ప్రాణహితకు పుష్కర కళ
ప్రతి నదికి 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తాయి. ఈనెల 13 నుంచి 24 వరకు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గుండా ప్రవహిస్తున్న ప్రాణహిత నదికి పుష్కరాలు నిర్వహించనున్నారు. నది తీరం, త్రివేణి సంగమం
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి
అర్జున్గుట్ట వద్ద
ప్రతి నదికి 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తాయి. ఈనెల 13 నుంచి 24 వరకు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గుండా ప్రవహిస్తున్న ప్రాణహిత నదికి పుష్కరాలు నిర్వహించనున్నారు. నది తీరం, త్రివేణి సంగమం భక్తజన జాతరగా మారనున్నాయి. రోజుకు లక్ష మందికి పైగా స్నానాలు ఆచరిస్తారని అంచనా..
ప్రధానాకర్షణగా కాళేశ్వరం..
పుష్కరాల్లో కాళేశ్వరం ప్రధానాకర్షణగా నిలవనుంది. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని (సరస్వతి) నదులు కలిసే త్రివేణి సంగమ స్థానం. కాళేశ్వర, ముక్తీశ్వరస్వామి ఆలయం ఉండటంతో పుష్కర స్నానాలు ఆచరించిన తర్వాత ఇక్కడికి దైవ దర్శనానికి వస్తారు. వసతికి సత్రాలు, లాడ్జీలు, హోటళ్లు ఉన్నాయి. గోదావరి, ప్రాణహితపై వంతెనలు ఉండడంతో అర్జునగుట్ట, రాపన్పల్లి, మహారాష్ట్ర వైపు సులువుగా వెళ్లి స్నానాలు చేయవచ్ఛు.
కాళేశ్వరం నుంచి గోదావరి వంతెన మీదుగా 9 కిలోమీటర్ల దూరంలో సిరోంచ చేరుకోవచ్ఛు అక్కడి నుంచి ప్రాణహిత వంతెన మీదుగా 8 కిలోమీటర్ల దూరంలోని అర్జునగుట్ట ఉంటుంది. అర్జునగుట్ట, సిరొంచ నగరం ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వరం దేవాలయాన్ని సందర్శించవచ్ఛు
తెలంగాణలో
* అర్జునగుట్ట వద్దకు వెళ్లేందుకు బబ్బెరిచెల్క నుంచి రహదారి సిద్ధం చేస్తున్నారు. తిరుగుపయనం అయ్యేందుకు వన్వే ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీల కోసం జైపూర్ ఎస్టీపీపీలో హెలిప్యాడ్ను కూడా సిద్ధం చేస్తున్నారు.
* వేమనపల్లి, తుమ్మిడిహెట్టి ఘాట్లకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం, మౌలిక వసతులు కల్పించనున్నారు.
* కాళేశ్వరంలో చలువపందిళ్లు, ఆలయం వద్ద క్యూలైన్లు సిద్ధం చేస్తున్నారు. జల్లు స్నానాలకు షవర్లు, పార్కింగ్ స్థలాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు సిద్ధం చేయనున్నారు.
తుమ్మిడిహెట్టి వద్ద ఘాట్
మహారాష్ట్రలో ఏర్పాట్లు..
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని సిరోంచ, నగరం వద్ద పుష్కరాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అక్కడి ప్రభుత్వం పుష్కరాల నిర్వహణకు రూ.10 కోట్లు కేటాయించింది. రహదారుల విస్తరణ, మరమ్మతులు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక కంపార్ట్మెంట్లు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు, పార్కింగ్, తదితర పనులు చేపడుతున్నారు. నదిలో ప్రమాదాలు నివారణకు రక్షణ కంచె నిర్మించారు. అలాగే వీఐపీల కోసం రెండు హెలిప్యాడ్ల నిర్మాణాలను చేపట్టనున్నారు. భక్తులు సేద తీరేందుకు నగరం వద్ద ఒకటి, సిరోంచలో రెండు భారీ షెడ్లు సిద్ధం చేశారు.
పుష్కర ఘాట్లు ఎక్కడెక్కడ అంటే..
* కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కౌటాల మండలం తుమ్మిడిహెట్టి
* మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి మండల కేంద్రం
* జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం త్రివేణి సంగమం
* మహారాష్ట్ర వైపు సిరోంచ, నగరం
సిరోంచ ఘాట్కు వెళ్లేదారి
నగరం వద్ద దుస్తులు మార్చుకునే గది
హైదరాబాద్ నుంచి కాళేశ్వరం ఇలా చేరుకోవచ్చు..
కరీంనగర్ లేదా వరంగల్ మీదుగా రెండు వైపులా రావొచ్చు..
* హైదరాబాద్-కరీంనగర్- పెద్దపల్లి-మంథని- కాటారం-మహదేవ్పూర్- కాళేశ్వరం చేరుకోవచ్చు. ఇది 258 కి.మీ. ఉంటుంది.
* హైదరాబాద్- వరంగల్- పరకాల- భూపాలపల్లి- కాటారం-మహదేవ్పూర్ మీదుగా కాళేశ్వరం చేరుకోవచ్చు.. ఇది 285 కి.మీ.
* కాళేశ్వరానికి వరంగల్, భూపాలపల్లి, మంచిర్యాల, చెన్నూరు, గోదావరిఖని నుంచి బస్సు సౌకర్యం ఉంది.
తుమ్మిడిహెట్టి చేరాలిలా..
* హైదరాబాద్- కరీంనగర్-మంచిర్యాల- బెల్లంపల్లి- కాగజ్నగర్-కౌటాల- తుమ్మడిహెట్టి.. 355 కిలోమీటర్లు
* వరంగల్-హుజూరాబాద్-పెద్దపల్లి-రామగుండం-మంచిర్యాల-బెల్లంపల్లి-కాగజ్నగర్-కౌటాల-తుమ్మడిహెట్టి.. 258 కి.మీ.
అర్జునగుట్టకు
* హైదరాబాద్-కరీంనగర్-పెద్దపల్లి-రామగుండం-ఇందారం క్రాస్-చెన్నూర్-అర్జునగుట్ట. 285 కి.మీ
* వరంగల్-పరకాల-భూపాలపల్లి-కాటారం-మహదేవ్పూర్-కాళేశ్వరం-సిరోంచ (మహారాష్ట్ర) మీదుగా చేరుకోవచ్చు.. 135 కి.మీ.
రైల్వే మార్గం..
* రైళ్ల ద్వారా వచ్చేవారు వరంగల్, కాజీపేట, రామగుండం, మంచిర్యాలకు చేరుకుని కాళేశ్వరం వెళ్లొచ్చు.
* తుమ్మిడిహెట్టి ఘాట్కు వచ్చేవారు సిర్పూర్, కాగజ్నగర్ రైల్వే స్టేషన్లకు చేరుకోవాలి. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా వెళ్లవచ్చు.
ప్రముఖ ఆలయాలు..
పుష్కర స్నానాలకు వచ్చే భక్తులు సమీప ఆలయాలకు వెళ్తారు. అర్జునగుట్ట, వేమనపల్లి సమీపంలో చెన్నూరులోని జగన్నాథాలయం, శివాలయం, అలాగే తుమ్మిడిహెట్టి వద్ద కార్తిక్ మహారాజ్ ఆలయం, సిరోంచ, కాళేశ్వరంలో కాళేశ్వరముక్తీశ్వర దేవాలయం ఉంది. అలాగే సిరోంచలో ప్రాణహిత నది ఒడ్డున విఠలేశ్వర ఆలయం ఉంది.
పర్యాటక కేంద్రాలు..
కాళేశ్వరం నుంచి మేడారం, పాండవులగుట్టలు, రామప్ప, లక్నవరం, బొగత, తదితర పర్యాటక ప్రాంతాలకు వెళ్లవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీపంప్హౌస్, 9 కిలోమీటర్ల దూరంలో అన్నారం, 32 కిలోమీటర్ల దూరంలో మేడిగడ్డ బ్యారేజీలకు సైతం చూడొచ్చు. సిరోంచలో నిజాం కాలం నాటి అద్దాలమేడ ఉంది.
మరిన్ని విశేషాలు..
* వార్దా, పెన్గంగ నదుల కలయికతో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత పురుడు పోసుకుని మంచిర్యాల జిల్లా మీదుగా ప్రవహించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. ః నది జన్మస్థానం నుంచి త్రివేణి సంగమం వరకు 113 కిలోమీటర్లు పయనిస్తుంది.
* కాళేశ్వరంలో దేవాదాయశాఖకు చెందిన 50 గదుల సత్రాలతో పాటు ప్రైవేటుగా లాడ్జింగ్, అద్దెకు 200 గదులు ఉన్నాయి. ఇప్పటికే చాలా బుకింగ్ చేసుకున్నారు.
* ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక నుంచి వివిధ ఆలయాల పీఠాధిపతులు రానున్నారు. ఇప్పటికే వారి పూజాకార్యక్రమాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
* కాళేశ్వరంలో పీహెచ్సీ, 16 కిలోమీటర్ల దూరంలో సీహెచ్సీ ఆసుపత్రి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ రోడ్ షో నేడు
[ 28-04-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం వరంగల్ నగరంలో బస్సు యాత్రలో పాల్గొనేందుకు సర్వం సిద్ధమైంది. -
తేలిన లెక్క.. అతివలే నిర్ణేతలు
[ 28-04-2024]
వరంగల్(ఎస్సీ), మహబూబాబాద్(ఎస్టీ) లోక్సభ స్థానాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల లెక్క తేలింది.. ఫిబ్రవరి 8న తుది జాబితా ప్రకటించినా.. అర్హులైన వారు ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. -
మీరెక్కడుంటే.. మేమక్కడుంటాం..!
[ 28-04-2024]
నామపత్రాల దాఖలు పర్వం పూర్తికావడంతో లోక్సభ ఎన్నికల జోరు పెరిగింది.. అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
పోలింగ్ శాతం పెంపునకు కృషి
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్శాతం పెంచడానికి మెప్మా సిబ్బంది కృషి చేయాలని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారిణి భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. -
బోర్డు తిప్పేసిన నకిలీ వైద్యుడు
[ 28-04-2024]
జిల్లా వైద్యఆరోగ్యశాఖ, తెలంగాణ వైద్యమండలి సభ్యులు హనుమకొండలో ఓ నకిలీ వైద్యుడిని గుర్తించారు. -
ప్రజాస్వామ్యం ఓటుతోనే సాధ్యం
[ 28-04-2024]
ప్రజాస్వామ్యమనేది ఓటు ద్వారానే సాధ్యమని, ఓటు హక్కును మన ప్రాథమిక బాధ్యతగా భావించి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. -
‘వెంట ఉన్నవాళ్లే ఓట్లేయలేదు’
[ 28-04-2024]
ఓటర్లకు తన పట్ల వ్యతిరేకత లేదని, వెంట తిరిగిన వాళ్లే ఓట్లేయలేదని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పేర్కొన్నారు. -
అమ్ముడుపోని తునికాకు యూనిట్లు
[ 28-04-2024]
ఈ ఏడాదిలో తునికాకు కూలీల ఉపాధికి పెద్ద మొత్తంలో గండి పడనుంది. జిల్లా వ్యాప్తంగా 16 తునికాకు యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
[ 28-04-2024]
జిల్లాలో విస్తృత తనిఖీలు చేపట్టి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తత అవసరం
[ 28-04-2024]
ఎన్నికల విధుల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వరంగల్ లోక్సభ నియోజకవర్గ సాధారణ పరిశీలకురాలు బండారి స్వాగత్ రనవీర్ చంద్ సూచించారు. -
సంక్షేమ పాలన చూసి కాంగ్రెస్కు ఓటేయండి
[ 28-04-2024]
కులం, మతం పేరిట కాదు, కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమ ప్రజాపాలన చూసి ఓట్లు వేయాలని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
పంచదార పంపిణీ చేయాల్సిందే!
[ 28-04-2024]
చౌక ధరల దుకాణాల్లో ఇక నుంచి పంచదార తప్పనిసరిగా పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ డీలర్లను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్