బాలుడి అనుమానాస్పద మృత
ఇటీవల విడుదలైన పది ఫలితాల్లో 549 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం నూజివీడులో చోటు చేసుకుంది.
నవీన్రెడ్డి (పాత చిత్రం)
నూజివీడు పట్టణం, న్యూస్టుడే: ఇటీవల విడుదలైన పది ఫలితాల్లో 549 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం నూజివీడులో చోటు చేసుకుంది. మృతుడి తండ్రి రామురెడ్డి కథనం మేరకు.. నూజివీడు పట్టణం శారద కాలనీలో నివసిస్తున్న కొవ్వూరు రామురెడ్డికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు కొవ్వూరు యశ్వంత్ నవీన్ రెడ్డి(16) పది ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. ఇంటర్లో చేరేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి అన్నయ్యతో యశ్వంత్ ఒకే గదిలో పడుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున సుమారు నాలుగైదు గంటల సమయంలో అన్నయ్య లేచి చూడగా యశ్వంత్ కనిపించలేదు. ఆ విషయాన్ని తండ్రి రామురెడ్డికి చెప్పాడు. కుటుంబసభ్యులు వెతకగా.. మూడు అంతస్తుల మేడపై నుంచి కింద పడి మృతి చెంది కనిపించాడు. వెంటనే ఆ విషయాన్ని పోలీసులకు తెలిపారు. పట్టణ సీఐ ఎంవీవీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ.. బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది.. మృతదేహంపై బలమైన రాతి వస్తువుతో కొట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. తలపై బలమైన గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మూడో అంతస్తు నుంచి కింద పడిపోయాడా.. లేక ఎవరైనా బలవంతంగా నెట్టి వేశారా.. లేక ప్రణాళిక ప్రకారం హత్య చేశారా.. అనేది తెలియాల్సి ఉంది.
మిత్ర బృందంలో విషాదం.. ఎంతో బాగా చదువుతూ బంగారు భవితను సొంతం చేసుకునే అవకాశం ఉన్న నవీన్ రెడ్డి జీవితం ముగిసిపోవడం ఎంతో బాధ కలిగిస్తుందని విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇన్నాళ్లూ తమతో ఆడిపాడి, ఎంతో ఉత్సాహంగా గడిపిన నవీన్రెడ్డి ఇక లేడని.. తిరిగి రాడని తెలిసి స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. పది ఫలితాలు అనంతరం అందరం ఒకే కళాశాలలో చేరదామనుకున్న మిత్ర బృందానికి విషాదం మిగిలింది.
కాలువలో మునిగి కూలీ..
కొయ్యలగూడెం, న్యూస్టుడే: రాజవరం సమీపంలో ఎర్ర కాలువ నుంచి వెళ్లే పంట కాలువలో ప్రమాదవశాత్తూ మునిగి అదే గ్రామానికి చెందిన పోతులూరి సత్యనారాయణ(45) మృతి చెందినట్లు ఎస్సై జీజే విష్ణువర్ధన్ శుక్రవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లి కాలువలోకి దిగగా.. గోతులు ఎక్కువగా ఉండటంతో అందులో మునిగిపోయి సత్యనారాయణ చనిపోయాడు. మృతుడి సోదరి అరిగెల వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాలుగు చినుకులు రాలితే నరకమే
[ 18-05-2024]
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు జలమయమవుతున్నాయి. అన్ని చోట్లా డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
పురం.. వానొస్తే కంపరం!
[ 18-05-2024]
చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టణాలు జలమయమవుతున్నాయి. అన్ని చోట్లా డ్రెయినేజీ వ్యవస్థ ఉన్నా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. -
నోటు తీసుకున్నోళ్లు బటన్ నొక్కలేదే!
[ 18-05-2024]
ఓటర్ల జాబితా చేతిలో ఉంది... వందశాతం ఓటుకు నోటు పంపిణీ చేశాం... ఇక గెలుపు మనదే అనుకున్నారు నాయకులందరూ. -
పల్లెదారులు.. పరమ ఛిద్రం
[ 18-05-2024]
రహదారులు ప్రగతికి చిహ్నాలు. కానీ అధికార యంత్రాంగం వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. -
మేలు కంటే నష్టమే ఎక్కువ
[ 18-05-2024]
రిజిస్ట్రేషన్, ఈసీల ఛార్జీలు, సేవా రుసుములను ఇష్టానుసారంగా పెంచేసి ప్రజల నడ్డి విరిశారు. -
అకాల వర్షాలతో రైతులకు ఇబ్బందులు : నిమ్మల
[ 18-05-2024]
సంచులు లేక ధాన్యం రాశులు అకాల వర్షాలకు తడుస్తున్నాయని, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. -
కూలీల కష్టం మాయం
[ 18-05-2024]
జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులో ఉపాధి పనులు చేస్తున్న కూలీల చిత్రానికి బదులు ఆన్లైన్లో గేదెల చిత్రం ఇటీవల అప్లోడ్ చేశారు. ఈ శాఖలో ఉన్న నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనుల అమలులో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. -
పుస్తకాలు లేకుండా చదువులా?
[ 18-05-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు సమస్యలే చదువుతున్నారు. -
జలమే.. గరళం..!
[ 18-05-2024]
ఆ గిరిజన గ్రామాల్లో జలమే గరళమవుతోంది. దప్పిక తీర్చే నీరే అక్కడి ప్రజల ప్రాణాలు హరిస్తోంది. -
నేత్రపర్వంగా శాంతి కల్యాణం
[ 18-05-2024]
భీమవరం డీఎన్నార్ కళాశాల ప్రాంగణంలోని గన్నాబత్తుల క్రీడా మైదానంలో అతిరాత్ర మహాయాగం మూడో రోజైన శుక్రవారం వైభవంగా కొనసాగింది. -
సామాజిక సందేశం.. ఆకట్టుకునే కథాంశం!
[ 18-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటిక పోటీలు ఆద్యంతం ఆసక్తిగా సాగుతున్నాయి. -
విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి
[ 18-05-2024]
పెదపాడు మండలం కొనికిలో చేపల చెరువు వద్ద పనిచేసే యువకుడు విద్యుదాఘాతంతో శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు పెదపాడు ఎస్సై కె.శుభశేఖర్ తెలిపారు. -
అతిసార బాధితులకు కొనసాగుతున్న చికిత్స
[ 18-05-2024]
మండలంలోని కురుములతోగు, కొత్తూరుదేశయ్యగుంపు గ్రామాలకు చెందిన తొమ్మిది మంది గిరిజనులకు భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
శస్త్రచికిత్సలో అపశ్రుతి.. యువతి చనిపోయినా చెప్పకుండా దాచిన వైద్యులు
-
బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
-
ఎప్సెట్ ఫలితాలు నేడే
-
ఫోన్ తీయట్లేదని.. చంపేశాడట
-
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
-
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!