ఐటీనా.. అదెక్కడుంది..!
యువతకు అత్యధిక ఉద్యోగాలు కల్పించే ఐటీ రంగం జగన్ పాలనలో కుదేలైంది. చంద్రబాబు హయాంలో విశాఖలోని ఐటీ హిల్స్పై నెలకొల్పిన సంస్థలు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయో తెలియని పరిస్థితి.
విశాఖలో సాంకేతిక రంగాన్ని అటకెక్కించిన జగన్
ఇంజినీరింగ్ చేసిన యువతను వాలంటీర్లుగా మార్చిన వైకాపా
యువతకు అత్యధిక ఉద్యోగాలు కల్పించే ఐటీ రంగం జగన్ పాలనలో కుదేలైంది. చంద్రబాబు హయాంలో విశాఖలోని ఐటీ హిల్స్పై నెలకొల్పిన సంస్థలు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయో తెలియని పరిస్థితి. వైకాపా పాలనలో విశాఖలోని పలు ఐటీ సంస్థలు ఇక్కడి నుంచి పారిపోయే దుస్థితికి తీసుకొచ్చారు. ఐటీ టెక్నాలజీలో ఇంజినీరింగ్ చదువులు పూర్తి చేసిన విద్యార్థులకు ఉపాధి లేక పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్నారు. చివరికి ఇక్కడ ఉద్యోగాలు లేక రూ.5 వేల గౌరవ వేతనానికి వాలంటీర్లుగా కూడా పని చేస్తున్న ఇంజినీరింగ్ చేసిన పట్టభద్రులున్నారంటే ఐటీ రంగం దుస్థితిని అంచనా వేయొచ్చు.
న్యూస్టుడే, పెందుర్తి, వేపగుంట, పరవాడ, సబ్బవరం
- బీటెక్ పూర్తి చేసినా..: నేను బీటెక్ పూర్తి చేశాను. విశాఖలో ఎలాంటి ఉపాధి అవకాశాలు రాలేదు. ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాలొచ్చినా ఎటూచాలని జీతాలతో పొరుగు రాష్ట్రాల్లో పని చేయడం చాలాకష్టం. చాలామంది యువత నైపుణ్యాలు లేక మంచి ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా యువతకు మెరుగులు దిద్దితే మంచి ఉపాధి పొందే అవకాశం ఉంటుంది.
ఎ.ఉమామహేశ్వరరావు, పులగవానిపాలెం
ఐటీ మంత్రిది విశాఖే అయినా..
ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ విశాఖకు చెందిన వ్యక్తే అయినప్పటికీ జిల్లాకు ఒక్క పరిశ్రమ తెప్పించలేకపోయారు. ఐటీ రంగాన్ని ప్రోత్సహించినట్లయితే యువతకు ఎక్కువగా ఉద్యోగాలు వచ్చేవి. విద్యార్థులు కుటుంబ సభ్యులను వదిలిపెట్టి మరో గత్యంతరం లేక బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలకు వలస పోతున్నారు.
ఎస్.ఆర్.కృష్ణ, సబ్బవరం
ఐటీ హబ్ ఎక్కడుందో తెలీదు..:
జిల్లాలోనే ఐటీ మంత్రి ఉన్నప్పటికీ ఒక్కటంటే ఒక్క ఐటీ కంపెనీని ప్రారంభించలేకపోయారు. నగరంలో ఐటీ హబ్ను ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. అది ఎక్కడ ఏర్పాటు చేశారన్నది ఆయనకే తెలియాలి. ఐటీ రంగం అభివృద్ధి చేయకపోవడంతో విద్యార్థులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
సంధ్య, సింహాద్రినగర్
- యువతను మోసం చేసిన జగన్..: సీఎం జగన్మోహన్రెడ్డి ఐటీ రంగాన్ని నిర్వీర్యం చేశారు. ఆయన హయాంలో ఎటువంటి పరిశ్రమలు రాలేదు. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని గొప్పగా ప్రచారం చేసుకుని దాన్నీ గాలికొదిలేశారు. చంద్రబాబు హయాంలో ఐటీ రంగం అభివృద్ధి చెందడంతో ఎంతోమంది దేశ, విదేశాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
మేడశెట్టి బాలాజీనాయుడు, ఈ.భోనంగి
- పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది..: ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఐటీ ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవాల్సి వస్తోంది. ఈ ఐదేళ్లలో నాకు తెలిసిన వారిలో చాలామందికి స్థానికంగా ఉపాధి అవకాశాలు లభించలేదు. ముఖ్యంగా మహిళలకు స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తే చాలా సౌలభ్యంగా ఉంటుంది. వారు కూడా ఇప్పుడు తప్పక ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది.
ఉమామహేశ్వరి, ప్రహ్లాదపురం
- మౌలిక సదుపాయాలు లేవు..: పరిశ్రమలు రావాలంటే మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఎంటర్ప్రెన్యూర్స్కు కావాల్సిన భూమి, విద్యుత్తు, నీరు సదుపాయాలు కల్పిస్తే సంస్థలు ఏర్పాటు చేస్తారు. గతంలో స్కిల్ డవలప్మెంట్ కేంద్రాల్లో శిక్షణ ఇచ్చి మరీ ఉద్యోగాలు వచ్చేలా చేశారు. ఇలాంటి వాటిమీద ప్రస్తుత ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం బాధాకరం.
ఎం.వర్థన్, సబ్బవరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నమోదును మించి.. పోలింగుకు పోటెత్తి
[ 18-05-2024]
సార్వత్రిక సమరంలో గతానికి భిన్నంగా ఈసారి ఓటర్లు పోటెత్తారు. ఎప్పుడూ పోలింగ్ బూత్ మొహం ఎరగని వారు కూడా ఈసారి ఓటెత్తారు. ఫలితంగానే రికార్డు స్థాయిలో 83.94 శాతం పోలింగ్ జరిగింది. -
ఓట్ల వేళ.. ఓటి పనులు!!
[ 18-05-2024]
ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైకాపా ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరిట గాలం వేసింది. నాలుగేళ్లుగా పట్టించుకోకుండా ఎన్నికల వేళ హడావుడి అధికార పాలకవర్గం జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. -
వైకాపా గూండాలకు రోజులు ముగిశాయి
[ 18-05-2024]
వైకాపా గూండాలకు రోజులు ముగిశాయని ఉత్తర నియోజకవర్గం భాజపా (కూటమి) ఎమ్మెల్యే అభ్యర్థి పి.విష్ణుకుమార్ రాజు హెచ్చరించారు. బర్మాక్యాంపు ప్రాంతంలో ఓ కుటుంబంపై దాడి ఘటనపై శుక్రవారం సీతమ్మధారలోని పార్టీ కార్యాలయంలో బాధితులతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
5,56,819 మంది పోలింగ్కు దూరం
[ 18-05-2024]
విశాఖ పార్లమెంట్ పరిధిలో 2019తో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. కానీ అయిదేళ్లకోసారి వచ్చే అవకాశాన్ని 5 లక్షలకు పైగా ఓటర్లు జారవిడుచుకున్నారు. సమర్థులైన నాయకులను ఎన్నుకునేందుకు ఓటు అనే వజ్రాయుధాన్ని వినియోగించుకోలేదు. -
కోడికత్తి కేసు వాయిదా
[ 18-05-2024]
కోడికత్తి కేసు విశాఖలోని ప్రత్యేక న్యాయస్థానంలో శుక్రవారం విచారణకు వచ్చింది. నిందితుడు శ్రీనివాసరావు కోర్టుకు హాజరయ్యారు. -
వేసవి క్రీడా శిబిరాలు ఉన్నట్టా.. లేనట్టా..!
[ 18-05-2024]
పాఠశాల స్థాయి విద్యార్థులకు వేసవి క్రీడా శిబిరాల నిర్వహణపై ఈ ఏడాది మహా విశాఖ నగరపాలక సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. అసలు శిబిరాలు ఉంటాయా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. -
నేడు నిర్మాల్య చందనం విక్రయాలకు విరామం
[ 18-05-2024]
సింహాద్రి అప్పన్న స్వామి నిర్మాల్య చందనం విక్రయానికి శనివారం విరామం ఇస్తున్నట్లు దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. -
దాడి పూర్వాపరాలపై డీసీపీ ఆరా
[ 18-05-2024]
తెదేపాకు ఓటు వేయలేదన్న కక్షతో కంచరపాలెం బర్మాక్యాంప్లో నూకాంబిక ఆలయం వద్ద గురువారం ఒక కుటుంబంపై జరిగిన దాడి కేసుకు సంబంధించి రాజకీయ ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం డీసీపీ-2 ఎం.సత్తిబాబు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. -
వేడి నీటిలోకి జారిపడ్డ ఉక్కు కార్మికుడు
[ 18-05-2024]
విశాఖ ఉక్కు కర్మాగారంలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఒప్పంద కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్టీల్ప్లాంట్ పోలీసులు, తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం... కర్మాగారంలోని కోకోవెన్ బ్యాటరీ-3లో సెమీ స్కిల్డ్ వర్కర్గా పని చేస్తున్న జె.సాంబయ్య (55) ఉదయం జనరల్ షిఫ్ట్కు వెళ్లాడు. -
వైజాగ్ కన్వెన్షన్లో మెగా కన్జ్యూమర్ ఎక్స్పో
[ 18-05-2024]
పీఎంపాలెం వైజాగ్ కన్వెన్షన్లో ఇండియా ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ ఫెయిర్(ఐఐసీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ మెగా కన్జ్యూమర్ ఎక్స్పో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈనెల 20వ తేదీ వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో ఇంటీరియర్, ఫర్నీచర్, దుస్తులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ తదితర వందకు పైగా స్టాళ్ల ద్వారా విక్రయిస్తున్నారు. -
ప్రిన్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా తన్వి రిషిక
[ 18-05-2024]
ఇటీవల కేరళలో జరిగిన జూనియర్ మోడల్స్ ఇంటర్నేషనల్ కార్యక్రమంలో ప్రిన్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విన్నర్గా నిలిచిన నగరానికి చెందిన తన్వి రిషికను విశాఖ పౌరగ్రంథాలయంలో శుక్రవారం ఘనంగా సత్కరించారు. -
అమ్మవారి పండగపై పోలీసుల ఆంక్షలు
[ 18-05-2024]
కొమరవోలు గ్రామదేవత అయిన కొమరవోలు తల్లి పండగ ఈసారి పోలీసు ఆంక్షలతో సాదాసీదాగా సాగింది. ఈ పండగ మూడేళ్లకోసారి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంటారు. -
పాడేరు మోదకొండమ్మ జాతర 9 నుంచి
[ 18-05-2024]
ఈ నెల 19, 20, 21 తేదీల్లో జరగాల్సిన మోదకొండమ్మ అమ్మవారి మహోత్సవాలు వాయిదా పడ్డాయి. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. -
నాలుగు రోజులు చిరుజల్లులు
[ 18-05-2024]
జిల్లాలో మరో నాలుగు రోజులు చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు తెలిపారు. శుక్రవారం వాతావరణ అధారిత సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. -
వాహన లైటింగ్తో వేగాన్ని తేల్చేలా..
[ 18-05-2024]
టెలి కమ్యూనికేషన్ డే సందర్భంగా అనకాపల్లిలోని డైట్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు నూతన టెక్నాలజీ లైఫై ప్రాజెక్టును రూపొందించారు. కాంతి మార్గం ద్వారా మనం అందించే సిగ్నల్స్ రిసీవ్ చేసుకునేలా దీన్ని తయారుచేశారు. -
అక్రమార్కులకు అధికార పార్టీ అండ
[ 18-05-2024]
చీడికాడ మండలంలో గ్రావెల్ అక్రమ తరలింపు పెద్దఎత్తున జరుగుతోంది. అక్రమార్కులకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
నాన్నకు ఇష్టమైన జిలేబీలు.. ప్రియాంక చేసిన కేకులు..! రాహుల్ మధుర జ్ఞాపకాలు
-
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
-
‘3 ఇడియట్స్’ సీన్తో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా..
-
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్