logo

‘కాంగ్రెస్‌కు ఓటమి తప్పదు’

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్‌ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్‌కుమార్‌కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హాజరై ప్రసంగించారు.

Published : 26 Apr 2024 04:37 IST

ప్రసంగిస్తున్న మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

తొర్రూరు, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్‌ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్‌కుమార్‌కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హాజరై ప్రసంగించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో ఓటమి తప్పదని దుయ్యబట్టారు. వెలికట్ట గ్రామంలో మహిళలు నీళ్లకోసం బిందెలతో ఘర్షణ పడుతున్న సంఘటన చూస్తే బాధేసిందన్నారు. పాలకుర్తిలో అత్త, కోడలు ఇద్దరు ఎమ్మెల్యేలని విమర్శించారు. నియోజకవర్గాన్ని మాజీమంత్రి దయాకర్‌రావు రూ.వందలకోట్లతో అభివృద్ధి చేస్తే నేడు అభివృద్ధి కుంటుపడిందన్నారు. అనంతరం దయాకర్‌రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ మోసగాడని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ప్రస్తుతం నమ్మడం లేదన్నారు. మళ్లీ పాలకుర్తి నుంచి పోటీ చేస్తే తానే గెలుస్తానని స్పష్టం చేశారు. పార్టీ నుంచి ఒకరిద్దరు వెళ్తే ఏం నష్టం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. నమ్మకంతో ఎంపీˆ టికెట్ ఇస్తే కేసీఆర్‌ను మోసం చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్‌పై ప్రతీకారం తీర్చకోవాలన్నారు. మాదిగలకు టికెట్‌ ఇవ్వకుండా అవమానించిన కాంగ్రెస్‌ పార్టీని ఓడించాలని విమర్శించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని