ప్రేయసి ఆత్మహత్య.. మరొకరితో వివాహం చేసుకొని ప్రియుడు పరారీ
తనతో కాకుండా మరో యువతిని ప్రియుడు పెళ్లాడడాన్ని తట్టుకోలేక ప్రేయసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం శివమొగ్గ నగరంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని రూపశ్రీ (28)గా గుర్తించారు. నగరంలోని
ఆత్మహత్య చేసుకున్న రూపశ్రీ (పాతచిత్రం)
శివమొగ్గ, న్యూస్టుడే: తనతో కాకుండా మరో యువతిని ప్రియుడు పెళ్లాడడాన్ని తట్టుకోలేక ప్రేయసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం శివమొగ్గ నగరంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని రూపశ్రీ (28)గా గుర్తించారు. నగరంలోని ఒ.టి.రోడ్డులోని తమ నివాసంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె మృతదేహం వద్ద లభించిన లేఖ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. రూపశ్రీ ఆత్మహత్య చేసుకున్నారనే విషయం తెలియగానే, అప్పుడే మరో యువతితో వివాహం చేసుకుంటున్న మురళి అనే యువకుడు పరారయ్యాడని వెల్లడించారు. రూపశ్రీ స్థానిక కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసేవారు. ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నారు. మురళి కూడా అధ్యాపకుడే. ఇద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల మురళికి మరో యువతితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం వీరిద్దరి వివాహం. ఒకవైపు పెళ్లి ముహూర్తం సమీపించగానే రూపశ్రీ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలిసే సమయానికి మురళి మరో యువతికి తాళి కట్టాడని తెలిసింది. ఆత్మహత్య విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడ లభించిన లేఖ ఆధారంగా కేసు నమోదు చేసుకుని మురళి కోసం పెళ్లి మంటపానికి చేరుకునేసరికి అక్కడి నుంచి ఉడాయించినట్లు తెలిపారు. నగరంలోని దొడ్డపేటె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. వివాహం జరిగిన వెంటనే వరుడు పరారవడంపై వధువు, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!