Cheating: దోస్తు పేరు చెప్పి రూ.1.22 లక్షలు స్వాహా
సంక్రాంతి పండుగ సమయంలో దోస్తు పేరు చెప్పి రూ.1.22 లక్షలు కాజేసిన మోసగాడిని సిద్దిపేట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ తెలిపిన వివరాలు.. మేడ్చల్ మల్కాజిగిరి
కృష్ణా జిల్లాలో నిందితుడిని పట్టుకున్న సిద్దిపేట పోలీసులు
న్యూస్టుడే, కొండపాక: సంక్రాంతి పండుగ సమయంలో దోస్తు పేరు చెప్పి రూ.1.22 లక్షలు కాజేసిన మోసగాడిని సిద్దిపేట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ తెలిపిన వివరాలు.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోయినిపల్లికి చెందిన దానాల సూరజ్కు, సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన ఫొటోగ్రాఫర్ అంబారీ సతీశ్కు పరిచయం ఉంది. అతని స్నేహితుల గురించి ఆరా తీశాడు. డీజే బృందంలో సూరజ్ పనిచేస్తుంటాడు. అతని అత్తగారి ఊరైన కృష్ణా జిల్లా గుడివాడకు ఈనెల 15న వెళ్లాడు. అదేరోజు అర్ధరాత్రి సతీశ్కు ఫోన్ చేశాడు. సతీశ్కు స్నేహితుడైన అరుణ్ తమ్ముడు రాజ్కుమార్ అని నమ్మకం కలిగేలా పరిచయం చేసుకున్నాడు. తన వద్ద రూ.3 లక్షల విలువైన కెమెరా ఉందని, రూ.1.22 లక్షలు చెల్లిస్తే ఇస్తానని చెప్పి ఒప్పించాడు. మరునాడు గుడివాడలో ఆన్లైన్ సౌకర్యమున్న కృష్ణా జిరాక్స్, ఫ్యాన్సీ సెంటర్లోకి వెళ్లి అక్కడికి సొమ్ము పంపించమని సూచించాడు. సతీశ్ ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా ఆన్లైన్లో పంపించారు. డబ్బులు చెల్లించినా కెమెరా మాత్రం సతీశ్కు చేరలేదు. తర్వాత మోసపోయానని గ్రహించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్దిపేట పోలీసులు యాదగిరి, కుమార్తో కలిసి ఆంధ్రప్రదేశ్కు వెళ్లి నిందితుడి కోసం గాలించి, పట్టుకొని అరెస్టు చేశారు. సూరజ్ రెండేళ్ల క్రితం ముగ్గురు వ్యక్తులను ఖరీదైన ఫోన్లు తక్కువ ధరకే అని చెప్పి మోసం చేశాడు. అతడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గతంలో జైలుకు పంపించారు. గుడ్డిగా ఎవరినీ నమ్మవద్దని, వాట్సాప్, ఫేస్బుక్కులో వచ్చే అనుమానిత లింకులపై క్లిక్ చేయవద్దని, డిస్కౌంట్ల ప్రకటనల జోలికి వెళ్లొద్దని పోలీసు కమిషనర్ శ్వేత ఈ సందర్భంగా సూచించారు. నిందితుడిని గాలించి పట్టుకున్న సిబ్బందికి రివార్డు అందజేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.