జిల్లా కేంద్రం.. చినుకు పడితే జలమయం
పేరుకే జిల్లా కేంద్రం. వర్షాకాలం వచ్చిందంటే కొన్ని కాలనీలు జలమయమైపోతుంటాయి. మురుగు కాలువ వ్యవస్థ సరిగా లేకపోవడం, అవసరమున్న చోట కల్వర్టుల నిర్మాణం చేపట్టకపోవడం, కాల్వలను నీరు వెళ్లే విధంగా నిర్మించకపోవడడంతో వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆయా కాలనీవాసులు వణికిపోతుంటారు.
ములుగు, న్యూస్టుడే: పేరుకే జిల్లా కేంద్రం. వర్షాకాలం వచ్చిందంటే కొన్ని కాలనీలు జలమయమైపోతుంటాయి. మురుగు కాలువ వ్యవస్థ సరిగా లేకపోవడం, అవసరమున్న చోట కల్వర్టుల నిర్మాణం చేపట్టకపోవడం, కాల్వలను నీరు వెళ్లే విధంగా నిర్మించకపోవడడంతో వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆయా కాలనీవాసులు వణికిపోతుంటారు. మురుగు కాల్వల వ్యవస్థను క్రమబద్ధీకరించాలని చాలా సంవత్సరాలుగా పట్టణ ప్రజలు కోరుతున్నప్పటికీ అధికారులు దృష్టి పెట్టడం లేదు. ములుగు జిల్లా కేంద్రం కావడంతో నివాస గృహాల నిర్మాణం పెరిగిపోయింది. జనాభా కూడా ఊహించని విధంగా పెరిగిపోయింది. కొత్తగా కాలనీలు ఏర్పడ్డాయి. వాటిల్లో మురుగు కాల్వల నిర్మాణం ఇంకా అసంపూర్తిగానే ఉంది. మురుగు, వరద నీరు రోడ్లపై నిలిచి కష్టాలు పడుతున్నారు. రానున్న వర్షాకాలంలో ముందస్తు ప్రణాళికతో ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఉంది.
20 కాలనీలు.. 25 వేల జనాభా
ములుగు జిల్లా కేంద్రంలో సుమారు 20 కాలనీలున్నాయి. మేజర్ పంచాయతీ కావడంతో ములుగుతో పాటు ప్రేమ్నగర్, రంగారావుపల్లి, మాధవరావుపల్లి, పాల్సాబ్పల్లి శివారు గ్రామాలున్నాయి. ములుగు పట్టణంలో సుమారు 25 వేల జనాభా ఉంటుందని అంచనా. దాంతో పాటు సుమారు 4 వేల నివాస గృహాలున్నాయి. కాలనీల సంఖ్య, జనాభా పెరిగిపోతుండడంతో ప్రజల అవసరాలు పెరిగిపోతున్నాయి. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది.
ప్రధానంగా నాలుగు చోట్ల..
జిల్లా కేంద్రంలో ప్రధానంగా నాలుగు కాలనీలకు వర్షాకాలంలో ముంపు సమస్య ఉంటుంది. ప్రగతినగర్, శ్రీనివాసకాలనీ, వీవర్స్ కాలనీ, లక్ష్మీనగర్ కాలనీల్లో వర్షాలు పడితే రోడ్లపైనే నీరు నిలుస్తుంది. పలు ఇళ్లలోకి వరద వచ్చి కాలనీ వాసులు ఇబ్బందులు పడుతుంటారు. ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
కాల్వలు నిర్మించాలి..
- చల్లూరి మహేందర్, ప్రగతినగర్ కాలనీ
ప్రతి వర్షాకాలంలో చాలా ఇబ్బందిగా ఉంటోంది. వర్షం పడితే నీరు బయటకు పోకుండా పూర్తిగా రోడ్లపైనే నిలుస్తుంది. మా కాలనీలో కల్వర్టులతో పాటు మురుగు కాల్వలు నిర్మించాలి.
నిల్వ నీటితో ఇక్కట్లు..
- పాడ్య కుమార్, శ్రీనివాసనగర్ కాలనీ
వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు వచ్చి అవస్థలు పడుతున్నాం. అధికారులు చొరవ తీసుకొని క్రమ పద్ధతిలో మురుగు కాల్వల నిర్మాణం చేపట్టాలి. అవసరం ఉన్న చోట కల్వర్టులు నిర్మించి నీరు సాఫీగా వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలి.
సమస్యలు తలెత్తకుండా చూస్తున్నాం..
- సిరంగి మహేందర్, పంచాయతీ కార్యదర్శి, ములుగు
ములుగు పట్టణంలో వర్షాకాలంలో కాలనీల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా ప్రగతినగర్ కాలనీ, లక్ష్మీనగర్లలో ఎక్కువగా సమస్య ఉంటుంది. అయితే లక్ష్మీనగర్లో సమస్య రాకుండా ఇప్పటికే కాల్వ తవ్వించాం. ప్రగతి నగర్ కాలనీలో కల్వర్టు, మురుగు కాల్వల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్