భాజపా జమ్మలమడుగు అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి
భాజపా జమ్మలమడుగు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, బద్వేలు నియోజకవర్గ అభ్యర్థిగా బొజ్జా రోషన్నకు టిక్కెట్లు లభించాయి.
బద్వేలులో రోషన్నకే అవకాశం
రాజంపేటపై సర్వత్రా ఆసక్తి
ఈనాడు, కడప, న్యూస్టుడే, జమ్మలమడుగు, బద్వేలు : భాజపా జమ్మలమడుగు నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, బద్వేలు నియోజకవర్గ అభ్యర్థిగా బొజ్జా రోషన్నకు టిక్కెట్లు లభించాయి. జమ్మలమడుగు స్థానం బదులుగా కడప పార్లమెంటు నుంచి పోటీకి అవకాశం కల్పించాలని ఆదినారాయణరెడ్డి భాజపా అగ్రనేతలతో పాటు తెదేపా నాయకుల వద్ద ప్రస్తావించారు. అసెంబ్లీ నుంచి పోటీకే భాజపా అగ్రనేతలు బుధవారం టిక్కెట్ ఖరారు చేశారు. తెదేపా జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న భూపేష్రెడ్డిని కడప పార్లమెంటు స్థానం నుంచి రంగంలోకి దింపాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి రంగంలోకి దిగడంతో పోరు రసవత్తరంగా ఉండనుంది. బద్వేలు సీటును ఆశించిన భాజపా..తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బొజ్జా రోషన్నను పార్టీలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చింది. ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట మినహా మిగిలిన అన్ని స్థానాలకు కూటమి తరఫున తెదేపా, జనసేన, భాజపా అభ్యర్థులను ఖరారు చేసింది. తెదేపా రాజంపేట అసెంబ్లీ, కడప పార్లమెంటుకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది.
పేరు: చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి నియోజకవర్గం: జమ్మలమడుగు
వయసు: 65
స్వగ్రామం: దేవగుడి, జమ్మలమడుగు మండలం
చదువు: ఎమ్మెస్సీ (కెమెస్ట్రీ)
వృత్తి: రాజకీయం
తల్లిదండ్రులు: వెంకట సుబ్బమ్మ, సుబ్బరామిరెడ్డి
భార్య: అరుణ
సంతానం: సుధీర్రెడ్డి, దీప్తి
రాజకీయ నేపథ్యం: 2004, 2009లలో జమ్మలమడుగు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అనంతరం వైకాపాలో చేరి 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైకాపా అధినేత జగన్తో విభేదాలతో 2016, ఫిబ్రవరిలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. తెదేపా ప్రభుత్వంలో రాష్ట్ర పశుసంవర్ధక, సహకారశాఖ మంత్రిగా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2019, అక్టోబరు 21న జేపీ నడ్డా సమక్షంలో భాజపాలో చేరారు. అప్పటి నుంచి భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
పేరు: బొజ్జా రోషన్న
నియోజకవర్గం: బద్వేలు (ఎస్సీ రిజర్వుడు)
వయసు: 59
స్వగ్రామం: గిరినగర్, పోరుమామిళ్ల
చదువు: బీటెక్
వృత్తి: డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇరిగేషన్ ఇంజినీరు (క్వాలిటీ కంట్రోల్), నంద్యాల
తల్లిదండ్రులు: బొజ్జా గోపన్న, రాములమ్మ
భార్య: అరుణ
సంతానం: క్రాంతి రోషన్, స్వస్తిక్ రోషన్
రాజకీయ నేపథ్యం: డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు ఉద్యోగానికి రాజీనామా చేసి బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆశీస్సులతో రాజకీయ ప్రవేశం చేశారు. ఇటీవల భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో ఆ పార్టీలోకి చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించండి
[ 26-04-2024]
మండల కేంద్రంలో శుక్రవారం భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోశన్న కుమారుడు బొజ్జా కార్తీక్, తెదేపా వాణిజ్యవిభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
ఊరి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది
[ 26-04-2024]
మీ ఊరి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని ఎస్ఐ నాగమురళి తెలిపారు. శుక్రవారం మండలంలోని చెన్నారెడ్డిపల్లె ఆర్సీఎం చర్చి వద్ద గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. -
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
[ 26-04-2024]
పులివెందులలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సొంత చెల్లెళ్లపై ఆయన మాట్లాడిన తీరును చూసి జనం మండిపడుతున్నారు. -
జగన్ ఓ విధ్వంసకారి!
[ 26-04-2024]
‘జగన్ ఒక అహంకారి...విధ్వంసకారి.. రాష్ట్రాన్ని దోచేసిన వ్యక్తిని ఇంటికి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను, కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశాం. -
30 నుంచి కడపపైనే షర్మిల దృష్టి!
[ 26-04-2024]
కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 30వ తేదీ నుంచి తన సొంత నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నారు. -
శ్మశానంపై హామీ ఇస్తేనే ఓట్లు అడగండి!
[ 26-04-2024]
తమ గ్రామానికి శ్మశానం, రహదారి ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీనిస్తేనే నాయకులు వచ్చి ఓట్లు అడగాలని సిద్దవటం మండలం కడపాయపల్లె ఎస్సీ కాలనీ వాసులు ఫెక్సీ ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. -
నేతలకు చంద్రబాబు ఎన్నికల బాధ్యతల అప్పగింత
[ 26-04-2024]
రాజంపేటకు చెందిన కీలక నేతలతో గురువారం తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాజంపేట నియోజవర్గంపై సమీక్షిస్తూ విజయానికి ఢోకా లేదని.. -
జగన్ బటన్ నొక్కినా... జమకాని దీవెన డబ్బులు
[ 26-04-2024]
దీవెనల పేరుతో విద్యార్థులకు ఇస్తున్న నగదు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. జగనన్న విద్యా దీవెన కింద బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన ఐటీఐ, డిప్లొమా -
కేసులు తప్పించుకోవాలని ఒకరు... ఆస్తి పంచివ్వలేదని మరొకరు
[ 26-04-2024]
కడప పార్లమెంట్ స్థానానికి పోటీలో కేసులు తప్పించుకోవాలని ఒకరు, ఆస్తి పంచి ఇవ్వలేదని మరొకరు పోటీకొచ్చారని, తాను అలా కాకుండా తెదేపాను. -
ఉపాధికి వెళ్లి... విగత జీవులుగా మారి!
[ 26-04-2024]
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో గురువారం జరిగిన రైలు ప్రమాదంలో జిల్లాలోని రామసముద్రం మండలానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. -
వాహన ‘మిత్ర ద్రోహం’... వైకాపా వారికే స్థానం
[ 26-04-2024]
తాము అధికారంలోకి వస్తూనే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి తూతూ మంత్రంగా కొంతమందికి మాత్రమే అందజేసి అర్హులైన కొందరిని పక్కన పెట్టారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!