logo

నేడు నూజివీడులో చంద్రబాబు సభ

ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నూజివీడులో తెదేపా అధినేత చంద్రబాబు నిర్వహించే సభకు ఏర్పాట్లు చేశారు.

Published : 04 May 2024 04:08 IST

నూజివీడు రూరల్‌, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నూజివీడులో తెదేపా అధినేత చంద్రబాబు నిర్వహించే సభకు ఏర్పాట్లు చేశారు. తెదేపా అభ్యర్థి పార్థసారథి పర్యవేక్షణలో పట్టణంలోని రోటరీ క్లబ్‌ సమీపంలో పారిశ్రామికవేత్త మూల్పూరి లక్ష్మణస్వామికి చెందిన స్థలంలో హెలిప్యాడ్‌ పనులు చేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా ట్రిపుల్‌ ఐటీ రహదారిలోని ఓ ప్రైవేటు స్థలంలో ప్రభుత్వ నిధులతో హెలిప్యాడ్‌, కొద్ది దూరం రహదారి నిర్మించారు. ఆ ప్రదేశం అనువుగా ఉంటుందని తెదేపా నాయకులు మొదట భావించారు. అక్కడ దిగితే పట్టణంలో భారీ ప్రదర్శన చేయవచ్చని ఆశించారు. అయితే సదరు స్థలం యజమాని వైకాపా అభిమాని కావడం, అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో  స్థలం ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో విజయవాడ కొన్నకుంట రోడ్డులోని ఓ స్థలాన్ని పరిశీలించారు. అక్కడా ఇదే పరిస్థితి ఎదురైంది. చేసేది లేక చివరికి రోటరీ క్లబ్‌ పక్కన ఉన్న స్థలంలో హెలిప్యాడ్‌ నిర్మాణం చేపట్టారు. అక్కడి నుంచి చంద్రబాబు ప్రదర్శనగా చిన్నగాంధీ బొమ్మ సెంటర్‌ వరకు వస్తారు. అనంతరం సభలో ప్రసంగిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని