logo

కాంగ్రెస్‌ అధికారంలోకొస్తే ఆరు సూత్రాల పాలన

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా ప్రయోజనకు వీలుగా ఆరు సూత్రాల పాలనను అమలు చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర మీడియా సెల్‌ ఛైర్మన్‌ నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు.

Published : 04 Jun 2023 02:32 IST

గ్రామస్థులకు కండువా వేసి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానిస్తున్న తులసిరెడ్డి

ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా ప్రయోజనకు వీలుగా ఆరు సూత్రాల పాలనను అమలు చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర మీడియా సెల్‌ ఛైర్మన్‌ నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. శనివారం ఎర్రగుంట్లలో పలువురు తులసిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర, మహిళలకు రూ. 500లకే రాయితీ గ్యాస్‌ సిలిండర్లు, ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.6000, ప్రత్యేక హోదా ద్వార పరిశ్రమలు స్థాపించి యువత ఉద్యోగ అవకాశాలు, బుందేల్ఖండ్‌ తరహాలో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, విభజన చట్టంలోని హామీలు అమలు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్య శర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్రె ఓబయ్య, జానకీ రామ్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని