భయం వద్దు.. ఆకాశమే హద్దు!
పరీక్షల కాలం.. విద్యార్థుల్లో భయం.. చదివిన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయో..రావో వచ్చినా రాయగలుగుతామో.. లేదోనంటూ ఆందోళన.. దీంతో మానసిక ఒత్తిడి పెరిగి ఆత్మహత్యల వైపు పయనం.
పరీక్షల కాలం.. విద్యార్థుల్లో భయం.. చదివిన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయో..రావో వచ్చినా రాయగలుగుతామో.. లేదోనంటూ ఆందోళన.. దీంతో మానసిక ఒత్తిడి పెరిగి ఆత్మహత్యల వైపు పయనం. తమ చదువు తల్లిదండ్రులకు ఆర్థికభారం కావొద్దనే ఆలోచనతో బలవన్మరణాలకు తెగబడుతున్న దారుణం. మార్కులు, ర్యాంకులే చదువు కాదని.. విద్యతో కలిగే ప్రయోజనం, చదువులో వెనకబడినా.. జీవితంలో విజయం సాధించిన వారి స్ఫూర్తిగాథలతో పిల్లల్లో ధైర్యం నింపాలి. భయం వీడితే జయం మీదేనంటూ తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రోత్సహించాలి.
ఈనాడు, మహబూబాబాద్
ఏటా పరీక్షలు బాగా రాయలేకపోయామని ఇంటర్, పది విద్యార్థులు చేసుకుంటున్న ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న చరణ్తేజ్ వార్షిక పరీక్షల ఒత్తిడి కారణంగానే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటర్లో వారికి ఇష్టమున్న గ్రూప్లో చేరనివ్వకుండా తల్లిదండ్రులు తమకు ఇష్టమైన కోర్సుల్లో చేర్పిస్తారు. అది విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తోంది. ఎంపీసీ గ్రూప్ చదివితే.. మంచి ర్యాంక్ సాధించి ఐఐటీలో చేరొచ్చని, బైపీసీ ఎంచుకుంటే నీట్లో మంచి ర్యాంకు వచ్చి డాక్టర్ కావచ్చని పిల్లలపై తమ ఇష్టాలను తల్లిదండ్రులు రుద్దుతుంటారు. ఆ కోర్సులు ఇష్టం లేకపోయినా, తల్లిదండ్రులకు చెప్పలేక ఒత్తిడితో అయిష్టంగానే చదువుతుంటారు. ఇలాంటి వారు మార్కులు తెచ్చుకోలేక ఆత్మనూన్యత భావంతో ఆత్మహత్య చేసుకోవాలనే అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంటున్నారు.
బంధువుల పిల్లలు మంచి స్థానంలో ఉన్నారంటూ..వారిని ప్రేరణగా తీసుకోవాలని సూచిస్తూ ఒత్తిడి తేవడం. తరగతి గదుల్లోనూ అంతర్గత పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఉపాధ్యాయులు, అధ్యాపకులు భయపెట్టడంతో వార్షిక పరీక్షల సమయంలో తెలియకుండానే ఆందోళన, ఒత్తిడికి లోనవుతున్నారు. తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేక పోతున్నామనే మనోవేదనకు లోనై చావే పరిష్కారం అన్న తీవ్ర నిర్ణయం తీసుకుంటారు.
ఇలా చేద్దాం
చదువు విషయంలో తల్లిదండ్రులు పిల్లల ఇష్టాయిష్టాల ప్రకారం నడుచుకోవాలి. వారు ఎలాంటి కోర్సులో చేరాలనుకుంటున్నారో.. దాని ప్రయోజనాలు, చదవగల సామర్థ్యాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలి.
పరీక్షల్లో వచ్చిన మార్కుల గురించి ఆలోచించకుండా పిల్లల్లోని ఇతర నైపుణ్యాలను మెచ్చుకోవడం వల్ల వారిలో మంచి మార్పు వస్తుంది. ః విద్యార్థుల్లో ఉన్న భయాన్ని, ఆందోళనని పారదోలుతూ పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చినా మరో మార్గాన్ని ఎంచుకోవచ్చంటూ భరోసా కల్పించాలి.
ఇవి గమనించాలి: ఆత్మహత్య చేసుకోవాలనుకునే విద్యార్థులు ఒంటరిగా ఉంటారు. భోజనం చేసేటప్పుడు కూడా ఆందోళనతో దిగాలుగా ఉంటారు. చదివే సమయంలో డల్గా ఉంటారు. తోటి స్నేహితులకూ దూరంగా ఉంటారు.ఈ లక్షణాలు గమనించి ఆ ఆలోచనల నుంచి దృష్టి మళ్లించాలి.
గతంలోని సంఘటనలు
- 2023 మేలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలానికి చెందిన తేజావత్ సింధు ఇంటర్ వృత్తి విద్య ఒక సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకుంది.
- 2023 ఏప్రిల్ 11న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడగుట్టతండాకు చెందిన గుగులోతు కృష్ణ నీట్ రాసినా సీటు రాదనే ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వీరే స్ఫూర్తి
ఐఏఎస్ అధికారి అంజుశర్మ పదో తరగతిలో, ఇంటర్లో ఫెయిల్ అయ్యారు. అయినా కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసంతో చదువుకున్న ఆమె ఆ తరువాత ఐఏఎస్ అధికారిగా అయ్యారు.
ఆపిల్ ఫోన్ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ కూడా కళాశాలలో డ్రాప్ విద్యార్థి. అయినా ఆయన మనోవేదనకు గురికాలేదు. ఆయన ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో ఒకరు.
మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత తనకు ఇష్టమైన క్రికెట్ను కెరీర్గా ఎంచుకుని ఆ వైపుగా ఎదిగారు. క్రికెట్ దేవుడు అనే పేరు తెచ్చుకున్నారు.
ఓడిన చోటే గెలుపు సాధించాలి : బరుపాటి గోపి, సైకాలజిస్టు, వరంగల్
పరీక్షలను పాజిటివ్ ఆలోచనలతో రాయాలి. భయాన్ని వీడి ఇష్టంతో చదివితే గుర్తుంటాయి. తల్లిదండ్రులు కూడా చదవటం లేదని..నిరాశకు గురిచేయకుండా బాగా చదువుతావంటూ ప్రోత్సహించాలి. ఓడిన చోటనే గెలుపును సాధించాలి. ఎందరో జీవితగాథలను చెప్పి వారిలో స్ఫూర్తి నింపాలి
ఇంటర్, డిగ్రీలో తప్పాను: గండ్రాతి సతీష్, ఎస్సై, నర్సింహులపేట
ఇంటర్లో సప్లిమెంటరీ రాసి పాసయ్యాను. డిగ్రీలోనూ రెండు సార్లు ఫెయిలయ్యా. మనోధైర్యం కోల్పోకూడదంటూ తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో డిగ్రీ పాసయ్యా. సర్కారు కొలువు సాధనే లక్ష్యంతో మొదటిసారి ఎస్సై ఉద్యోగానికి పరీక్ష రాస్తే అవకాశం రాలేదు. ఇతర కొలువులు వచ్చినా ఎస్సై పరీక్ష రాసిఅనుకున్నది సాధించా.
న్యూస్టుడే, నర్సింహులపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
[ 18-05-2024]
కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రమేశ్పై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. -
ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన ఏకు చిరంజీవి
[ 18-05-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల పట్టణంలోని అంబేద్కర్ రాజిపేట కాలనీకి చెందిన ఏకు చిరంజీవి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. -
వణికిన నగరం!
[ 18-05-2024]
నగరంలో గురువారం రాత్రి ఆకస్మికంగా కురిసిన భారీ వర్షంతో పౌరులు వణికిపోయారు. -
ఉప పోరు.. ప్రచార హోరు
[ 18-05-2024]
మొన్నటి వరకు లోక్సభ ఎన్నికలతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఫలితాలు ఇంకా వెలువడకముందే ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందడి మొదలైంది. -
పనులు చేశారా.. పంచుకున్నారా..!
[ 18-05-2024]
బదిలీపై వెళ్లిన ఉన్నతాధికారి పాత తేదీలతో 200 మెజర్మెంటు బుక్కు(ఎంబీ)లపై సంతకాలు చేయించడానికి గల కారణాలేమిటి? అభివృద్ధి పనులు చేశారా? చేయకుండానే ఎంబీ రికార్డు చేశారా? -
జోరు వానతో ఆగమాగం
[ 18-05-2024]
ఆకస్మిక అకాల వర్షాలతో జనగామ పట్టణం జలమయమవుతోంది. నిండు వేసవిలో కురిసిన పెద్ద వానకే పరిస్థితి ఇలా ఉంటే, రానున్న వర్షాకాలంలో ఎలా ఉంటుందోనని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీకి పెరిగిన ఆదాయం!
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జనగామ ఆర్టీసీ డిపోకు ఆదాయం పెరిగింది. -
పాఠశాలల అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు
[ 18-05-2024]
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా గుర్తించిన పాఠశాలల్లోని అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యం తగదని సంబంధిత గుత్తేదారులు, అధికారులకు కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. -
స్ట్రాంగ్ రూం వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన
[ 18-05-2024]
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతా ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం నగర కమిషనర్ అంబర్ కిషోర్ఝా ఆకస్మికంగా తనిఖీచేశారు. -
దూసుకొస్తున్న లారీ.. ప్రాణాలు హరీ!
[ 18-05-2024]
గోదావరిలో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. మహదేవపూర్, కాళేశ్వరం ప్రాంతాల నుంచి నిత్యం వందలాది ఇసుక లారీలు వివిధ ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. -
అన్నదాత ఆగమాగం
[ 18-05-2024]
ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని మండే ఎండలను తట్టుకొని యాసంగి సాగు చేసిన అన్నదాతల ఆశలు నేలవాలిపోయాయి. -
అప్పుడే పల్లెలపై పడ్డారు..!
[ 18-05-2024]
వర్షకాలం సీజన్ ప్రారంభమే కాలేదు.. ఉమ్మడి జిల్లాలో నకిలీ, నాసిరకం విత్తనాల విక్రయాలకు అక్రమార్కులు తెర లేపారు. -
కొత్త ఆసుపత్రిలోకి ఉన్నవి మార్చొచ్చా!
[ 18-05-2024]
వరంగల్ కేంద్ర కారాగార స్థలంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోకి ప్రస్తుతం ఉన్న ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్, టీబీ, ప్రాంతీయ నేత్రవైద్యశాల ఆసుపత్రులను మార్చడంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తో అధికారులతో సమీక్షించారు. -
గెలిపిస్తే నిరుద్యోగుల గళమవుతా..
[ 18-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భారాస తరఫున పోటీచేస్తున్న తనను గెలిపిస్తే రాష్ట్రంలో నిరుద్యోగల పక్షాన గళమవుతానని అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
[ 18-05-2024]
నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు, లారీలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శబరీష్ హెచ్చరించారు. -
హత్య కేసు ఛేదించిన పోలీసులు
[ 18-05-2024]
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరిగిన ఓ వివాహిత హత్య కేసును శుక్రవారం పోలీసులు ఛేదించారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ