ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలివ్వండి
జగనన్న కాలల్లో ఇళ్లు నిర్మించుకుంటున్నవారికి ప్రభుత్వం రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరయ్య డిమాండు చేశారు.
కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న సీపీఐ, ఏఐటీయూసీ, భవన నిర్మాణ కార్మిక సంఘాల నాయకులు
రాయచోటి, న్యూస్టుడే: జగనన్న కాలల్లో ఇళ్లు నిర్మించుకుంటున్నవారికి ప్రభుత్వం రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరయ్య డిమాండు చేశారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం సీపీఐ, ఏఐటీయూసీˆ, భవన నిర్మాణ, ఇతర ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని, టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు త్వరిత గతిన స్వాధీనపరచాలని డిమాండు చేశారు. జిల్లాలోని 500 లేఅవుట్లలో 77,161 ఇళ్లు మంజూరవ్వగా, జగనన్న కాలనీల్లో వేసిన ప్లాట్లను అనర్హులు, నాయకులు దక్కించుకుని క్రయవిక్రయాలకు తెరలేపారని ఆరోపించారు. సిమెంటు, ఇటుకలు, ఇసుక, ఇనుము తదితర నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, వాటికి అనుగుణంగా లబ్ధిదారులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండు చేశారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించకుండా నిర్మాణాలు చేపట్టకపోతే ఇళ్లను రద్దు చేస్తామని లబ్ధిదారులను బెదిరిస్తుండడం సరికాదన్నారు. ఈనెల 22వ తేదీ వరకు సీపీఐ ఆధ్వర్యంలో జగనన్న ఇళ్ల నిర్మాణాలపై సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ గిరీషకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, సాంబశివ, మహేష్, నరసింహులు, కృష్ణప్ప, విశ్వనాధనాయక్, మనోహర్రెడ్డి, మురళీ, సుమిత్ర, వెంకటేష్, జక్కల వెంకటేష్, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ఓ విధ్వంసకారి!
[ 26-04-2024]
‘జగన్ ఒక అహంకారి...విధ్వంసకారి.. రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను, కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశాం. -
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?
[ 26-04-2024]
పులివెందులలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సొంత చెల్లెళ్లపై ఆయన మాట్లాడిన తీరును చూసి జనం మండిపడుతున్నారు. -
30 నుంచి కడపపైనే షర్మిల దృష్టి!
[ 26-04-2024]
కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 30వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నారు. -
శ్మశానంపై హామీ ఇస్తేనే ఓట్లు అడగండి!
[ 26-04-2024]
తమ గ్రామానికి శ్మశానం, రహదారి ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీనిస్తేనే నాయకులు వచ్చి ఓట్లు అడగాలని సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ వాసులు ఫెక్సీ ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. -
నేతలకు చంద్రబాబు ఎన్నికల బాధ్యతల అప్పగింత
[ 26-04-2024]
రాజంపేటకు చెందిన కీలక నేతలతో గురువారం తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాజంపేట నియోజవర్గంపై సమీక్షిస్తూ విజయానికి ఢోకా లేదని.. -
జగన్ బటన్ నొక్కినా... జమకాని దీవెన డబ్బులు
[ 26-04-2024]
దీవెనల పేరుతో విద్యార్థులకు ఇస్తున్న నగదు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జగనన్న విద్యా దీవెన కింద బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన ఐటీఐ, డిప్లొమా -
కేసులు తప్పించుకోవాలని ఒకరు... ఆస్తి పంచివ్వలేదని మరొకరు
[ 26-04-2024]
కడప పార్లమెంట్ స్థానానికి పోటీలో కేసులు తప్పించుకోవాలని ఒకరు, ఆస్తి పంచి ఇవ్వలేదని మరొకరు పోటీకొచ్చారని, తాను అలా కాకుండా తెదేపాను. -
ఉపాధికి వెళ్లి... విగత జీవులుగా మారి!
[ 26-04-2024]
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో గురువారం జరిగిన రైలు ప్రమాదంలో జిల్లాలోని రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. -
వాహన ‘మిత్ర ద్రోహం’... వైకాపా వారికే స్థానం
[ 26-04-2024]
తాము అధికారంలోకి వస్తూనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే అందజేసి అర్హులైన కొందరిని పక్కన పెట్టారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.