logo

ఉత్తమ లోకోషెడ్‌ అవార్డు అందజేత

దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్‌ లోకోషెడ్‌ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్‌ మేనేజర్‌ అరుణ్కుమార్‌ జైన్‌ చేతుల మీదుగా షెడ్‌ సీనియర్‌ డీఎంఈ స్వరాజ్‌కుమార్‌ గురువారం స్వీకరించారు.  

Updated : 26 Apr 2024 06:04 IST

డీఎంఈ స్వరాజ్‌కుమార్‌కు స్వాగతం పలుకుతున్న  రైల్వే అధికారులు, కార్మికులు

కాజీపేట, న్యూస్‌టుడే: దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్‌ లోకోషెడ్‌ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్‌ మేనేజర్‌ అరుణ్కుమార్‌ జైన్‌ చేతుల మీదుగా షెడ్‌ సీనియర్‌ డీఎంఈ స్వరాజ్‌కుమార్‌ గురువారం స్వీకరించారు.  మెమెంటోతో వచ్చిన స్వరాజ్‌కుమార్‌కు షెడ్‌ అధికారులు, కార్మికులు, కార్మిక నాయకులు కాజీపేట రైల్వే స్టేషన్‌లో మంగళవాయిద్యాలతో ఘనస్వాగతం పలికి ర్యాలీగా షెడ్డుకు తీసుకెళ్లారు. సీనియర్‌ డీఎంఈ మాట్లాడుతూ అధికారులు, కార్మికుల సమష్టి కృషితో అవార్డు సాధించామని మెచ్చుకున్నారు. భారత రైల్వేలోనే కాజీపేట డీజిల్‌ షెడ్‌ కార్మికులు అత్యంత సాంకేతిక ప్రతిభ కలిగి, అంకితభావంతో పనిచేస్తున్నందునే ఏటా అవార్డులు వస్తున్నాయన్నారు. డీజిల్‌ లోకోషెడ్‌లోనూ విద్యుత్తు లోకోలను నిర్వహించి అవార్డు సాధించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో డీఎంఈలు అనికేత్‌, అతుల్‌ ద్వివేది, ఏసీఎం రవీంద్రకుమార్‌, ఎల్‌ఎఫ్‌ఈలు రాజశేఖర్‌, రమేష్‌కుమార్‌, ధీరజ్‌కుమార్‌ యూనియన్‌, సంఘ్‌ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని