రామాయణం.. చెబుతోంది జీవిత పాఠం!
రామాయణం.. జీవిత పాఠాలు ఎన్నో నేర్పిస్తుంది. ఇందులోని ఏడు కాండలను చదివితే మన జీవితానికి ఉపయుక్తమైన వ్యక్తిత్వ అంశాలు నేర్చుకోవచ్చు.
నేడు శ్రీరామనవమి
ఈనాడు, వరంగల్
రామోవిగ్రహవాన్ ధర్మః సాధుఃసత్య పరాక్రమః ।
రాజా సర్వస్యలోకస్య దేవానాం మఘవానివ।।
* శరీరం ధరించి దిగివచ్చిన ధర్మమే రాముడు. సకల ప్రాణకోటికి హితవు కలిగించే సాధుజీవనుడు. శ్రీరాముడంటే ఏమిటో ఒక్క శ్లోకంలో ఇలా నిర్వచనం ఇచ్చారు మారీచుడు.
రామాయణం.. జీవిత పాఠాలు ఎన్నో నేర్పిస్తుంది. ఇందులోని ఏడు కాండలను చదివితే మన జీవితానికి ఉపయుక్తమైన వ్యక్తిత్వ అంశాలు నేర్చుకోవచ్చు. బాలకాండ నుంచి ఉత్తరకాండ వరకు ప్రతిదీ మన జీవితానికి అన్వయించుకొని గొప్ప విజయాలు సాధించొచ్చు. గురువారం శ్రీరామనవమిని పురస్కరించుకుని ఏ కాండం నుంచి ఏం నేర్చుకోవచ్చో వివరిస్తూ ప్రత్యేక కథనం..
ఆటలతో సామర్థ్యం పెంపు
మన దేశంలో పిల్లలు వారానికి 86 నిమిషాలు మాత్రమే ఆటలు ఆడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం వారానికి 420 నిమిషాలు ఆటలాడుతూ, శారీరక శ్రమ కలిగించే పనులు చేయాలి. ‘పుమ-నీల్సన్’ కలిసి చేసిన సర్వే సారం ఇది. దేశంలో పెద్దలు వారానికి 101 నిమిషాలు శ్రమిస్తుంటే పిల్లలు తక్కువ సమయం కేటాయిస్తున్నారని తేలింది.
* ఓరుగల్లు నగరంలో మురికివాడల పిల్లల కోసం ఉద్యానవనాలు నిర్మిస్తున్నారు. మన ఊరు మన బడి కింద పాఠశాలల్లో పిల్లలకు క్రీడా పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని పిల్లలు సద్వినియోగం చేసుకోవాలి. చరవాణులను పక్కనపెట్టి శారీరకమైన ఆటలాడాలి. ఏదైనా ఒక క్రీడలో నిష్ణాతులు కావాలి. బాల కాండ నేర్పే పాఠమిదే.
బాలకాండ
బాలకాండలో రాముడు తన సోదరులతో కలిసి అనేక ఆటలు ఆడారు. విలు విద్యలు నేర్చుకున్నారు.. ఇలా ఆటలు ఆడడం ద్వారా ఎన్ని ఇబ్బందులెదురైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని సంపాదించుకోవచ్చు.
పెద్దలమాట వినాలి
దేశంలో కోటి మందికిపైగా 60 ఏళ్ల పైబడిన వారు మంద మతి (డెమన్షియా)తో బాధపడుతున్నారని ఇటీవల కృత్రిమ మేధ ద్వారా జరిగిన ఒక అధ్యయనం వెల్లడించింది. వీరిలో ఎక్కువగా పేదవారు, నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాల వారే. తల్లి బతికుండగానే ఆమె చనిపోయినట్టు మరణ ధ్రువీకరణ పత్రం తీసుకొన్న ఉదంతం గతేడాది మన దగ్గర వెలుగులోకి వచ్చింది. తమకు భారం అవుతున్నారని అనేక మంది వరంగల్లోని వృద్ధాశ్రమాల్లో పెద్దలను చేరుస్తున్న ఉదంతాలు ఎన్నో.
అయోధ్య..
పెద్దలను గౌరవించడం ‘అయోధ్యకాండ’ నుంచి నేర్చుకోవాలి. రాముడు తండ్రి ఆదేశించగానే వనవాసానికి వెళ్లారు. ఇలా పెద్దవారి మాటలను గౌరవించే కుటుంబాలు ఆదర్శంగా నిలుస్తాయి. వారికి తగిన గౌరవం ఇస్తే సమాజం బాగుంటుంది.
ప్రకృతితో మమేకం..
ది ఎలిఫెంట్ విస్పర్స్ అనే భారతీయ లఘు చిత్రానికి మొన్న ఆస్కార్ పురస్కారం దక్కింది. అడవి నుంచి తప్పించుకున్న రెండు పిల్ల ఏనుగుల్ని ఓ వృద్ధ జంట అక్కున చేర్చుకొనే కథ ఇది. ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని కళ్లకు కట్టే నేపథ్యం. అరణ్యకాండ మనకు అదే బోధిస్తుంది. ములుగు, భూపాలపల్లి, వరంగల్ జిల్లాల్లోని అరణ్యాలకు వెళుతూ, అక్కడి సహజ వింతల్ని ఆస్వాదించడం జీవితంలో ఒక భాగం కావాలి.
అరణ్య..
రాముడు వనవాసానికి వెళ్లి ప్రకృతితో మమేకమయ్యారు. అడవుల్ని కాపాడుతూ.. వీలు చిక్కినప్పుడలా ప్రకృతి ఒడిలో సేదదీరితే జీవితంలో ఎంతో ఆనందం ఉంటుంది.
కష్టాలే సోపానాలుగా..
రామాయణంలోని సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తర కాండ.. వీటిలో నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. గొప్ప వ్యక్తులుగా ఎదగడానికి ఇవి ప్రేరణగా నిలుస్తాయి.. గతేడాది ఉక్రెయిన్లో యుద్ధం వల్ల మన వాళ్లూ ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డారు. తాజాగా వడగళ్ల వానల వల్ల అన్నదాతలు ఆగమయ్యారు. అనారోగ్యకరమైన ఆహారం వల్ల రోగాల పాలవుతున్నారు. చిన్న విషయాలకే కుంగిపోతున్నారు. నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. రామాయణానికి దగ్గరగా ఉండటం ద్వారా ఇలాంటి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడొచ్చు.
సుందర.. యుద్ధ.. ఉత్తర..
వీటి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ధైర్యం, సాహసం, సమయస్ఫూర్తి, నిరాడంబరత ఇలా ఎన్నో జీవిత పాఠాలను చెబుతాయి.
ఆత్మవిశ్వాసమే అసలు బలం
నేడు చిన్న కష్టం ఎదురైతే ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన జిల్లాల్లో సైతం ఇంటర్ పరీక్షలు రాయలేదని, పరీక్ష తప్పామని తనువు చాలిస్తున్నవారు ఉన్నారు. ఇటీవల టీఎస్పీఎస్సీ పరీక్షలు కొన్ని రద్దయ్యాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అర్హత సాధించిన వారు మళ్లీ పరీక్ష రాయాల్సి ఉంది. అలాంటి వారంతా ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ముందుకెళ్లి విజయం సాధించాలి.
కిష్కింధ..
జీవితంలో ఆత్మవిశ్వాసమే అసలైన బలమని కిష్కింధకాండ మనకు చెబుతోంది. హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకకు వెళ్లి సీతజాడ తెలుసుకుంటారు. ఆత్మవిశ్వాసమే అసలైన బలం అని ఈ ఘట్టం చెబుతోంది.
పఠించి ఆచరించాలి
శేషుశర్మ, భద్రకాళి దేవస్థాన ప్రధాన అర్చకులు, వరంగల్
రామాయణంలో ఏడు కాండాలు రాముడి జీవితంలో ఒక్కో దశను వివరిస్తాయి. రామాయణం ప్రతి ఒక్కరూ పఠించి అందులోని విషయాలను ఆచరించాలి. సత్యం కోసం పడ్డ తపన, భార్యకు ఇచ్చే ప్రాధాన్యం, విలువలతో కూడుకున్న జీవితానికి రామాయణ కావ్యం నిలువుటద్దం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలు
[ 27-04-2024]
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని బల్దియా పాలకులు చెబుతున్నారు. ఏడాదికోసారి కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు, ప్రమాదాల నుంచి రక్షణ కోసం ఇచ్చే రేడియం స్టిక్కర్ ఉన్న ఆప్రాన్లు ఇవ్వడం లేదు. -
నకిలీ వైద్య కేంద్రాల్లో వైద్యమండలి తనిఖీలు
[ 27-04-2024]
హనుమకొండ జిల్లాలోని నకిలీ వైద్య కేంద్రాల్లో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి రాష్ట్ర వైద్యమండలి సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ ఛైర్మన్ డాక్టర్ వి.నరేష్కుమార్ తెలిపారు. -
భానుడు భగభగ.. ప్రయాణికులు విలవిల
[ 27-04-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. దాదాపు 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. వివిధ అవసరాల నిమిత్తం నగరానికి వచ్చిన పలువురు ఎండ ధాటికి విలవిలలాడారు. -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బండారి స్వాగత్ రణ్వీర్చంద్ సంబంధిత అధికారులకు సూచించారు. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే అభివృద్ధి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనసును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగలాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తి గాంచిన భద్రాచలం రాములోరి ఆలయం. -
చాడా.. తొలి పోటీలోనే తిరుగులేని విజయం
[ 27-04-2024]
హనుమకొండకు చెందిన చాడా సురేష్రెడ్డి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. బీఏ డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1990 దశకంలో ప్రముఖ గుత్తేదారుగా గుర్తింపు కలిగి ఉన్నారు. -
నాడు తండ్రులు.. నేడు వారసులు
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. తండ్రుల రాజకీయ వారసత్వ తీర్థం పుచ్చుకొని ఎన్నికల క్షేత్రంలో పోరాడేందుకు యువ వారసులు సిద్ధమయ్యారు. -
ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలపై అధికారుల ఉదాసీనత
[ 27-04-2024]
జనగామ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు, గ్రామాల్లో క్లినిక్లు నిర్వహిస్తున్న వైద్యులు, ఆర్ఎంపీల ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో తనిఖీలు చేపట్టడానికి ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. -
కరవు కోరలు.. పశుగ్రాసానికి తంటాలు!
[ 27-04-2024]
వర్షాలు సరిగా లేక పంటలు వేసినా చాలా వరకు చేతికందలేదు.. దీంతో రైతన్నలు పశుగ్రాసానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. మోరంచవాగుకు ఇరువైపులా పంటలు సాగు చేసుకున్న వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది -
కక్షిదారులకు ఈ-న్యాయ సేవలు
[ 27-04-2024]
వివిధ న్యాయస్థానాల్లో కక్షిదారులకు వారి కేసులకు సంబంధించిన సమాచారం, ధ్రువపత్రాలు, న్యాయసహాయం తదితర సేవలు మరింత సులభతరం కానున్నాయి. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
పోలు చిట్టీలొచ్చాయ్..!
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల్లో శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లకు పోల్ చిట్టీలను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
అనుమతి లేకుండా ల్యాబ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు
[ 27-04-2024]
అనుమతి, అర్హతలు లేకుండా డయాగ్నస్టిక్ సెంటర్లు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి కళావతిబాయి హెచ్చరించారు. -
వంతెనల నిర్మాణాల్లో తేలిపోతున్న నాణ్యత లోపాలు..
[ 27-04-2024]
దశాబ్దాల పాటు మన్నికగా ఉండాల్సిన వంతెనలు ఉన్నఫలంగా కూలిపోతున్నాయి. ప్రజల రవాణా కష్టాలను మెరుగు పర్చేందుకు నిర్మిస్తున్న వారధుల జీవితకాలం కొద్ది రోజుల్లోనే ముగుస్తోంది. -
రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం
[ 27-04-2024]
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ .. ఆ పార్టీ అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని’ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్