ప్రేయసి ఆత్మహత్య.. మరొకరితో వివాహం చేసుకొని ప్రియుడు పరారీ
తనతో కాకుండా మరో యువతిని ప్రియుడు పెళ్లాడడాన్ని తట్టుకోలేక ప్రేయసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం శివమొగ్గ నగరంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని రూపశ్రీ (28)గా గుర్తించారు. నగరంలోని
ఆత్మహత్య చేసుకున్న రూపశ్రీ (పాతచిత్రం)
శివమొగ్గ, న్యూస్టుడే: తనతో కాకుండా మరో యువతిని ప్రియుడు పెళ్లాడడాన్ని తట్టుకోలేక ప్రేయసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం శివమొగ్గ నగరంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని రూపశ్రీ (28)గా గుర్తించారు. నగరంలోని ఒ.టి.రోడ్డులోని తమ నివాసంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె మృతదేహం వద్ద లభించిన లేఖ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. రూపశ్రీ ఆత్మహత్య చేసుకున్నారనే విషయం తెలియగానే, అప్పుడే మరో యువతితో వివాహం చేసుకుంటున్న మురళి అనే యువకుడు పరారయ్యాడని వెల్లడించారు. రూపశ్రీ స్థానిక కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసేవారు. ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నారు. మురళి కూడా అధ్యాపకుడే. ఇద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల మురళికి మరో యువతితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం వీరిద్దరి వివాహం. ఒకవైపు పెళ్లి ముహూర్తం సమీపించగానే రూపశ్రీ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలిసే సమయానికి మురళి మరో యువతికి తాళి కట్టాడని తెలిసింది. ఆత్మహత్య విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడ లభించిన లేఖ ఆధారంగా కేసు నమోదు చేసుకుని మురళి కోసం పెళ్లి మంటపానికి చేరుకునేసరికి అక్కడి నుంచి ఉడాయించినట్లు తెలిపారు. నగరంలోని దొడ్డపేటె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. వివాహం జరిగిన వెంటనే వరుడు పరారవడంపై వధువు, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏలికల శక్తి యుక్తులకు పరీక్ష
[ 07-05-2024]
రాష్ట్రంలో ఎన్నికల నేపథ్య జాతీయ, రాష్ట్ర నేతల హడావుడి మంగళవారంతో పరిసమాప్తం కానుంది. -
మహిళలకు సిద్ధు లేఖ
[ 07-05-2024]
కర్ణాటకలో రెండో విడత లోక్సభ ఎన్నికల ప్రక్రియకు కొద్ది గంటలే ఉన్న సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర మహిళలకు బహిరంగ లేఖ రాశారు. -
ప్రజ్వల్ కేసులో కుట్ర కోణం?
[ 07-05-2024]
కేఆర్నగర ఎమ్మెల్యే డాక్టర్ రవిశంకర్ చేసిన ఆరోపణలతోనే తమ నాయకుడు హెచ్డీ రేవణ్ణను సిట్ అరెస్టు చేసిందని జనతాదళ్ హాసన జిల్లా శాఖ అధ్యక్షుడు లింగేశ్ ఆరోపించారు. -
రాజధానిలో వాన జోరు
[ 07-05-2024]
ఈ వారాంతం వరకు బెంగళూరు, బెంగళూరు గ్రామీణం, రామనగర, కోలారు,చిక్కబళ్లాపుర, మండ్య, మైసూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. -
ఓటరన్నకు పండగొచ్చె!
[ 07-05-2024]
కర్ణాటకలో రెండో విడత 14 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాగలకోటె, చిక్కోడి, బెళగావి, విజయపుర, కలబురగి, రాయచూరు, బీదర్, కొప్పళ, బళ్లారి, హావేరి, ధార్వాడ, ఉత్తర కన్నడ, దావణగెరె, శివమొగ్గ నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది -
గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
[ 07-05-2024]
ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు వెళుతున్న గోవిందప్ప (38) అనే ఉపాధ్యాయుడు గుండెపోటుతో సోమవారం మరణించారు. -
అల్లుడి విజయమే ఖర్గే ఆశయం
[ 07-05-2024]
కలబురగి లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికలపై అందరూ దృష్టి సారించారు. ఓటమి ఎరుగని వీరుడిగా ఖ్యాతి పొందిన మల్లికార్జున ఖర్గే 2019 లోక్సభ ఎన్నికల్లో తొలిసారి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. -
గనినాడులో సర్వం సిద్ధం
[ 07-05-2024]
బళ్లారి లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని కంప్లి, బళ్లారి నగర, గ్రామీణ, సండూరు విధానసభ నియోజకవర్గాల సంబంధించిన పోలింగ్ సిబ్బందికి సోమవారం ఓటింగ్ యంత్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. -
బెంగళూరులో తెదేపా ప్రచారం
[ 07-05-2024]
అన్నమయ్య జిల్లా, లక్కిరెడ్డిపల్లె మండలం నుంచి ఉపాధి, వ్యాపార నిమిత్తం బెంగళూరులో ఉంటున్న వారు ఎన్నికల సమయంలో వెనక్కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని తెదేపా నాయకులు కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
మా ఇంట్లో ఓట్లు.. అమ్మకానికి లేవు
-
8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)