logo

జిల్లాకు చేరుకున్న కేంద్ర ఎన్నికల పరిశీలకులు

సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల పరిశీలకులు గురువారం జిల్లాకు చేరుకున్నారు. తొలుత కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌, ఎస్పీ కృష్ణారావు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు.

Published : 19 Apr 2024 02:59 IST

కంట్రోల్‌ రూమ్‌లో దస్త్రాలను పరిశీలిస్తున్న అధికారులు

రాయచోటి, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై పర్యవేక్షణకు కేంద్ర ఎన్నికల పరిశీలకులు గురువారం జిల్లాకు చేరుకున్నారు. తొలుత కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌, ఎస్పీ కృష్ణారావు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అధికారులు వివరించారు. కలెక్టరేట్‌లోని జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ రూంను పరిశీలించారు. కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకుల వివరాలు ఇలా ఉన్నాయి.

  • రాజంపేట పార్లమెంట్‌ రవీంద్రకుమార్‌, ఐఆర్‌ఎస్‌, చరవాణి: 8977948222,
  • రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎస్‌.జి.మూన్‌, ఐఆర్‌ఎస్‌, చరవాణి నెంబర్‌: 8977947333,
  • తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లి నియోజకవర్గాలకు వైభవ్‌శుక్లా, ఐఏఎస్‌, చరవాణి నెంబరు: 8977946444
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని