బ్రహ్మోత్సవ శోభ... ఆధ్యాత్మిక ప్రభ
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రామయ్య క్షేత్రంలో రెండో రోజు గురువారం ఉదయం యాగశాలలో తితిదే ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు.
స్వామి వారిని అభిషేకిస్తున్న అర్చకులు
ఒంటిమిట్ట, న్యూస్టుడే: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రామయ్య క్షేత్రంలో రెండో రోజు గురువారం ఉదయం యాగశాలలో తితిదే ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. కోదండరాముడు వేణుగానాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత శ్రీరామచంద్రమూర్తిని సుందరంగా అలంకరించారు. తితిదే ఉప కార్యనిర్వహణాధికారి పి.వి.నటేష్బాబు ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ గ్రామోత్సవం ఘట్టం కనులపండువగా జరిగింది. భక్తజన బృందాలు, చెక్కభజనలు, కోలాట నృత్య ప్రదర్శనలతో ఊరేగింపు కోలాహలంగా సాగింది. ఆలయంలో ఉదయం 11 గంటల నుంచి సీతారామలక్ష్మణమూర్తులకు స్నపవ తిరుమంజనం వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు. అభిషేక ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించి దివ్యానుభూతి పొందారు.డీఎఫ్వో శ్రీనివాసులు, పర్యవేక్షకుడు హనుమంతయ్య, తనిఖీ అధికారి నవీన్కుమార్ పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు : ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం ఉదయం 7.30కు జగదభిరాముడు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 నుంచి 9 వరకు సింహ వాహనంపై సీతారామలక్ష్మణమూర్తులు విహరిస్తారు.
ముత్యాల తలంబ్రాల ప్యాకెట్ల తయారీ పూర్తి
ఒంటిమిట్ట, న్యూస్టుడే: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు అవసరమైన ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు తయారీ పూర్తయింది. ఈ నెల 22న రాత్రి సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా భక్తులకు వీటిని పంపిణీ చేయనున్నారు. సుమారు లక్ష ప్యాకెట్లు సిద్ధం చేశారు. జానకీరాముల పరిణయ ఘట్టాన్ని తిలకించడానికి తరలిరానున్న భక్తులకు పవిత్రమైన ముత్యాల తలంబ్రాలతోపాటు తిరుమల శ్రీవారి చిన్న (25 గ్రాములు) లడ్డూలు అందజేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు.
కనుల పండువగా ఊంజల్ సేవ
ఏకశిలానగరి కోదండ రామాలయంలో గురువారం సాయంత్రం నిర్వహించిన ఊంజల్సేవ భక్తులను ఆనందభరితులను చేసింది. రామయ్య క్షేత్రంలో ఉన్న కల్యాణ మండపంలో సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి డోలికల్లో కూర్చోబెట్టి ఊంజల్ సేవ చేశారు. చెన్నైకు చెందిన శృతి... భక్తి గీతాలను, అన్నమాచార్య కీర్తనలను ఆలపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
[ 01-05-2024]
ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి రమణా రెడ్డి, ఎంఈవోలు ప్రేమ సాగర్, మస్తాన్వలీ తెలిపారు. -
జగనుడిదే పాపం.. కార్మికుడికి శాపం..!
[ 01-05-2024]
అసంఘటిత, సంఘటిత కార్మికవర్గాల సంక్షేమాన్ని వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసింది. అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని ప్రతిపక్షనేతగా ఊదరగొట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటమరిచారు. -
దండిగా ప్రభుత్వ పరివారం.. మొండిగా పేదలపై ప్రతీకారం
[ 01-05-2024]
ఏదైనా జరిగితే బాధ్యులెవరు? : వృద్ధాప్య పింఛనుదారుల్లో చాలామంది కీళ్లు, నరాలు, మోకాలు, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు తదితర వ్యాధులతో బాధపడుతున్నారు. -
మైదుకూరు అభివృద్ధిపై నోరెత్తని జగన్
[ 01-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరులో మంగళవారం సీఎం జగన్ నిర్వహించిన బహిరంగసభలో మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధిపై నోరెత్తలేదు. ప్రజల్లో ఆశలు చిగురింపజేయలేదు. -
కూటమి వాగ్దానాలు... భవిష్యత్తుకు సోపానాలు!
[ 01-05-2024]
‘ప్రజల ఆశయాలు నెరవేర్చాలి. నమ్ముకున్న జనం కలను సాకారం చేయాలి. పల్లె, పట్టణ వాసుల ఆకాంక్షలు ఫలించేలా వినూత్న పథకాలు ప్రవేశపెట్టాలి. -
నారా లోకేశ్ పర్యటన 5కు వాయిదా
[ 01-05-2024]
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాజంపేట పర్యటన ఈ నెల 5వ తేదీకి వాయిదా పడింది. -
నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం
[ 01-05-2024]
పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. -
పెద్దిరెడ్డి కుటుంబం.... మాఫియాలకు నాయకత్వం!
[ 01-05-2024]
రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పెద్దిరెడ్డి కుటుంబం వివిధ రకాల మాఫియాలకు నాయకత్వం వహిస్తోందని, దోపిడీయే ధ్యేయంగా అయిదేళ్లలో అడ్డగోలుగా వనరుల విధ్వంసానికి పాల్పడ్డారని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
జగన్ పర్యటన... జనానికి యాతన!
[ 01-05-2024]
కలికిరిలో మంగళవారం జరిగిన సీఎం జగన్ బహిరంగ సభ పేలవంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటలకు అని షెడ్యూలిచ్చి సాయంత్రం 4 గంటలకు సీఎం సభా స్థలానికి చేరుకున్నారు. -
సమస్యల తిష్ఠ... జగన్ పాలనకు పరాకాష్ట
[ 01-05-2024]
ఏ కాలనీ చూసినా కాలువలు పూడికతో నిండిపోయాయి. ప్రొద్దుటూరు పట్టణం, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు మున్సిపాల్టీల్లోని కాలనీ వీధుల్లోని డ్రైనేజీల్లోని వ్యర్థాలను తీశారే తప్ప వాటిని తీసుకెళ్లలేదు. -
గండికోట నిర్వాసితులకు రూ.12 లక్షల పరిహారం
[ 01-05-2024]
గండికోట నిర్వాసితులకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునరావాస పరిహారం రూ.12 లక్షలు ఇస్తామని మాజీ మంత్రి, ఎన్డీఏ కూటమి జమ్మలమడుగు ఎమ్మెల్యే భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి తెలిపారు. -
తొలగించని సీఎం స్టిక్కర్
[ 01-05-2024]
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి నెల రోజులు అయినా స్థానిక ముద్దనూరులోని జెండా మాను వీధి, రైల్వే గేటు సమీపంలో, వాటర్ ట్యాంకు సమీపంలోని ఇళ్ల వద్ద గోడలపై ‘మా నమ్మకం నూవ్వే జగన్’ స్టిక్కర్లు ఇప్పటికి అలాగే ఉన్నాయి. -
ప్రొద్దుటూరులో తెదేపా జెండా ఎగురవేస్తాం
[ 01-05-2024]
ప్రొద్దుటూరులో తెదేపా జెండా ఎగరడం ఖాయమని, ఖచ్చితంగా గెలిచితీరుతామని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. -
విభజన రాజకీయాలతో మైనార్టీల ఓట్లకు వైకాపా ఎసరు
[ 01-05-2024]
భాజపాను అడ్డంగా పెట్టుకుని విభజన రాజకీయాలు చేస్తున్న వైకాపా ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం మైనార్టీల ఓట్లను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తోందని రాజంపేట లోక్సభ భాజపా అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్రెడ్డి ఆరోపించారు. -
అయిదేళ్ల వైకాపా పాలనంతా మోసం
[ 01-05-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో రైతులు, యువత, అన్ని వర్గాలను జగన్ పూర్తిగా మోసం చేశారని వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ స్టార్ క్యాంపెయినర్, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ అన్నారు. -
ఓటుతోనే వైకాపాకు బుద్ధి చెప్పండి
[ 01-05-2024]
అధికార వైకాపాకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్కుమార్రెడ్డి అన్నారు. -
పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన పరిశీలకులు
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పీలేరు పట్టణంలో ఎక్కువ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన కార్యాలయాలను మంగళవారం ఎన్నికల పరిశీలకులు తనిఖీ చేశారు. -
అనిశా వలలో ట్రాన్స్కో జలగ!
[ 01-05-2024]
నియంత్రిక మంజూరుకు లంచం డిమాండు చేసిన అవినీతి జలగ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారుల ఉచ్చులో చిక్కాడు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
-
ఆఫ్లైన్లోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష: టీఎస్పీఎస్సీ
-
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో ఇకపై సన్ నెక్స్ట్..
-
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
లైంగిక దౌర్జన్యం కేసు - తొలిసారి స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ