logo

ప్రేయసి ఆత్మహత్య.. మరొకరితో వివాహం చేసుకొని ప్రియుడు పరారీ

తనతో కాకుండా మరో యువతిని ప్రియుడు పెళ్లాడడాన్ని తట్టుకోలేక ప్రేయసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం శివమొగ్గ నగరంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని రూపశ్రీ (28)గా గుర్తించారు. నగరంలోని

Updated : 21 Mar 2022 08:53 IST

ఆత్మహత్య చేసుకున్న రూపశ్రీ (పాతచిత్రం)

శివమొగ్గ, న్యూస్‌టుడే: తనతో కాకుండా మరో యువతిని ప్రియుడు పెళ్లాడడాన్ని తట్టుకోలేక ప్రేయసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం శివమొగ్గ నగరంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని రూపశ్రీ (28)గా గుర్తించారు. నగరంలోని ఒ.టి.రోడ్డులోని తమ నివాసంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె మృతదేహం వద్ద లభించిన లేఖ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. రూపశ్రీ ఆత్మహత్య చేసుకున్నారనే విషయం తెలియగానే, అప్పుడే మరో యువతితో వివాహం చేసుకుంటున్న మురళి అనే యువకుడు పరారయ్యాడని వెల్లడించారు. రూపశ్రీ స్థానిక కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసేవారు. ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నారు. మురళి కూడా అధ్యాపకుడే. ఇద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల మురళికి మరో యువతితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం వీరిద్దరి వివాహం. ఒకవైపు పెళ్లి ముహూర్తం సమీపించగానే రూపశ్రీ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలిసే సమయానికి మురళి మరో యువతికి తాళి కట్టాడని తెలిసింది. ఆత్మహత్య విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడ లభించిన లేఖ ఆధారంగా కేసు నమోదు చేసుకుని మురళి కోసం పెళ్లి మంటపానికి చేరుకునేసరికి అక్కడి నుంచి ఉడాయించినట్లు తెలిపారు. నగరంలోని దొడ్డపేటె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. వివాహం జరిగిన వెంటనే వరుడు పరారవడంపై వధువు, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని