logo

బీఎస్పీ అభ్యర్థులు వీరే

బహుజనులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి అన్నారు.

Published : 28 Mar 2024 04:14 IST

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: బహుజనులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి అన్నారు. ఏలూరులోని బీఎస్పీ కార్యాలయంలో బుధవారం పార్టీ నాయకుల, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎస్పీ అభ్యర్థుల విజయానికి ఎస్సీ, ఎస్టీ, ముస్లీం, క్రైస్తవ మైనార్టీలందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఏలూరు జిల్లాలో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు ఏలూరు పార్లమెంట్‌ అభ్యర్థిగా ఆచార్య ఎన్‌ఏడీ పాల్‌, ఏలూరు అసెంబ్లీకి అందుగుల రతన్‌కాంత్‌, చింతలపూడి- ఎల్‌ చైతన్య, దెందులూరు - నేత రమేశ్‌ బాబు, ఉంగుటూరు- బుంగా ఏసు, కైకలూరు- మన్నేపల్లి నాగేశ్వరరావు, నూజివీడు - డాక్టర్‌ చెలిగంటి వెంకటేశ్వరరావు, పోలవరం - సరయం వెంకటేశ్వరరావులు పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సిర్రా భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని