గల్లీ నుంచి దిల్లీకి మన్యం మహిళ..!
భద్రాచలం మన్యానికి చెందిన రాధాబాయి ఆనందరావు నాలుగు సార్లు వరసగా నెగ్గి పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించి తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి భద్రాచలం ఎంపీగా 1967, 1971, 1977, 1980లో విజయబావుటా ఎగురవేసి మహిళా శక్తిని అప్పట్లోనే చాటిచెప్పారు.
నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన రాధాబాయి ఆనందరావు
భద్రాచలం, న్యూస్టుడే: భద్రాచలం మన్యానికి చెందిన రాధాబాయి ఆనందరావు నాలుగు సార్లు వరసగా నెగ్గి పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించి తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి భద్రాచలం ఎంపీగా 1967, 1971, 1977, 1980లో విజయబావుటా ఎగురవేసి మహిళా శక్తిని అప్పట్లోనే చాటిచెప్పారు. అప్పట్లో ప్రధాని ఇందిరగాంధీతో మాట్లాడాలంటే కాకలు తీరిన నాయకులు సైతం జంకేవారట. ఈమె మాత్రం నేరుగా ఇందిరను కలిసి ఈ ప్రాంత సమస్యలు ప్రస్తావించే చనువు పెంచుకుని ఆనాటి రాజకీయాల్లో ఓ సంచలనంగా నిలిచారు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి వంటి అగ్ర నాయకులతో రాజకీయ పరిచయాలు ఉండేవి. గిరిజనుల సంపూర్ణ వికాసం కోసం ఐటీడీఏల అవసరాన్ని గుర్తించి వీటి ఏర్పాటుకు జాతీయ స్థాయిలో ప్రయత్నం చేశారు. పశ్చిమ జర్మనీ, జకొస్లొవేకియా, బ్రిటన్ వంటి దేశాలలో పర్యటించారు. విదేశీ వ్యవహారాలలో అనుభవం గడించారు. ఉత్తమ పార్లమెంటేరియన్గానూ గుర్తింపు పొందారు. ఓయూ సెనేట్ సభ్యురాలిగా కొంత కాలం పని చేసిన రాధాబాయి ఆనందరావు ట్రైకార్ అధ్యక్షురాలిగా గిరిజన అభివృద్ధికి పాటుపడ్డారు.
- సామాన్య గిరిజన కుటుంబంలో జన్మించిన ఆమె వ్యూహ ప్రతివ్యూహాల్లో దిట్టగా గల్లీ నుంచి దిల్లీ దాకా ఎదిగారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వెంకటాపురంలో 1930లో ఆమె జన్మించారు. వెంకటాపురం ప్రస్తుతం ములుగు జిల్లాలో ఉంది. ఇది భద్రాచలం అసెంబ్లీ పరిధిలోని మండలం. రాజమండ్రిలో ఉపాధ్యాయ విద్యను అభ్యసించిన రాధాబాయి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఉపాధ్యాయురాలిగా సేవలు అందించారు. హిందీ పండిట్గా జాతీయ భాషపై విశేష ప్రచారం కల్పించారు. 1952లో కొత్తగూడేనికి చెందిన ఆనందరావును వివాహం చేసుకున్నారు. భర్త ప్రోత్సాహంతో వైద్య వృత్తిపై ఆసక్తి పెంచుకుని నర్సింగ్ శిక్షణ పూర్తయ్యాక కుటుంబ నియంత్రణపై గిరిజన గ్రామాల్లో 1957 నుంచి 1966 వరకు ప్రచారం చేశారు. దేశ రాజకీయాల్లో ప్రత్యేకతను చాటిన భద్రాచలం ఎంపీ స్థానం 2009లో రద్దు కావడంతో ఇది మహబూబాబాద్ ఎంపీ స్థానంలో భాగమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వణికిన నగరం!
[ 18-05-2024]
నగరంలో గురువారం రాత్రి ఆకస్మికంగా కురిసిన భారీ వర్షంతో పౌరులు వణికిపోయారు. -
ఉప పోరు.. ప్రచార హోరు
[ 18-05-2024]
మొన్నటి వరకు లోక్సభ ఎన్నికలతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఫలితాలు ఇంకా వెలువడకముందే ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందడి మొదలైంది. -
పనులు చేశారా.. పంచుకున్నారా..!
[ 18-05-2024]
బదిలీపై వెళ్లిన ఉన్నతాధికారి పాత తేదీలతో 200 మెజర్మెంటు బుక్కు(ఎంబీ)లపై సంతకాలు చేయించడానికి గల కారణాలేమిటి? అభివృద్ధి పనులు చేశారా? చేయకుండానే ఎంబీ రికార్డు చేశారా? -
జోరు వానతో ఆగమాగం
[ 18-05-2024]
ఆకస్మిక అకాల వర్షాలతో జనగామ పట్టణం జలమయమవుతోంది. నిండు వేసవిలో కురిసిన పెద్ద వానకే పరిస్థితి ఇలా ఉంటే, రానున్న వర్షాకాలంలో ఎలా ఉంటుందోనని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీకి పెరిగిన ఆదాయం!
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జనగామ ఆర్టీసీ డిపోకు ఆదాయం పెరిగింది. -
పాఠశాలల అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు
[ 18-05-2024]
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా గుర్తించిన పాఠశాలల్లోని అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యం తగదని సంబంధిత గుత్తేదారులు, అధికారులకు కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. -
స్ట్రాంగ్ రూం వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన
[ 18-05-2024]
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతా ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం నగర కమిషనర్ అంబర్ కిషోర్ఝా ఆకస్మికంగా తనిఖీచేశారు. -
దూసుకొస్తున్న లారీ.. ప్రాణాలు హరీ!
[ 18-05-2024]
గోదావరిలో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. మహదేవపూర్, కాళేశ్వరం ప్రాంతాల నుంచి నిత్యం వందలాది ఇసుక లారీలు వివిధ ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. -
అన్నదాత ఆగమాగం
[ 18-05-2024]
ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని మండే ఎండలను తట్టుకొని యాసంగి సాగు చేసిన అన్నదాతల ఆశలు నేలవాలిపోయాయి. -
అప్పుడే పల్లెలపై పడ్డారు..!
[ 18-05-2024]
వర్షకాలం సీజన్ ప్రారంభమే కాలేదు.. ఉమ్మడి జిల్లాలో నకిలీ, నాసిరకం విత్తనాల విక్రయాలకు అక్రమార్కులు తెర లేపారు. -
కొత్త ఆసుపత్రిలోకి ఉన్నవి మార్చొచ్చా!
[ 18-05-2024]
వరంగల్ కేంద్ర కారాగార స్థలంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోకి ప్రస్తుతం ఉన్న ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్, టీబీ, ప్రాంతీయ నేత్రవైద్యశాల ఆసుపత్రులను మార్చడంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తో అధికారులతో సమీక్షించారు. -
గెలిపిస్తే నిరుద్యోగుల గళమవుతా..
[ 18-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భారాస తరఫున పోటీచేస్తున్న తనను గెలిపిస్తే రాష్ట్రంలో నిరుద్యోగల పక్షాన గళమవుతానని అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
[ 18-05-2024]
నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు, లారీలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శబరీష్ హెచ్చరించారు. -
హత్య కేసు ఛేదించిన పోలీసులు
[ 18-05-2024]
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరిగిన ఓ వివాహిత హత్య కేసును శుక్రవారం పోలీసులు ఛేదించారు.
తాజా వార్తలు (Latest News)
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
ఉదయం 11 గంటలకు తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు..
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు
-
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?
-
వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో చంపించిన భార్య..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM