అచ్చెన్నను మానసికంగా ఇబ్బంది పెట్టారా?
కడప నగరంలోని జిల్లా బహుళార్ధ పశువైద్యశాల వ్యవహారంపై త్రిసభ్య కమిటీ విచారణ జరిపింది. హత్యకు గురైన వీపీసీ డీడీ అచ్చెన్నను ఎవరైనా ఏమైనా అన్నారా? ఆయన్ను మానసికంగా ఇబ్బంది పెట్టారా అని ఆ కార్యాలయంలోని ఉద్యోగులు, సిబ్బందిని ప్రశ్నించింది.
వీపీసీ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ విచారణ
పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి కార్యాలయంలో విచారణ నిర్వహిస్తున్న త్రిసభ్య కమిటీ సభ్యులు
కడప గ్రామీణ, న్యూస్టుడే: కడప నగరంలోని జిల్లా బహుళార్ధ పశువైద్యశాల వ్యవహారంపై త్రిసభ్య కమిటీ విచారణ జరిపింది. హత్యకు గురైన వీపీసీ డీడీ అచ్చెన్నను ఎవరైనా ఏమైనా అన్నారా? ఆయన్ను మానసికంగా ఇబ్బంది పెట్టారా అని ఆ కార్యాలయంలోని ఉద్యోగులు, సిబ్బందిని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలోని సభ్యులు పశుసంవర్ధకశాఖ అదనపు సంచాలకులు సింహాచలం, వెంకట్రావు, సంయుక్త సంచాలకులు రత్నకుమారి మంగళవారం వీపీసీ కార్యాలయానికి వచ్చారు. అచ్చెన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జిల్లా అధికారి కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో నిజనిర్ధారణ కమిటీ వచ్చి వెళ్లినప్పటి నుంచి చోటు చేసుకున్న పరిణామాలపై ఆరా తీశారు. పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారిణి శారదమ్మను కూడా విచారించారు. ఇక్కడ జరిగే ప్రతి అంశాన్ని సంచాలకులకు తెలియజేశానని, అక్కడి నుంచి వచ్చిన ప్రతి ఆదేశాన్ని వీపీసీకి పంపుతూ వచ్చానని ఆమె వివరించినట్లు తెలిసింది. అనంతరం ఏడీలు శ్రీధర్లింగారెడ్డి, సుధీర్నాథ్ బెనర్జీలను వేర్వేరుగా విచారించారు. తమకు అచ్చెన్నకు వృత్తిపరమైన విభేదాలొచ్చిన మాట వాస్తవమేనని, అయితే హత్యకు తమకు ఎలాంటి సంబంధం లేదని వారు కమిటీకి చెప్పినట్లు తెలిసింది. కమిటీ ముందుగా రూపొందించుకున్న ప్రశ్నావళి ప్రకారం అందరినీ ప్రశ్నించారని, అవసరమైన వారి నుంచి రాతపూర్వక వివరణ తీసుకున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ఓ విధ్వంసకారి!
[ 26-04-2024]
‘జగన్ ఒక అహంకారి...విధ్వంసకారి.. రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను, కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశాం. -
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?
[ 26-04-2024]
పులివెందులలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సొంత చెల్లెళ్లపై ఆయన మాట్లాడిన తీరును చూసి జనం మండిపడుతున్నారు. -
30 నుంచి కడపపైనే షర్మిల దృష్టి!
[ 26-04-2024]
కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 30వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నారు. -
శ్మశానంపై హామీ ఇస్తేనే ఓట్లు అడగండి!
[ 26-04-2024]
తమ గ్రామానికి శ్మశానం, రహదారి ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీనిస్తేనే నాయకులు వచ్చి ఓట్లు అడగాలని సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ వాసులు ఫెక్సీ ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. -
నేతలకు చంద్రబాబు ఎన్నికల బాధ్యతల అప్పగింత
[ 26-04-2024]
రాజంపేటకు చెందిన కీలక నేతలతో గురువారం తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాజంపేట నియోజవర్గంపై సమీక్షిస్తూ విజయానికి ఢోకా లేదని.. -
జగన్ బటన్ నొక్కినా... జమకాని దీవెన డబ్బులు
[ 26-04-2024]
దీవెనల పేరుతో విద్యార్థులకు ఇస్తున్న నగదు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జగనన్న విద్యా దీవెన కింద బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన ఐటీఐ, డిప్లొమా -
కేసులు తప్పించుకోవాలని ఒకరు... ఆస్తి పంచివ్వలేదని మరొకరు
[ 26-04-2024]
కడప పార్లమెంట్ స్థానానికి పోటీలో కేసులు తప్పించుకోవాలని ఒకరు, ఆస్తి పంచి ఇవ్వలేదని మరొకరు పోటీకొచ్చారని, తాను అలా కాకుండా తెదేపాను. -
ఉపాధికి వెళ్లి... విగత జీవులుగా మారి!
[ 26-04-2024]
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో గురువారం జరిగిన రైలు ప్రమాదంలో జిల్లాలోని రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. -
వాహన ‘మిత్ర ద్రోహం’... వైకాపా వారికే స్థానం
[ 26-04-2024]
తాము అధికారంలోకి వస్తూనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే అందజేసి అర్హులైన కొందరిని పక్కన పెట్టారు.