logo

నేడు అంగళ్లుకు చంద్రబాబు రాక

తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లుకు ఆదివారం రానున్నారు. ఇక్కడ జరిగే ప్రజాగళం  బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

Published : 05 May 2024 05:22 IST

భారీ బహిరంగసభకు సన్నాహాలు

ఈనాడు, కడప: తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లుకు ఆదివారం రానున్నారు. ఇక్కడ జరిగే ప్రజాగళం  బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. హిందూపురంలో ప్రచారం ముగించుకుని హెలికాప్టర్‌లో అంగళ్లులోని మిట్స్‌ కళాశాల మైదానానికి చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగసభలో పాల్గొని తిరిగి అనంతపురం పట్టణంలో జరిగే ప్రచారానికి వెళ్లనున్నారు. అంగళ్లు సభను విజయవంతం చేయడానికి నేతలందరూ సన్నాహాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు కూటమి తరఫున పోటీ చేస్తున్న రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్‌రాజు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డి, ఎన్నికల సమన్వయకర్త మల్లికార్జుననాయుడు సమీక్ష నిర్వహించి ఏర్పాట్లు చేపట్టారు.


పీలేరుకు మోదీ వెంట లోకేశ్‌

ఈనాడు, కడప: పీలేరు నియోజకవర్గం కలికిరిలో ఈ నెల 8వ తేదీన జరిగే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగసభకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హాజరుకానున్నారు. మోదీతో పాటు తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు ఉన్నప్పటికీ లోకేశ్‌ సైతం హాజరుకానున్నారు. లోకేశ్‌ నిర్వహిస్తున్న యువగళం సభలకు యువత నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఒంగోలు, నెల్లూరు, చంద్రగిరి, నంద్యాలలో నిర్వహించగా, శనివారం రాజంపేటలోనూ పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. ఈ నెల 6న రాజమండ్రిలో జరిగే బహిరంగసభలోనూ మోదీతో పాటు లోకేశ్‌ పాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని