
[ 27-04-2024]
ఆటోలు, టాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు నడుపుతూ జీవనం సాగించే వారికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటిస్తూ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వాహన మిత్ర పథకం.. వాహన చోదకుల పాలిట శాపంగా మారింది. -
అనువుగాని ప్రాంగణం.. ఆడేందుకు అవస్థలు
[ 27-04-2024]
క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు క్రీడలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు. -
రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు
[ 27-04-2024]
కూటమి విజయంతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ పేర్కొన్నారు. -
కూటమితోనే అన్ని వర్గాలకు న్యాయం
[ 27-04-2024]
ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి చివరికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని పెందుర్తి తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు ధ్వజమెత్తారు. -
కూటమితోనే బంగారు భవిష్యత్తు
[ 27-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బంగారు భవిష్యత్తు సాధ్యమని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
అనుమానం పెనుభూతమై..
[ 27-04-2024]
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబంలో అనుమానపు బీజం పడింది. -
వైకాపా నాయకులు దోచుకున్న నగదే పంచి పెడుతున్నారు
[ 27-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైకాపా నాయకులు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని, దాన్ని ప్రజలు తిప్పికొట్టాలని భాజపా (కూటమి) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు అన్నారు. -
జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి
[ 27-04-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతికి చేరుకుందని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు గండిబాబ్జీ అన్నారు. -
ఎంవీవీ నామపత్రం ఆమోదంలో ఉత్కంఠ
[ 27-04-2024]
విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ నామపత్రం ఆమోదించే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
సుప్రభాత సేవ టికెట్ల పునః ప్రారంభం
[ 27-04-2024]
శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. -
డీఎల్ఈడీలో ప్రవేశాలకు ఆహ్వానం
[ 27-04-2024]
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ)లో ప్రవేశాల కోసం మే 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో