కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం
కడప- రాయచోటి రహదారిపై బుగ్గలేటిపల్లె సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో వంగిమళ్ల సహదేవరెడ్డి (42) అనే వ్యక్తి దుర్మరణం చెందారు.
సహదేవరెడ్డి (పాత చిత్రం)
చింతకొమ్మదిన్నె, న్యూస్టుడే : కడప- రాయచోటి రహదారిపై బుగ్గలేటిపల్లె సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో వంగిమళ్ల సహదేవరెడ్డి (42) అనే వ్యక్తి దుర్మరణం చెందారు. ఎస్సై అరుణ్రెడ్డి తెలిపిన వివరాలు మేరకు.. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కర్ణపువాండ్లపల్లెకు చెందిన సహదేవరెడ్డి కడప నబీకోట్లో మందుల దుకాణం పెట్టుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. సొంతూరిలో కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నారు. రోజు ఉదయం వెళ్లి ఇంటి నిర్మాణ పనులు చూసుకుని రాత్రి కడపకు వచ్చేవారు. బుధవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై కడపకు వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతన్ని 108 వాహనంలో సర్వజన ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్కు షాక్..!
-
India News
Akhilesh Yadav: అఖిలేశ్ యాదవ్కు తప్పిన ప్రమాదం
-
India News
IRCTCలో టికెట్ల జారీ మరింత వేగవంతం.. నిమిషానికి 2.25 లక్షల టికెట్లు: వైష్ణవ్
-
Politics News
Revanth reddy: ఊరికో కోడి ఇంటికో ఈక అన్నట్లుగా ‘దళితబంధు’ అమలు: రేవంత్ రెడ్డి
-
Movies News
Nayanthara: నేనూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా.. నయనతార షాకింగ్ కామెంట్స్
-
General News
TS News: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐకి బదిలీ చేయాలా? వద్దా?: 6న హైకోర్టు తీర్పు