logo

‘రాష్ట్ర ప్రభుత్వ మోసాలపై విస్తృత ప్రచారం చేయండి’

వైకాపా ప్రభుత్వ మోసాలపై విస్తృత ప్రచారం చేయాలని పీసీసీ మీడియా ఛైర్మన్‌ తులసిరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు సూచించారు.

Published : 07 Feb 2023 05:38 IST

తులసిరెడ్డిని సత్కరిస్తున్న యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సుమంత్‌కుమార్‌, బొజ్జా తిరుమలేశు, తదితరులు

వేంపల్లె, న్యూస్‌టుడే : వైకాపా ప్రభుత్వ మోసాలపై విస్తృత ప్రచారం చేయాలని పీసీసీ మీడియా ఛైర్మన్‌ తులసిరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు సూచించారు. జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుమంత్‌కుమార్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జా తిరుమలేశ్‌, పులివెందుల, ప్రొద్దుటూరు నియోజకవర్గాల యూత్‌కాంగ్రెస్‌ అధ్యక్షులు సాయి, వంశీయాదవ్‌ తులసిరెడ్డిని సోమవారం వేంపల్లెలో కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం యువతను నమ్మించి మోసగించిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా తెచ్చి ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని నమ్మించి మోసగించారన్నారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ద్రువకుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని