ఎగువన ప్రాజెక్టులు నిర్మిస్తే సీమకు అన్యాయం
ఎగువన ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే రాయలసీమ అన్యాయమైపోతుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు.
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి
మాట్లాడుతున్న రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి
మైదుకూరు, న్యూస్టుడే: ఎగువన ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే రాయలసీమ అన్యాయమైపోతుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. ఇక్కడ ప్రాజెక్టులు నిర్మించాలనే డిమాండును ఎవరూ వినిపించడంలేదని అన్నారు. రాయలసీమలో ప్రవహించే నీటిని నిల్వ చేసుకోకపోతే ఈ ప్రాంతం ఎడారికాక ఏమవుతుందని ప్రశ్నించారు. ‘కర్నూలులో కృష్ణా యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలి’ అన్న డిమాండుతో ఆదివారం రైతు సేవా సమితి, ప్రజాపక్షం ఆధ్వర్యంలో వైయస్ఆర్ జిల్లా మైదుకూరులో సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయల సీమను సాకుగా చూపి కృష్ణా డెల్టాకు నీరు తీసుకుపోవాలనే ధోరణి కనిపిస్తోందన్నారు. బచావత్ అవార్డు ప్రకారం రాయలసీమలో 19 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు పారుతోందని తెలిపారు. సిద్ధేశ్వరం, గుండ్రేవుల ప్రాజెక్టులు నిర్మిస్తే సీమకు మేలు జరుగుతుందనే విషయమై ఏ పార్టీ మాట్లాడడం లేదని మండిపడ్డారు. నాగార్జునసాగర్కు 264 టీఎంసీల నీరిచ్చి మిగిలిన నీటిని శ్రీశైలంలో నిల్వ చేయక జలాశయాన్ని ఖాళీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. కార్యక్రమంలో ప్రజాపక్షం కన్వీనర్ గోశెట్టి వెంకటరమణయ్య, కేసీ కాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ఛైర్మన్ రెడ్యం చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ఓ విధ్వంసకారి!
[ 26-04-2024]
‘జగన్ ఒక అహంకారి...విధ్వంసకారి.. రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను, కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశాం. -
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?
[ 26-04-2024]
పులివెందులలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సొంత చెల్లెళ్లపై ఆయన మాట్లాడిన తీరును చూసి జనం మండిపడుతున్నారు. -
30 నుంచి కడపపైనే షర్మిల దృష్టి!
[ 26-04-2024]
కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 30వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నారు. -
శ్మశానంపై హామీ ఇస్తేనే ఓట్లు అడగండి!
[ 26-04-2024]
తమ గ్రామానికి శ్మశానం, రహదారి ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీనిస్తేనే నాయకులు వచ్చి ఓట్లు అడగాలని సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ వాసులు ఫెక్సీ ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. -
నేతలకు చంద్రబాబు ఎన్నికల బాధ్యతల అప్పగింత
[ 26-04-2024]
రాజంపేటకు చెందిన కీలక నేతలతో గురువారం తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాజంపేట నియోజవర్గంపై సమీక్షిస్తూ విజయానికి ఢోకా లేదని.. -
జగన్ బటన్ నొక్కినా... జమకాని దీవెన డబ్బులు
[ 26-04-2024]
దీవెనల పేరుతో విద్యార్థులకు ఇస్తున్న నగదు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జగనన్న విద్యా దీవెన కింద బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన ఐటీఐ, డిప్లొమా -
కేసులు తప్పించుకోవాలని ఒకరు... ఆస్తి పంచివ్వలేదని మరొకరు
[ 26-04-2024]
కడప పార్లమెంట్ స్థానానికి పోటీలో కేసులు తప్పించుకోవాలని ఒకరు, ఆస్తి పంచి ఇవ్వలేదని మరొకరు పోటీకొచ్చారని, తాను అలా కాకుండా తెదేపాను. -
ఉపాధికి వెళ్లి... విగత జీవులుగా మారి!
[ 26-04-2024]
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో గురువారం జరిగిన రైలు ప్రమాదంలో జిల్లాలోని రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. -
వాహన ‘మిత్ర ద్రోహం’... వైకాపా వారికే స్థానం
[ 26-04-2024]
తాము అధికారంలోకి వస్తూనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే అందజేసి అర్హులైన కొందరిని పక్కన పెట్టారు.