పెండింగ్లు పెరిగి.. పరిష్కారాలు తగ్గి..
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలను చూపించడంలో కలెక్టరేట్ అధికారులు వెనకబడుతున్నారు. గత వారం 160 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా.. ఈ వారానికి 368 పెండింగ్ అర్జీలు ఉండటం అధికారుల పనితనానికి అద్దం పడుతున్నాయి.
కమిషనర్ ప్రావీణ్యకు సమస్యలు వివరిస్తున్న మహిళలు
వరంగల్ కలెక్టరేట్, న్యూస్టుడే: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలను చూపించడంలో కలెక్టరేట్ అధికారులు వెనకబడుతున్నారు. గత వారం 160 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా.. ఈ వారానికి 368 పెండింగ్ అర్జీలు ఉండటం అధికారుల పనితనానికి అద్దం పడుతున్నాయి. సోమవారం జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ హరిసింగ్, శ్రీవత్స 52 వినతులను ప్రజల నుంచి స్వీకరించారు. వారు మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా తక్షణ పరిష్కారం చూపించాలని ఆదేశించారు. అర్జీలు ఏ దశలో ఉన్నాయో.. సంబంధిత వివరాలను అర్జీదారులకు తెలపాలన్నారు. దళితబంధు యూనిట్లతో ఉన్న లబ్ధిదారుల ఫొటోలను తీసి ఫైలింగ్ చేయాలన్నారు. జిల్లాలో పల్లెపట్టణ ప్రగతి పనులు నిరంతరం కొనసాగాలన్నారు. పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలను పర్యవేక్షించాలని ప్రత్యేకాధికారులను ఆదేశించారు. వచ్చే హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ కృషిచేయాలని సూచించారు.
సమస్యలు బాబోయ్
కార్పొరేషన్: నగరంలోని పలు కాలనీల నుంచి స్థానిక సమస్యలు వెల్లువెత్తాయి. కమిషనర్ ప్రావీణ్యకు సమస్యలు వివరించేందుకు కాలనీల ప్రజలు బారులుదీరారు. సోమవారం బల్దియా సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణిలో 65 ఫిర్యాదులు వచ్చాయి. టౌన్ప్లానింగ్ 29, పన్నులు 12, ఇంజినీరింగ్ 10, ప్రజారోగ్యం 4, తాగునీటి సరఫరా 9, వీధి దీపాలు 1 అర్జీలు ఇచ్చారు. అక్రమ నిర్మాణాలు, రోడ్లు, లేఅవుట్ ఖాళీ స్థలాల ఆక్రమణలు, నల్లా నీటి సరఫరా, కలుషిత నీరు తదితర సమస్యలపై కమిషనర్కు మొరపెట్టుకున్నారు. ఆక్రమణలపై సత్వర చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ రషీద్, ఉప కమిషనర్లు శ్రీనివాస్రెడ్డి, జోనా, ఎస్ఈ సత్యనారాయణ, నగర ప్రణాళికాధికారి వెంకన్న, ముఖ్య ఆరోగ్యాధికారి డాక్టర్ రాజారెడ్డి తదితరులున్నారు.
తన భూమిని కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్న అమృతమ్మ
వినతులు ఇలా..
* వరంగల్ దేశాయిపేట శివారు నవయుగ కాలనీ లేఅవుట్ ఖాళీ స్థలం రిజిస్ట్రేషన్లు రద్దుచేయాలని, ఇంటి నంబర్లు బ్లాకు లిస్టులో పెట్టాలని, ఆర్వో, ఆర్ఐలపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త పెరుమాళ్ల లక్ష్మణ్ కోరారు. * హనుమకొండ ప్రాంతం ఇంటినంబరు 4-9-118 నల్లా కనెక్షన్ లేకున్నప్పటికీ పన్ను మదింపు చేశారని విన్నవించారు. * హనుమకొండ ప్రాంతం నయీంనగర్ ఇంటినంబరు 2-2-273 దగ్గర అదనపు అంతస్తు నిర్మాణంపై ఫిర్యాదు చేశారు. * ప్లాస్టిక్ నిషేధంపై నగర ప్రజల్లో అవగాహన కలిగేలా గోడలపై చిత్రాలు వేయించాలని ప్రేరణ విద్యా వికాస పోషణ ఫౌండేషన్ ప్రతినిధులు కోరారు. * బక్రీద్ పండుగ ఉన్నందున ఈద్గాలు శుభ్రం చేయించాలని విన్నవించారు. * టీఎస్-బీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసి 21 రోజులవుతున్నా ఇంత వరకు అనుమతి ఇవ్వలేదని వరంగల్ గిర్మాజిపేటకు చెందిన నసీరుద్దీన్ ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గ్రేటర్ చుట్టూ రాజకీయం..!
[ 27-04-2024]
ఓవైపు వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచార హోరు.. మరోవైపు శుక్రవారం రాత్రి ఖిలావరంగల్ కోటలో కాంగ్రెస్, భారాస కార్పొరేటర్లు రహస్య సమావేశం. -
ఆమోదం 73 మంది.. తిరస్కరణ 15 మంది..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల పరిశీలన పూర్తయింది. వరంగల్ (ఎస్సీ), మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాలకు జాతీయ, ప్రాంతీయ, గుర్తింపు పొందిన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 88 మంది 145 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలు
[ 27-04-2024]
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని బల్దియా పాలకులు చెబుతున్నారు. ఏడాదికోసారి కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు, ప్రమాదాల నుంచి రక్షణ కోసం ఇచ్చే రేడియం స్టిక్కర్ ఉన్న ఆప్రాన్లు ఇవ్వడం లేదు. -
నకిలీ వైద్య కేంద్రాల్లో వైద్యమండలి తనిఖీలు
[ 27-04-2024]
హనుమకొండ జిల్లాలోని నకిలీ వైద్య కేంద్రాల్లో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి రాష్ట్ర వైద్యమండలి సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ ఛైర్మన్ డాక్టర్ వి.నరేష్కుమార్ తెలిపారు. -
భానుడు భగభగ.. ప్రయాణికులు విలవిల
[ 27-04-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. దాదాపు 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. వివిధ అవసరాల నిమిత్తం నగరానికి వచ్చిన పలువురు ఎండ ధాటికి విలవిలలాడారు. -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బండారి స్వాగత్ రణ్వీర్చంద్ సంబంధిత అధికారులకు సూచించారు. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే అభివృద్ధి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనసును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగలాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తి గాంచిన భద్రాచలం రాములోరి ఆలయం. -
చాడా.. తొలి పోటీలోనే తిరుగులేని విజయం
[ 27-04-2024]
హనుమకొండకు చెందిన చాడా సురేష్రెడ్డి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. బీఏ డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1990 దశకంలో ప్రముఖ గుత్తేదారుగా గుర్తింపు కలిగి ఉన్నారు. -
నాడు తండ్రులు.. నేడు వారసులు
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. తండ్రుల రాజకీయ వారసత్వ తీర్థం పుచ్చుకొని ఎన్నికల క్షేత్రంలో పోరాడేందుకు యువ వారసులు సిద్ధమయ్యారు. -
ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలపై అధికారుల ఉదాసీనత
[ 27-04-2024]
జనగామ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు, గ్రామాల్లో క్లినిక్లు నిర్వహిస్తున్న వైద్యులు, ఆర్ఎంపీల ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో తనిఖీలు చేపట్టడానికి ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. -
కరవు కోరలు.. పశుగ్రాసానికి తంటాలు!
[ 27-04-2024]
వర్షాలు సరిగా లేక పంటలు వేసినా చాలా వరకు చేతికందలేదు.. దీంతో రైతన్నలు పశుగ్రాసానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. మోరంచవాగుకు ఇరువైపులా పంటలు సాగు చేసుకున్న వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది -
కక్షిదారులకు ఈ-న్యాయ సేవలు
[ 27-04-2024]
వివిధ న్యాయస్థానాల్లో కక్షిదారులకు వారి కేసులకు సంబంధించిన సమాచారం, ధ్రువపత్రాలు, న్యాయసహాయం తదితర సేవలు మరింత సులభతరం కానున్నాయి. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
పోలు చిట్టీలొచ్చాయ్..!
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల్లో శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లకు పోల్ చిట్టీలను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
అనుమతి లేకుండా ల్యాబ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు
[ 27-04-2024]
అనుమతి, అర్హతలు లేకుండా డయాగ్నస్టిక్ సెంటర్లు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి కళావతిబాయి హెచ్చరించారు. -
వంతెనల నిర్మాణాల్లో తేలిపోతున్న నాణ్యత లోపాలు..
[ 27-04-2024]
దశాబ్దాల పాటు మన్నికగా ఉండాల్సిన వంతెనలు ఉన్నఫలంగా కూలిపోతున్నాయి. ప్రజల రవాణా కష్టాలను మెరుగు పర్చేందుకు నిర్మిస్తున్న వారధుల జీవితకాలం కొద్ది రోజుల్లోనే ముగుస్తోంది. -
రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం
[ 27-04-2024]
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ .. ఆ పార్టీ అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని’ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్