logo

చెట్టును ఢీకొన్న కారు... ఇద్దరి దుర్మరణం

మండల పరిధిలోని అప్పగుంటపల్లె వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు.

Published : 19 Jan 2023 05:15 IST

ఓబులవారిపల్లె, న్యూస్‌టుడే : మండల పరిధిలోని అప్పగుంటపల్లె వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దఓరంపాడుకు చెందిన ముద్ద సిద్దేశ్వర్‌రెడ్డి (26), కసిరెడ్డి తేజేశ్వర్‌రెడ్డి (25), తమ్ముడు భువనేశ్వర్‌రెడ్డి, స్నేహితులు ఆలం సాయి, షేక్‌ కరీముల్లా కారులో కోడూరు నుంచి స్వగ్రామం పెద్దఓరంపాడుకు వస్తుండగా అప్పగుంటపల్లె మలుపు వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొంది. కారు డ్రైవింగ్‌ చేస్తున్న సిద్దేశ్వర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు మిగిలిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా తేజేశ్వర్‌రెడ్డి మార్గం మధ్యలో మృతి చెందాడు. భువనేశ్వర్‌రెడ్డి కాలు విరిగి, తీవ్రంగా గాయపడటంతో తిరుపతిలోని ఆసుపత్రికి తరలించారు. సాయి, కరీముల్లాలకు రాజంపేటలో చికిత్స అందించారు. సిద్దేశ్వర్‌రెడ్డి  వారి తల్లిదండ్రులు సుధాకర్‌రెడ్డి, లక్ష్మీనరసమ్మలకు ఒక్కగానొక్క  కుమారుడు.  దీంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కసిరెడ్డి తేజేశ్వర్‌రెడ్డి స్వగ్రామం నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె. తేజేశ్వర్‌రెడ్డి అమ్మమ్మగారి ఊరైన పెద్దఓరంపాడుకు రెండేళ్ల క్రితం వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని