మధ్యంతర భృతికి మంగళం
ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చే పద్ధతికి జగన్ సర్కార్ మంగళం పాడింది. అయిదేళ్ల కాలం మే నెలతో ముగుస్తుంది.
జులైలో పీఆర్సీ ఇస్తామంటూ కల్లబొల్లి హామీ
తాడేపల్లిగూడెంలో ఉపాధ్యాయుల నిరసన (పాత చిత్రం)
ఈనాడు డిజిటల్, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చే పద్ధతికి జగన్ సర్కార్ మంగళం పాడింది. అయిదేళ్ల కాలం మే నెలతో ముగుస్తుంది. కానీ జులైలో ఒకేసారి పీఆర్సీ ఇస్తామంటూ ఉద్యోగులకు హామీ ఇచ్చింది. సాధారణ ఎన్నికల ముందు ఐఆర్ తక్కువగా ఇస్తే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత మరింత పెరుగుతుందని ఐఆర్ ఇవ్వకుండా దాటవేసింది. దీన్ని సమర్థించుకునేందుకు జులైలో ఏకంగా పీఆర్సీనే ఇచ్చేస్తామనే హామీని తెరపైకి తెచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 11వ పీఆర్సీ సమయం గతేడాది జూన్తో ముగిసింది. జులై నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. ఉద్యోగుల సమస్యలపై రెండు నెలల క్రితం ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు నిర్వహించింది. ఉద్యోగులు ఐఆర్ అడగ్గా పీఆర్సీయే ఇచ్చేస్తాం కదా అంటూ మంత్రివర్గం హామీ ఇచ్చింది. నేటికీ అమలు కాలేదు.
నాడు
మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం.. గతంలో తెదేపా పాలనలో ఉద్యోగులను అణగదొక్కారు. - పాదయాత్ర సమయంలో వై.ఎస్.జగన్ పలికిన ప్రగల్భాలు.
నేడు
సీఎంగా కొలువుదీరాక ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై మౌనం దాల్చారు. ఉద్యమించేందుకు సిద్ధమైతే నోటీసులు, గృహ నిర్బంధాలు.. అరెస్టులు. ఆనక బెదిరింపులు.
ఏడాదికి పైగా నష్టపోయే ప్రమాదం
12వ పీఆర్సీ కమిషన్ను జులై 2023లో ప్రభుత్వం ఏర్పాటుచేసినా ఇంతవరకు ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభించలేదు. ఎక్కడైనా నాలుగు నెలల్లో పీఆర్సీ ప్రక్రియ పూర్తయి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందా? ఇప్పుడు ఐఆర్ రాకపోతే దాదాపు ఏడాదికి పైగా నష్టపోయే ప్రమాదం ఉందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ ఉద్యోగుల వరకు 34వేల మంది ఉన్నారు. ఆర్టీసీ, సచివాలయ ఉద్యోగులను కలిపితే సుమారు 52వేల మంది ఉన్నారు. అయిదేళ్ల కాలంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోగా, డిమాండ్ చేస్తే భయపెట్టే ప్రయత్నం చేసిందని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జగన్ మాట తప్పారని, మడమ తిప్పారని ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి.
బకాయిలు రూ.80కోట్లకు పైగానే
మొదటిసారి పీఆర్సీ నివేదిక కాకుండా ఆఫీసర్స్ కమిటీ నివేదికను ఆమోదించి ప్రభుత్వం కొత్త పోకడ సృష్టించింది. ఎన్నికల హామీగా ప్రకటించిన 27శాతం మధ్యంతర భృతి కంటే తక్కువ ఫిట్మెంట్ 23శాతం ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో రెగ్యులర్, పింఛనుదారులకు సంబంధించి రూ.80 కోట్లకు పైనే ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలు అలాగే ఉన్నాయి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై దాటవేత ధోరణి అవలంబిస్తోంది.
తిరుపతిరావు, ఉపాధ్యాయుడు
తీవ్ర నిరాశ మిగిల్చింది
ఐఆర్ కంటే ఫిట్మెంట్ నాలుగు శాతం తగ్గించడం దేశంలో ఎక్కడా జరగలేదు. దీంతో సగటు ఉద్యోగికి తన సర్వీసు కాలంలో రెండు, మూడు ఇంక్రిమెంట్లు నష్టపోయే అవకాశం ఉంది. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలా లేదు.- టి.భాస్కరరావు, ఉపాధ్యాయుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మేమేం చేశాం పాపం?
[ 04-05-2024]
జగన్ సర్కారు అక్కసుతో పింఛనుదారుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. అగ్నిగుండంలాంటి ఎండలో పింఛను కోసం వారు పడిన వేదన వర్ణనాతీతం. -
మీ గెండెల్లో ధైర్యం నింపడానికి వచ్చా
[ 04-05-2024]
కొల్లేరు సమస్య పరిష్కారానికి కేంద్ర సాయంతో కృషి చేస్తామని జనసేన అధినేత పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు. శుక్రవారం కైకలూరులో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. -
ఎగవేత.. లేదంటే కోత
[ 04-05-2024]
రైతే రాజన్నది నానుడి. అయిదేళ్ల కాలంలో జగనన్న వారినీ వదల్లేదు. తన మార్కు చర్యలతో కర్షకులను అన్ని విధాలా కష్టపెట్టారు. అయితే వ్యవసాయ రాయితీల ఎగవేత.. లేదంటే కోతలతో అన్నదాతలకు నష్టాలను మూట కట్టారు. -
హక్కు చట్టంతో.. ఆస్తులకు కాళ్లొస్తాయ్!
[ 04-05-2024]
దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయనివిధంగా... ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు. తాజాగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు కుట్ర చేస్తున్నారు. -
జగన్ సిద్ధం.. జనానికి నరకం
[ 04-05-2024]
ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి శుక్రవారం నరసాపురంలో నిర్వహించిన సిద్ధం సభ.. జనానికి నరకం చూపింది. -
వైకాపా తెచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్’ అమలైతే సామాన్యులకు తీవ్ర నష్టం
[ 04-05-2024]
భూ హక్కు(ల్యాండ్ టైటిలింగ్) పేరిట వైకాపా సర్కారు తెచ్చిన చట్టం అమలులోకి వస్తే సొంత భూములపై హక్కు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంవీ రమణరావు స్పష్టం చేశారు. -
పథకాల ఊకదంపుడే.. ప్రగతి ఊసేలేదు
[ 04-05-2024]
ఇరవై నిమిషాల ప్రసంగంలో జిల్లా ప్రగతి గురించి.. అయిదేళ్లలో చేసిన అభివృద్ధిపై..ఒక్క మాట కూడా మాట్లాడలేదు. -
నేడు నూజివీడులో చంద్రబాబు సభ
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నూజివీడులో తెదేపా అధినేత చంద్రబాబు నిర్వహించే సభకు ఏర్పాట్లు చేశారు. -
నిర్వాసితుల్ని ఆదుకుంటాం
[ 04-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం నియోజకవర్గాన్ని చిర్రి బాలరాజుతో కలిసి అభివృద్ధి చేస్తామని ఎన్డీయే ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ అన్నారు. -
తపాలా ఓటు వేయనిస్తారా.. లేదా?
[ 04-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు తపాలా బ్యాలెట్ సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. -
కల్యాణం.. రమణీయం
[ 04-05-2024]
ద్వారకాతిరుమల శ్రీవారి ఉపాలయం లక్ష్మీపురం వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం శుక్రవారం రాత్రి కనుల పండువగా నిర్వహించారు. -
వాటా ఇవ్వరు..జమ చేయరు!
[ 04-05-2024]
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామంటూ ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్రెడ్డి ఇచ్చి.... అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచిపోయారు. -
కూటమి ప్రభంజనం తథ్యం
[ 04-05-2024]
వచ్చే ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం తథ్యమని ఉండి శాసనసభ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
కార్మికులకు భరోసా
[ 04-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి గెలుపుతోనే అన్ని సామాజిక వర్గాల అభివృద్ధి సాధ్యమని కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. -
బాలుడి అనుమానాస్పద మృత
[ 04-05-2024]
ఇటీవల విడుదలైన పది ఫలితాల్లో 549 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం నూజివీడులో చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..