శనగకు అదనపు వసూలు బెడద
అసలే పంట నష్టంతో ముప్పుతిప్పలు పడుతున్న రైతులు అడుగడుగునా దోపిడీకి గురవుతున్నారు. శనగ పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం 80 శాతం రాయితీతో విత్తనం అందిస్తోంది. దీనిపై స్పష్టమైన ధరను పేర్కొనగా రైతు భరోసా కేంద్రాల్లో
క్వింటాకు రూ.20
అసలే పంట నష్టంతో ముప్పుతిప్పలు పడుతున్న రైతులు అడుగడుగునా దోపిడీకి గురవుతున్నారు. శనగ పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం 80 శాతం రాయితీతో విత్తనం అందిస్తోంది. దీనిపై స్పష్టమైన ధరను పేర్కొనగా రైతు భరోసా కేంద్రాల్లో మాత్రం క్వింటాకు అదనంగా రూ.20 వసూలు చేస్తున్నారు. - న్యూస్టుడే, ఎర్రగుంట్ల, ఒంటిమిట్ట, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు
జిల్లాలో రబీ సీజన్లో శనగ సాధారణ విస్తీర్ణం 95,489 హెక్టార్లు. నల్లరేగడి భూములున్న కమలాపురం, పులివెందుల, ముద్దనూరు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప, పోరుమామిళ్ల వ్యవసాయ డివిజన్ల పరిధిలో విస్తారంగా సాగు చేస్తారని అధికారులు ముందస్తుగా గుర్తించారు. అన్నదాతలకు జె.జి-11 రకం 65,648 క్వింటాళ్ల విత్తనాలను ఇవ్వాలని రాష్ట్ర ఉన్నతాధికారులు అనుమతిచ్చారు. కాకపోతే ఈసారి రాయితీ 25 శాతానికి పరిమితం చేశారు. క్వింటా పూర్తి ధర రూ.6,900 కాగా అందులో ప్రభుత్వ వాటా రూ.1,725 (25 శాతం), రైతు రూ.5,175 (75 శాతం) చెల్లించాలని ధరలను ఖరారు చేశారు. విపణిలో ఇంతకంటే తక్కువ ధరకే విత్తనాలు లభిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థకు సేకరణ, సరఫరా బాధ్యతలు అప్పగించారు. l జిల్లాలో గత నెలలో భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. నల్లరేగడి భూముల్లో సాగు చేసిన శనగ పంట నీటిలో మునిగి, తేమ ఎక్కువై దెబ్బతింది. జిల్లావ్యాప్తంగా సుమారు 88,209.63 హెక్టార్లలో ఈ పైరు వర్షార్పణం అయినట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో శనగ పంటను మళ్లీ సాగు చేసేందుకు ఆసక్తి చూపే అన్నదాతలకు ఆర్థికంగా విత్తన రూపంలో ఊతమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. l 53,102 క్వింటాళ్లు అదనంగా తెప్పించాలని ఏపీ సీడ్స్ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే 32,850 క్వింటాళ్లను ఆయా మండలాల్లోని ఆర్బీకేలకు చేర్చారు. రైతులు 44,250 క్వింటాళ్లు కావాలని తమ పేర్లను నమోదు చేసుకున్నారు. l పెద్దముడియం మండలంలో అత్యధికంగా 35 వేల ఎకరాల్లో పంట దెబ్బతినగా రాయితీ శనగల పంపిణీ జరుగుతోంది. క్వింటా రూ.6,900 ధర నిర్ణయించగా, 80 శాతం రాయితీపోనూ రైతు వాటా రూ.1380 చెల్లించాలి. కొన్ని ఆర్బీకేల్లో రూ.1,400 వసూలు చేస్తున్నారు. కొన్ని మండలాల్లో ఒక్కో ప్యాకెట్ (25 కిలోలు) రూ.345 అయితే రూ.350 తీసుకుంటున్నట్లు సమాచారం. l ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి రైతు భరోసా కేంద్రంలో క్వింటాకు రూ.1,400 వసూలు చేస్తున్నారు. విత్తనం కూడా పూర్తిస్థాయిలో ఇవ్వకుండా తగ్గించి ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
[ 01-05-2024]
ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి రమణా రెడ్డి, ఎంఈవోలు ప్రేమ సాగర్, మస్తాన్వలీ తెలిపారు. -
జగనుడిదే పాపం.. కార్మికుడికి శాపం..!
[ 01-05-2024]
అసంఘటిత, సంఘటిత కార్మికవర్గాల సంక్షేమాన్ని వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసింది. అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని ప్రతిపక్షనేతగా ఊదరగొట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటమరిచారు. -
దండిగా ప్రభుత్వ పరివారం.. మొండిగా పేదలపై ప్రతీకారం
[ 01-05-2024]
ఏదైనా జరిగితే బాధ్యులెవరు? : వృద్ధాప్య పింఛనుదారుల్లో చాలామంది కీళ్లు, నరాలు, మోకాలు, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. -
మైదుకూరు అభివృద్ధిపై నోరెత్తని జగన్
[ 01-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరులో మంగళవారం సీఎం జగన్ నిర్వహించిన బహిరంగసభలో మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధిపై నోరెత్తలేదు. ప్రజల్లో ఆశలు చిగురింపజేయలేదు. -
కూటమి వాగ్దానాలు... భవిష్యత్తుకు సోపానాలు!
[ 01-05-2024]
‘ప్రజల ఆశయాలు నెరవేర్చాలి. నమ్ముకున్న జనం కలను సాకారం చేయాలి. పల్లె, పట్టణ వాసుల ఆకాంక్షలు ఫలించేలా వినూత్న పథకాలు ప్రవేశపెట్టాలి. -
నారా లోకేశ్ పర్యటన 5కు వాయిదా
[ 01-05-2024]
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాజంపేట పర్యటన ఈ నెల 5వ తేదీకి వాయిదా పడింది. -
నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం
[ 01-05-2024]
పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. -
పెద్దిరెడ్డి కుటుంబం.... మాఫియాలకు నాయకత్వం!
[ 01-05-2024]
రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పెద్దిరెడ్డి కుటుంబం వివిధ రకాల మాఫియాలకు నాయకత్వం వహిస్తోందని, దోపిడీయే ధ్యేయంగా అయిదేళ్లలో అడ్డగోలుగా వనరుల విధ్వంసానికి పాల్పడ్డారని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
జగన్ పర్యటన... జనానికి యాతన!
[ 01-05-2024]
కలికిరిలో మంగళవారం జరిగిన సీఎం జగన్ బహిరంగ సభ పేలవంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటలకు అని షెడ్యూలిచ్చి సాయంత్రం 4 గంటలకు సీఎం సభా స్థలానికి చేరుకున్నారు. -
సమస్యల తిష్ఠ... జగన్ పాలనకు పరాకాష్ట
[ 01-05-2024]
ఏ కాలనీ చూసినా కాలువలు పూడికతో నిండిపోయాయి. ప్రొద్దుటూరు పట్టణం, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు మున్సిపాల్టీల్లోని కాలనీ వీధుల్లోని డ్రైనేజీల్లోని వ్యర్థాలను తీశారే తప్ప వాటిని తీసుకెళ్లలేదు. -
గండికోట నిర్వాసితులకు రూ.12 లక్షల పరిహారం
[ 01-05-2024]
గండికోట నిర్వాసితులకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునరావాస పరిహారం రూ.12 లక్షలు ఇస్తామని మాజీ మంత్రి, ఎన్డీఏ కూటమి జమ్మలమడుగు ఎమ్మెల్యే భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి తెలిపారు. -
తొలగించని సీఎం స్టిక్కర్
[ 01-05-2024]
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి నెల రోజులు అయినా స్థానిక ముద్దనూరులోని జెండా మాను వీధి, రైల్వే గేటు సమీపంలో, వాటర్ ట్యాంకు సమీపంలోని ఇళ్ల వద్ద గోడలపై ‘మా నమ్మకం నూవ్వే జగన్’ స్టిక్కర్లు ఇప్పటికి అలాగే ఉన్నాయి. -
ప్రొద్దుటూరులో తెదేపా జెండా ఎగురవేస్తాం
[ 01-05-2024]
ప్రొద్దుటూరులో తెదేపా జెండా ఎగరడం ఖాయమని, ఖచ్చితంగా గెలిచితీరుతామని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
విభజన రాజకీయాలతో మైనార్టీల ఓట్లకు వైకాపా ఎసరు
[ 01-05-2024]
భాజపాను అడ్డంగా పెట్టుకుని విభజన రాజకీయాలు చేస్తున్న వైకాపా ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం మైనార్టీల ఓట్లను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తోందని రాజంపేట లోక్సభ భాజపా అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్రెడ్డి ఆరోపించారు. -
అయిదేళ్ల వైకాపా పాలనంతా మోసం
[ 01-05-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో రైతులు, యువత, అన్ని వర్గాలను జగన్ పూర్తిగా మోసం చేశారని వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ స్టార్ క్యాంపెయినర్, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ అన్నారు. -
ఓటుతోనే వైకాపాకు బుద్ధి చెప్పండి
[ 01-05-2024]
అధికార వైకాపాకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్కుమార్రెడ్డి అన్నారు. -
పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన పరిశీలకులు
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పీలేరు పట్టణంలో ఎక్కువ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన కార్యాలయాలను మంగళవారం ఎన్నికల పరిశీలకులు తనిఖీ చేశారు. -
అనిశా వలలో ట్రాన్స్కో జలగ!
[ 01-05-2024]
నియంత్రిక మంజూరుకు లంచం డిమాండు చేసిన అవినీతి జలగ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారుల ఉచ్చులో చిక్కాడు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్
-
కీర్తి సురేశ్తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?