ఉచిత బియ్యానికి ఎగనామం
జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) బియ్యం పంపిణీ నిలిచిపోయింది.
నిలిచిపోయిన పీఎంజీకేఏవై
రెండింటినీ కలిపేసిన రాష్ట్ర ప్రభుత్వం
రేషన్ పంపిణీ (పాత చిత్రం)
విజయనగరం కలెక్టరేట్/భామిని, న్యూస్టుడే: జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) బియ్యం పంపిణీ నిలిచిపోయింది. కొవిడ్ లాక్డౌన్ నుంచి పేదవర్గాలకు, ఏఏవై కార్డుదారులకు కేంద్ర వాటా కింద రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బియ్యాన్ని(నాన్ సార్టెక్స్) పంపిణీ చేస్తోంది. చౌకధరల దుకాణాల ద్వారా వీటిని అందజేసేవారు. కేంద్రం ఇస్తున్నా.. కొన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వీటి పంపిణీని నిలిపివేసింది. మధ్యలో ఒకట్రెండు నెలలు ఇచ్చినా... ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోయింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో వీటి ఊసే లేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పీడీఎస్ కింద ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికే రేషన్ పంపిణీలో భాగంగా ప్రతి నెలా ఒకటి నుంచి 17వ తేదీ వరకు రాయితీపై సరకులు పంపిణీ చేస్తోంది. కిలో బియ్యానికి రూపాయి చొప్పున, కందిపప్పు, పంచదార రాయితీపై ఇచ్చేవారు. ఈ నెల నుంచి పట్టణ ప్రాంతాల్లో కార్డుదారులకు రెండు కిలోల చొప్పున గోధుమపిండి అదనంగా సరఫరా చేస్తున్నారు. ప్రతి నెలా పీఎంజీకేఏవై కింద ఉచిత బియ్యాన్ని 18 నుంచి 30వ తేదీ వరకు రేషన్ దుకాణాల ద్వారా అందజేసేవారు.
నిలిపివేత
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం గత నెల నుంచి పీడీఎస్ బియ్యాన్ని ఉచితంగానే సరఫరా చేస్తోంది. ఇదే సందర్భంలో కేంద్రమిస్తున్న పీఎంజీకేఏవై పంపిణీని పూర్తిగా నిలిపివేసింది. రాష్ట్ర పౌరసరఫరాల అధికారుల నుంచి దీనిపై ఎటువంటి ఉత్తర్వులూ రాకపోవడంతో పంపిణీ నిలిపివేశామని జిల్లా అధికారులు చెబుతున్నారు. వెనుకబడిన జిల్లా కావడంతో విజయనగరంలో ఏఏవై(పీఎంజీకేఏవై లబ్ధిదారులు) కార్డుదారులు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం విజయనగరం జిల్లాలో సాధారణ బియ్యం కార్డులు 5.74 లక్షలు ఉంటే.. అందులో పీఎంజీకేఏవై లబ్ధిదారుల కార్డులు 5.71 లక్షలు ఉన్నాయి.
పార్వతీపురం మన్యంలో: 578 రేషన్ దుకాణాల పరిధిలో 2,76,783 కార్డులున్నాయి. కార్డులోని ఒక్కో సభ్యునికి 5 కిలోల చొప్పున నాన్ సార్టెక్స్ బియ్యం అందేది. ఒక కార్డులో నలుగురు సభ్యులుంటే 20 కిలోల బియ్యం వచ్చేవి. ఈ రకం బియ్యం బయట కొనాలంటే రూ.25 నుంచి రూ.30 వరకూ వెచ్చించాలి. ప్రస్తుతం ప్రభుత్వం పీడీఎస్నే ఉచితంగా ఇచ్చేసి (20 కిలోల బియ్యానికి రూ.20 మిగులు) పీఎంజీకేఏవైకు పూర్తిగా ఎగనామం పెట్టేసిందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ లెక్కన రెండు జిల్లాల్లో కోట్లాది రూపాయల లబ్ధికి పేదలు దూరమయ్యారు.
రూపాయి బియ్యం ఉచితమే.. : ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పీడీఎస్ బియ్యం(కిలో రూ.1) జనవరి నెల నుంచి ఉచితంగానే ఇస్తోంది. దీనివల్ల పీఎంజీకేఏవై ఉచిత బియ్యాన్ని ఇక ఇవ్వడం లేదు. రెండో కోటాపై ఎటువంటి ఆదేశాలూ లేవు.
మధుసూదనరావు, కేవీఎల్ఎన్ మూర్తి, విజయనగరం/పార్వతీపురం మన్యం జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు సంద్రం
[ 26-04-2024]
సాలూరు పట్టణంలోని జాతీయ రహదారి పసుపు సంద్రంగా మారింది. కూటమి అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఎన్నికల నామపత్రం సమర్పించి, ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
మామయ్య రాసిన మరణ శాసనం
[ 26-04-2024]
‘అక్క.. చెల్లెమ్మకు అండగా మీ అన్న జగన్ ఉన్నాడు. మీ పిల్లల బాధ్యతను మేనమామగా తీసుకుంటా’ అంటూ ఎన్నికల ముందు, తర్వాత అనేక సందర్భాల్లో సీఎం పలికిన ప్రగల్భాలివి. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్