అంబరం.. సిరిమాను శంబరం
వనమంతా జనంతో నిండిపోయింది. కొండకోనలు అమ్మ శరణుతో మార్మోగాయి. డప్పుల మోత.. థింసా నృత్యాలు.. యువకుల కేరింతలతో ఆలయ పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. భక్తుల కొంగుబంగారం శంబర పోలమాంబ జాతర అంగరంగ వైభవంగా మంగళవారం జరిగింది. భక్తజనం సిరిమానోత్సవా
చదురు, వనంగుడిలో అమ్మవార్లు
ఈనాడు-విజయనగరం, సాలూరు, మక్కువ, న్యూస్టుడే : వనమంతా జనంతో నిండిపోయింది. కొండకోనలు అమ్మ శరణుతో మార్మోగాయి. డప్పుల మోత.. థింసా నృత్యాలు.. యువకుల కేరింతలతో ఆలయ పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. భక్తుల కొంగుబంగారం శంబర పోలమాంబ జాతర అంగరంగ వైభవంగా మంగళవారం జరిగింది. భక్తజనం సిరిమానోత్సవాన్ని కనులారా తిలకించి తన్మయత్వం చెందారు. మనసారా మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సమీపంలోని చెట్ల కింద వంటలు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు. మధ్యాహ్నం 11.30 గంటల తర్వాత క్యూలైన్లు రద్దీగా మారాయి. కరోనా నేపథ్యంలో గతేడాది కన్నా భక్తుల సంఖ్య కాస్త తగ్గింది.
పోలీసుల కట్టడి
రద్దీని నిలువరించడానికి పోలీసులు ఎక్కడికక్కడ భక్తులను కట్టడి చేశారు. ఓఎస్డీ సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో సుమారు 650 మందితో బందోబస్తు నిర్వహించారు. పార్వతీపురం డీఎస్పీ సుభాష్, సాలూరు సీఐ అప్పలనాయుడు పర్యవేక్షించారు. సీసీ, డ్రోన్ కెమెరాలతో భక్తుల రాకపోకలను గమనించారు. ● కొవిడ్ నియంత్రణపై వాహనాల్లో ప్రచారం చేశారు. మాస్కు ధరించని వారిని హెచ్చరించారు. ● 108, 104 వాహనాలతో పాటు ఫీడర్ అంబులెన్సులు అందుబాటులో ఉంచారు. అన్ని ప్రధాన కూడళ్లలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ● సిరిమాను పూజారిపై అరటిపండ్లు విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ పండ్లను ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్మికులు తొలగించారు.
ఊరేగింపుతో ప్రారంభం: మధ్యాహ్నం 3.58 గంటలకు సిరిమాను ఊరేగింపు ప్రారంభమైంది. అంతకు ముందే ఘటాలను తీసుకొచ్చారు. పూజారి జన్నిపేకాపు భాస్కరరావు రాగానే ఘటాలను గిరడ వారింటికి తీసుకెళ్లారు. అక్కడ తొలి పూజలందుకొని తిరిగి కుప్పిలి, నాయుడు వారింటికి చేరుకున్నాయి. ఈ మూడు ఇళ్ల వద్దకు సిరిమాను చేరుకోగానే ఆయా కుటుంబీకులు పూజారి కాళ్లు కడగడంతో ఉత్సవం మొదలైంది. సిరిమాను నడి వీధి, పనుకు వీధి, గొల్ల వీధి, కొండ వీధి మీదుగా గద్దె వద్దకు చేరుకుంది. సిరిమాను వద్దకు భక్తులెవరూ రాకుండా పోలీసులు రోప్ పార్టీలతో కట్టడి చేశారు. పూజారిని ఇంటి నుంచి తీసుకొస్తున్న సమయంలో పలువురిని అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట చేసుకుంది. సిరిమాను కొంతదూరం కదిలాక అందరినీ అనుమతించారు. సాలూరు, బొబ్బిలి ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్దేవ్, సబ్ కలెక్టర్ భావన, దేవదాయ శాఖ విశాఖ ఏసీ శాంతి, డీసీ శ్రీనివాస్రెడ్డి, అమ్మవారిని దర్శించుకున్నారు. ట్రస్టు బోర్డు ఛైర్మన్ పూడి దాలినాయుడు, ఈవో నగేష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
రాకపోకలకు అవస్థలు..: ఏటా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేవారు. ఈ ఏడాది కరోనాతో భక్తులను నియంత్రించడానికి సాధారణ రోజుల్లో లాగే రెండు బస్సులను నడిపారు. దీంతో ప్రైవేటు వాహనాలు, ఆటోలే దిక్కయ్యాయి. బస్సులను వీఆర్ఎస్ కూడలిలోనే నిలిపివేయడంతో సుమారు 2 కి.మీ. నడవాల్సి వచ్చింది. వృద్ధులు, చిన్న పిల్లలున్న వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రైవేటు వాహనాలను సాలూరు నుంచి వచ్చే వాటిని మామిడిపల్లి, సీతానగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాటిని చినభోగిలి, పాత బొబ్బిలి వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఆపేశారు.
సిరిమానోత్సవం ఇలా.. (గంటల్లో)
3.37 పూజారి రాక
3.43 సిరిమాను అధిరోహణ
3.58 ఊరేగింపు ప్రారంభం
5.35 సంబరం ముగింపు
క్యూలైన్లలో రద్దీ
సిరిమాను పైకెత్తుతున్న యువత
ఘటాల ఊరేగింపు
మొక్కులు చెల్లించుకుంటున్న మహిళలు
సిరిమానోత్సవం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చీపురుపల్లిలో విజయం సాధించి తీరాలి
[ 26-04-2024]
‘చీపురుపల్లిలో విజయమే లక్ష్యంగా కిమిడి కుటుంబం అంతా కలిసి పనిచేయండి.. పరస్పరం సహకరించుకోండి’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. -
చూస్తుంటే.. మరో రుషికొండలా ఉందే
[ 26-04-2024]
దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామ సమీపంలోని పచ్చగా ఉన్న కొండ మరో రుషికొండను తలపిస్తోంది. అక్రమార్కులు దీనిని ఇలా తయారు చేశారు. కన్నాం, చినకాద, గడసాం గ్రామాల రైతులు, గొర్రెలకాపరులు ఈ కొండపైనే మూగజీవాల్ని మేపుతుంటారు. -
‘రెస్కోకు’.. బొత్స విలీన ‘మస్కా’
[ 26-04-2024]
ఓ చరిత్ర: చీపురుపల్లి గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థది (ఆర్ఈసీఎస్- రెస్కో) నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర. వెనుకబడిన ప్రాంతంలో వెలుగులు నింపిన ఒక ఐకాన్. సహకార రంగంలో వినియోగదారుల మన్ననలు అందుకుంది. -
ముగిసిన నామినేషన్ల స్వీకరణ
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణ గురువారం ముగిసింది. ఈనెల 16న ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఏడు శాసనససభ స్థానాలకు 105 మంది 184, విజయనగరం పార్లమెంటుకు 18 మంది 30 సెట్లు సమర్పించారు. -
నా అంటూనే.. ఉద్యోగులపై ఉక్కుపాదం
[ 26-04-2024]
సీపీఎస్ను రద్దు చేస్తాం.. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామని అయిదేళ్ల క్రితం జగన్ హామీ ఇచ్చారు. అది నిజమనుకుని అందరూ నమ్మి ఓటేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిపై కక్ష పెంచుకున్నారు. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?