ప్రలోభాల వల.. చిక్కితే విలవిలే!!
వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందకపోగా మరింత వెనకబడిపోయింది. వాణిజ్య రాజధానిగా చెప్పుకొనే విశాఖ అభివృద్ధికి అన్ని వనరులు ఉన్నా జగన్ కనీసం పట్టించుకోలేదు.
నిర్భీతిగా పంపకాల్లో వైకాపా నేతలు
ఆశపడితే మరో ఐదేళ్లు అంధకారంలో జీవితాలు
సమర్థులకు ఓటేస్తేనే అభివృద్ధి ఫలాలు
ఈనాడు, ఈనాడు, డిజిటల్, విశాఖపట్నం: వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందకపోగా మరింత వెనకబడిపోయింది. వాణిజ్య రాజధానిగా చెప్పుకొనే విశాఖ అభివృద్ధికి అన్ని వనరులు ఉన్నా జగన్ కనీసం పట్టించుకోలేదు. నగర పరిసరాల్లోని విలువైన భూములను చేజిక్కించుకోవడంపైనే వైకాపా నాయకులు దృష్టి పెట్టారు. సమర్థవంతమైన నాయకులు లేక అభివృద్ధి మందగించింది. దీనంతటికీ కారణం గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు జగన్ను నమ్మి ఓటేయడమే. నాటి ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు
భారీగా డబ్బు ఖర్చు చేశారు. ‘ఒక్క అవకాశమివ్వండి’ అంటూ అప్పట్లో జగన్ అభ్యర్థించి అధికారంలోకి వచ్చాక గత హామీలు మరచిపోయి అన్ని వర్గాలను మోసం చేశారు. మళ్లీ ఆ తరహా ప్రలోభాలకు గురైతే మరో అయిదేళ్లు అంధకారంలోకి వెళ్లిపోక తప్పదని జిల్లా వాసులు, విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఓట్లకు రేటు కడుతూ..: వైకాపా ప్రభుత్వ విధానాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ఆ పార్టీ తరఫున బరిలో ఉన్న నాయకులుకొందరు ప్రలోభాలకు తెర తీస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే తాయిలాల పంపిణీ మొదలెట్టేశారు. ‘తూర్పు’ నియోజకవర్గంలో తాయిలాల పంపిణీకి విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి. ఎన్నికలకు వారం రోజులే ఉండటంతో వైకాపా నాయకులు ఒక్కో ఓటుకు కనీసం రూ.2 వేలు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు చర్చలు సాగుతున్నాయి. వారిచ్చిన డబ్బులు తీసుకుని ఓటేస్తే ప్రశ్నించే అవకాశం కోల్పోయినట్లే. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో నిజాయతీగా ఓటేస్తేనే సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవడానికి అవకాశముంటుంది. విశాఖ అభివృద్ధికి బాటలు వేయగలమని విద్యావేత్తలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఆ ఫిర్యాదుతో: సి-విజిల్ యాప్నకు వచ్చిన ఫిర్యాదు మేరకు వైకాపా అభ్యర్థి ఎంవీవీ కార్యాలయంలో తనిఖీలు సాగాయి. తొలుత ఒక బృందం తనిఖీలు చేయగా, ఎంవీవీ సన్నిహితుడు జీవీ అక్కడే ఉన్నారు. తరువాత ఆగమేఘాలపై ఎంవీవీ వచ్చారు. ఆయనతోపాటు మరొక బృందం, తర్వాత మరికొద్ది సేపటికి ఇంకో బృందం ఇలా సుమారు 25 మందికిపైగా అధికారులు, సిబ్బంది వచ్చి విస్తృతంగా తనిఖీలు జరిపారు. తనిఖీల సమయంలో ఎవరిని అనుమతించకుండా కార్యాలయానికి గేట్లు వేసేశారు. మీడియా అక్కడే ఉన్నా ఎవరికి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఎవరినీ లోనికి అనుమతించలేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా సోదాలు జరిపారు. కార్యాలయంలో 5 అంతస్తులు ఉండగా, తనిఖీల సమయంలో మూడు అంతస్తుల దీపాలు మాత్రమే వెలుగుతూ కనిపించాయి.
అభివృద్ధికి చర్యలు శూన్యం: దేశంలోనే తొమ్మిదో అతిపెద్ద నగరం విశాఖపట్నం. ముంబయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర నగరాలతో పోటీ పడే అన్ని అవకాశాలు, వనరులూ ఇక్కడున్నాయి. గత అయిదేళ్లలో ఇక్కడ జరిగిన అభివృద్ధి అంతంతమాత్రమే. పరిశ్రమలకు అనుకూల వాతావరణమున్న జిల్లాకు కొత్త సంస్థలు రాలేదు. ఉపాధి, ఉద్యోగావకాశాలు లేక యువత వలస బాట పడుతున్నారు. జిల్లాలో పర్యాటకాభివృద్ధికి ఎంతో అవకాశమున్నా వైకాపా ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టలేదు. దీంతో పశ్చిమబంగ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు పర్యటకులు విశాఖను కాకుండా భువనేశ్వర్ను ఎంచుకుంటున్నారని పలువురు చెబుతున్నారు. రైల్వే జోన్కు కూడా స్థలం ఇవ్వలేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వయంగా పార్లమెంటులో ప్రకటించారు. అభివృద్ధికి పాతరేసి, అప్పులు చేయడంపైనే జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి తలపై రూ.2 లక్షల అప్పుందని ఇటీవల విశాఖ వచ్చిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
5 గంటల తనిఖీల్లో ఇంతేనా?: రెండు రోజుల కిందట తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఎంవీవీ కార్యాలయంలో ఐదు గంటల పాటు విస్తృత తనిఖీలు సాగాయి అయితే అక్కడ 500 చీరలు, 400 టీషర్టులు, 1000 వరకు ఆటో డ్రైవర్ల ఏకరూపదుస్తులు, 3 వాచీలు, రూ.30వేల నగదు, ఇతర ప్రచార సామాగ్రిని గుర్తించనట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి రూ.30వేల నగదును చూపించటంపై పలు అనుమానాలు తావిస్తోంది. రూ.50వేలు దాటి ఉంటే దానికి లెక్క చెప్పాలని ఎన్నికల అధికారులు చెబుతున్నా, రూ.30వేలకు బిల్లులులేవని స్వాధీనం చేసుకోవటం విశేషం. వాస్తవానికి అది ఒక కార్పొరేటు కార్యాలయంగా పేరొందింది. అక్కడ ఇంత సమయం సోదాలు జరిపి, కేవలం రూ.2-3లక్షలలోపు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తనిఖీల బృందం తేల్చటం విశేషం. అయితే రాత్రంతా వైకాపా అభ్యర్ధి కార్యాలయంలో తనిఖీలు అంటూ మీడియాలో కథనాలు వచ్చినా, దానిపై కనీసం ఎంత స్వాధీనం చేసుకున్నది అధికారిక ప్రకటన చేయకపోవటం విశేషం. ఇటు పోలీసులు, అటు తనిఖీల బృందాలు కూడా అన్ని విషయాలను చాలా గోప్యంగా ఉంచటం పట్ల అనుమానాలు తావిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం
[ 18-05-2024]
విదేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలని చెప్పి.. చైనా ముఠాలకు నిరుద్యోగులను విక్రయిస్తున్న ఏజెంట్లు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. -
నమోదును మించి.. పోలింగుకు పోటెత్తి
[ 18-05-2024]
సార్వత్రిక సమరంలో గతానికి భిన్నంగా ఈసారి ఓటర్లు పోటెత్తారు. ఎప్పుడూ పోలింగ్ బూత్ మొహం ఎరగని వారు కూడా ఈసారి ఓటెత్తారు. ఫలితంగానే రికార్డు స్థాయిలో 83.94 శాతం పోలింగ్ జరిగింది. -
ఓట్ల వేళ.. ఓటి పనులు!!
[ 18-05-2024]
ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైకాపా ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరిట గాలం వేసింది. నాలుగేళ్లుగా పట్టించుకోకుండా ఎన్నికల వేళ హడావుడి అధికార పాలకవర్గం జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. -
వైకాపా గూండాలకు రోజులు ముగిశాయి
[ 18-05-2024]
వైకాపా గూండాలకు రోజులు ముగిశాయని ఉత్తర నియోజకవర్గం భాజపా (కూటమి) ఎమ్మెల్యే అభ్యర్థి పి.విష్ణుకుమార్ రాజు హెచ్చరించారు. బర్మాక్యాంపు ప్రాంతంలో ఓ కుటుంబంపై దాడి ఘటనపై శుక్రవారం సీతమ్మధారలోని పార్టీ కార్యాలయంలో బాధితులతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
5,56,819 మంది పోలింగ్కు దూరం
[ 18-05-2024]
విశాఖ పార్లమెంట్ పరిధిలో 2019తో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. కానీ అయిదేళ్లకోసారి వచ్చే అవకాశాన్ని 5 లక్షలకు పైగా ఓటర్లు జారవిడుచుకున్నారు. సమర్థులైన నాయకులను ఎన్నుకునేందుకు ఓటు అనే వజ్రాయుధాన్ని వినియోగించుకోలేదు. -
కోడికత్తి కేసు వాయిదా
[ 18-05-2024]
కోడికత్తి కేసు విశాఖలోని ప్రత్యేక న్యాయస్థానంలో శుక్రవారం విచారణకు వచ్చింది. నిందితుడు శ్రీనివాసరావు కోర్టుకు హాజరయ్యారు. -
వేసవి క్రీడా శిబిరాలు ఉన్నట్టా.. లేనట్టా..!
[ 18-05-2024]
పాఠశాల స్థాయి విద్యార్థులకు వేసవి క్రీడా శిబిరాల నిర్వహణపై ఈ ఏడాది మహా విశాఖ నగరపాలక సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. అసలు శిబిరాలు ఉంటాయా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. -
నేడు నిర్మాల్య చందనం విక్రయాలకు విరామం
[ 18-05-2024]
సింహాద్రి అప్పన్న స్వామి నిర్మాల్య చందనం విక్రయానికి శనివారం విరామం ఇస్తున్నట్లు దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. -
దాడి పూర్వాపరాలపై డీసీపీ ఆరా
[ 18-05-2024]
తెదేపాకు ఓటు వేయలేదన్న కక్షతో కంచరపాలెం బర్మాక్యాంప్లో నూకాంబిక ఆలయం వద్ద గురువారం ఒక కుటుంబంపై జరిగిన దాడి కేసుకు సంబంధించి రాజకీయ ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం డీసీపీ-2 ఎం.సత్తిబాబు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. -
వేడి నీటిలోకి జారిపడ్డ ఉక్కు కార్మికుడు
[ 18-05-2024]
విశాఖ ఉక్కు కర్మాగారంలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఒప్పంద కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్టీల్ప్లాంట్ పోలీసులు, తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం... కర్మాగారంలోని కోకోవెన్ బ్యాటరీ-3లో సెమీ స్కిల్డ్ వర్కర్గా పని చేస్తున్న జె.సాంబయ్య (55) ఉదయం జనరల్ షిఫ్ట్కు వెళ్లాడు. -
వైజాగ్ కన్వెన్షన్లో మెగా కన్జ్యూమర్ ఎక్స్పో
[ 18-05-2024]
పీఎంపాలెం వైజాగ్ కన్వెన్షన్లో ఇండియా ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ ఫెయిర్(ఐఐసీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ మెగా కన్జ్యూమర్ ఎక్స్పో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈనెల 20వ తేదీ వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో ఇంటీరియర్, ఫర్నీచర్, దుస్తులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ తదితర వందకు పైగా స్టాళ్ల ద్వారా విక్రయిస్తున్నారు. -
ప్రిన్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా తన్వి రిషిక
[ 18-05-2024]
ఇటీవల కేరళలో జరిగిన జూనియర్ మోడల్స్ ఇంటర్నేషనల్ కార్యక్రమంలో ప్రిన్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విన్నర్గా నిలిచిన నగరానికి చెందిన తన్వి రిషికను విశాఖ పౌరగ్రంథాలయంలో శుక్రవారం ఘనంగా సత్కరించారు. -
అమ్మవారి పండగపై పోలీసుల ఆంక్షలు
[ 18-05-2024]
కొమరవోలు గ్రామదేవత అయిన కొమరవోలు తల్లి పండగ ఈసారి పోలీసు ఆంక్షలతో సాదాసీదాగా సాగింది. ఈ పండగ మూడేళ్లకోసారి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంటారు. -
పాడేరు మోదకొండమ్మ జాతర 9 నుంచి
[ 18-05-2024]
ఈ నెల 19, 20, 21 తేదీల్లో జరగాల్సిన మోదకొండమ్మ అమ్మవారి మహోత్సవాలు వాయిదా పడ్డాయి. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. -
నాలుగు రోజులు చిరుజల్లులు
[ 18-05-2024]
జిల్లాలో మరో నాలుగు రోజులు చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు తెలిపారు. శుక్రవారం వాతావరణ అధారిత సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. -
వాహన లైటింగ్తో వేగాన్ని తేల్చేలా..
[ 18-05-2024]
టెలి కమ్యూనికేషన్ డే సందర్భంగా అనకాపల్లిలోని డైట్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు నూతన టెక్నాలజీ లైఫై ప్రాజెక్టును రూపొందించారు. కాంతి మార్గం ద్వారా మనం అందించే సిగ్నల్స్ రిసీవ్ చేసుకునేలా దీన్ని తయారుచేశారు. -
అక్రమార్కులకు అధికార పార్టీ అండ
[ 18-05-2024]
చీడికాడ మండలంలో గ్రావెల్ అక్రమ తరలింపు పెద్దఎత్తున జరుగుతోంది. అక్రమార్కులకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు