ఆసుపత్రిలో లంచం తీసుకోవడంపై విచారణ
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 15వ తేదీన కాన్పు కోసం వచ్చిన ఓ గర్భిణి కుటుంబ సభ్యుల నుంచి డబ్బు వసూలు చేసిన సంఘటనపై సోమవారం శాఖాపరమైన విచారణ నిర్వహించారు.
వైద్యురాలు రాజీనామా
ఆసుపత్రి సిబ్బందిని విచారిస్తున్న డాక్టర్ పాల్ రవికుమార్
మదనపల్లె వైద్యం, న్యూస్టుడే: మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 15వ తేదీన కాన్పు కోసం వచ్చిన ఓ గర్భిణి కుటుంబ సభ్యుల నుంచి డబ్బు వసూలు చేసిన సంఘటనపై సోమవారం శాఖాపరమైన విచారణ నిర్వహించారు. విచారణ అధికారి డాక్టర్ పాల్ రవికుమార్ ఆసుపత్రిలో గర్భిణి కాన్పు అయిన రోజు కాన్పుల వార్డు, ఆపరేషన్ థియేటర్లో విధులు నిర్వర్తించిన వైద్య సిబ్బందితో మాట్లాడారు. వారి నుంచి రాతపూర్వకంగా నివేదికలు తీసుకున్నారు. తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లెకు చెందిన గర్భిణి అరుణ కుటుంబ సభ్యులను విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. విచారణాధికారి మాట్లాడుతూ.. విచారణ నివేదికను ఆసుపత్రి సూపరింటెండెంట్కు అందజేస్తామన్నారు. ఆసుపత్రిలో డబ్బు తీసుకున్న సంఘటనపై బాధితులు అయిదుగురిపై ఫిర్యాదు చేశారన్నారు.
* జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఎస్ఎన్సీయూ విభాగం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తోంది. ఈ విభాగంలో పని చేస్తున్న ప్రైవేట్ వైద్యురాలు వెన్నెల ఈ నెల 15వ తేదీన కాన్పు అయిన అరుణ బిడ్డకు ఎస్ఎన్సీయూలో ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆ బిడ్డ శరీరంపై బొబ్బలు రావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి మందులు తెచ్చుకోవాలని బాధిత కుటుంబీకులకు మందుల చీటీ రాసి ఇచ్చారనే అభియోగంపై వైద్యురాలిని విచారించారు. దీంతో ఆమె తన రాజీనామా పత్రాన్ని విజయవాడలోని ప్రైవేటు సంస్థకు పంపారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు భాగాస్వామ్య పద్ధతిలో స్థానిక జిల్లా ఆసుపత్రిలో ఎస్ఎన్సీయూ నిర్వహణ జరుగుతోందన్నారు. అయితే తమ సంస్థ వారు ఎస్ఎన్సీయూ బాధ్యత మాత్రమే తమకు అప్పగించారని ఆసుపత్రిలో అధికారులు మాత్రం ఎస్ఎన్సీయూతో పాటు ఆసుపత్రిలోని చిన్నపిల్లల విభాగం చికిత్సలు కూడా అందించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఎస్ఎన్సీయూ వదలి వేరే చోట చికిత్సలు చేసే సమయంలో ఎస్ఎన్సీయూలో ఎవరికైనా ఏమైనా అయితే బాధ్యులెవరని ఆమె ప్రశ్నించారు. బిడ్డకు బొబ్బలు తగ్గేందుకు తాను మందులు తెచ్చుకోవాలని రాసిచ్చానని.. ప్రైవేట్ దుకాణానికి వెళ్లమని చెప్పలేదన్నారు. బాధితులు బయట మందుల దుకాణంలో మందులు తెచ్చుకుంటే తాను బాధ్యురాలిని కాదన్నారు. ఆసుపత్రిలో కావాలనే కొందరు వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారని అందుకే తాను విధులకు రాజీనామా చేసినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించండి
[ 26-04-2024]
మండల కేంద్రంలో శుక్రవారం భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోశన్న కుమారుడు బొజ్జా కార్తీక్, తెదేపా వాణిజ్యవిభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
ఊరి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది
[ 26-04-2024]
మీ ఊరి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని ఎస్ఐ నాగమురళి తెలిపారు. శుక్రవారం మండలంలోని చెన్నారెడ్డిపల్లె ఆర్సీఎం చర్చి వద్ద గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. -
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
[ 26-04-2024]
పులివెందులలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సొంత చెల్లెళ్లపై ఆయన మాట్లాడిన తీరును చూసి జనం మండిపడుతున్నారు. -
జగన్ ఓ విధ్వంసకారి!
[ 26-04-2024]
‘జగన్ ఒక అహంకారి...విధ్వంసకారి.. రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను, కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశాం. -
30 నుంచి కడపపైనే షర్మిల దృష్టి!
[ 26-04-2024]
కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 30వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నారు. -
శ్మశానంపై హామీ ఇస్తేనే ఓట్లు అడగండి!
[ 26-04-2024]
తమ గ్రామానికి శ్మశానం, రహదారి ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీనిస్తేనే నాయకులు వచ్చి ఓట్లు అడగాలని సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ వాసులు ఫెక్సీ ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. -
నేతలకు చంద్రబాబు ఎన్నికల బాధ్యతల అప్పగింత
[ 26-04-2024]
రాజంపేటకు చెందిన కీలక నేతలతో గురువారం తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాజంపేట నియోజవర్గంపై సమీక్షిస్తూ విజయానికి ఢోకా లేదని.. -
జగన్ బటన్ నొక్కినా... జమకాని దీవెన డబ్బులు
[ 26-04-2024]
దీవెనల పేరుతో విద్యార్థులకు ఇస్తున్న నగదు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జగనన్న విద్యా దీవెన కింద బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన ఐటీఐ, డిప్లొమా -
కేసులు తప్పించుకోవాలని ఒకరు... ఆస్తి పంచివ్వలేదని మరొకరు
[ 26-04-2024]
కడప పార్లమెంట్ స్థానానికి పోటీలో కేసులు తప్పించుకోవాలని ఒకరు, ఆస్తి పంచి ఇవ్వలేదని మరొకరు పోటీకొచ్చారని, తాను అలా కాకుండా తెదేపాను. -
ఉపాధికి వెళ్లి... విగత జీవులుగా మారి!
[ 26-04-2024]
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో గురువారం జరిగిన రైలు ప్రమాదంలో జిల్లాలోని రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. -
వాహన ‘మిత్ర ద్రోహం’... వైకాపా వారికే స్థానం
[ 26-04-2024]
తాము అధికారంలోకి వస్తూనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే అందజేసి అర్హులైన కొందరిని పక్కన పెట్టారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM