తెలివి మీరిన సైబర్ నేరగాళ్లు
తెలుగు ప్రజలను మోసం చేసేందుకు ఇక్కడి యువతను రప్పించుకుని మరీ ఆన్లైన్ మోసాలకు తెగబడుతున్న ఝార్ఖండ్ ప్రాంతానికి చెందిన ముఠాలోని 9 మందిని రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టుచేశారు.
తెలుగువారిని ఝార్ఖండ్ తీసుకెళ్లి శిక్షణ.. దోచిన సొత్తులో కమీషన్
రాజు సంతోష్ ప్రభుదేవా
నాగోలు, న్యూస్టుడే: తెలుగు ప్రజలను మోసం చేసేందుకు ఇక్కడి యువతను రప్పించుకుని మరీ ఆన్లైన్ మోసాలకు తెగబడుతున్న ఝార్ఖండ్ ప్రాంతానికి చెందిన ముఠాలోని 9 మందిని రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టుచేశారు. ఇన్స్పెక్టర్ శంకర్ కథనం ప్రకారం... సైబర్ నేరాలకు పురిటిగడ్డగా మారిన ఝార్ఖండ్ నేరగాళ్లకు తెలుగు ప్రజలను వంచించేందుకు భాషాపరమైన ఇబ్బందులు తలెత్తుతుండటంతో కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఏడాది క్రితం ఝార్ఖండ్కు చెందిన సైబర్ నేరగాడైన విక్రం ఠాకూర్ వారంరోజులపాటు నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో డేరా వేశాడు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన వనపర్తి జిల్లా పెద్దమందాడి మండలానికి చెందిన కత్రావత్ రాజు(27)తో స్నేహం చేశాడు. తన వెంట ఝార్ఖండ్కు వస్తే మంచి జీతం ఇప్పిస్తానని నమ్మించాడు. తాము చేసే ఆన్లైన్ మోసాల ద్వారా 30శాతం కమీషన్ను ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. దీంతో రాజు తన సమీప బంధువైన మరో ఆటోడ్రైవర్ కత్రావత్ సంతోష్తో కలిసి సమీప బంధువులైన యువకులను చేరదీశారు. వీరిద్దరితోపాటు ఇస్లావత్ గణేష్ ఆలియాస్ ప్రభుదేవా(21), మూఢావత్ వెంకటేష్(18), డేగావత్ శ్రీనివాసులు(22), కేతావత్ హరిలాల్(19), కత్రావత్ గణేష్(19), మూఢావత్ గణేష్(19) అనే విద్యార్థులు, కేతావత్ రాజు(21) అనే రైతు జత కట్టారు. వీరంతా విక్రమ్ ఠాకూర్ వెంట గతేడాది జార్ఖండ్కు వెళ్లారు. అక్కడ వారందరికీ వసతి ఏర్పాటు చేసిన విక్రం... వేర్వేరు సిమ్ కార్డులు, సెల్ ఫోన్లు, బ్యాంకు ఖాతాలు ఇప్పించాడు. అమాయక ప్రజలను ఆన్లైన్లో ఎలా మోసం చేయాలో శిక్షణ ఇప్పించాడు. ఆపై రుణాలు పొందేందుకు ఆసక్తి చూపుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రజల సమాచార డాటాను వారికి అందించాడు. రుణాలు, ఇతర బ్యాంకు సేవలందిస్తామంటూ వారు ఫోన్ల ద్వారా అచ్చమైన తెలుగులో ఆకర్షించి ఆపై ప్రాసెసింగ్ ఫీజుల రూపేణా పెద్దమొత్తంలో డబ్బును ఆన్లైన్ ద్వారా జమచేయించుకుంటున్నారు. ఇలా మోసం చేసి సంపాదించిన సొత్తులోంచి 30శాతం కమీషన్ను కత్రావత్ రాజు, సంతోష్లు విక్రం ఠాకూర్ నుంచి వసూలు చేసుకుని వారందరికీ పంపిణీ చేస్తున్నారు. ఇలా సంపాదించిన సొత్తుతో పండగలకు సొంతూరికి వచ్చి జల్సా చేస్తున్నారు. డబ్బంతా ఖర్చయిపోగానే తిరిగి జార్ఖండ్కు పయనమవుతున్నారు. కాగా... ఈ ముఠా సభ్యుల సమాచారాన్ని అందుకున్న జార్ఖండ్ పోలీసులు ఇటీవల దాడిచేయగా... అక్కడి నిందితులతోపాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారూ ఉండటంతో ఇక్కడి రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులకు వారు సమాచారాన్ని అందజేశారు. దీంతో ఇన్స్పెక్టర్ శంకర్తోపాటు 20మంది పోలీసులు వెళ్లి 9మంది నిందితులను పీటీ వారెంటు కింద పట్టితెచ్చారు. వారందర్నీ శుక్రవారం రిమాండుకు తరలించారు.
వెంకటేష్ శ్రీనివాసులు హరిలాల్
కె.గణేష్ ఎం.గణేష్ కె.రాజు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య పరీక్ష.. బాలింతకు రక్ష
[ 21-05-2024]
పుట్టిన శిశువుతో పాటు తల్లిని కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విషయాన్ని ప్రత్యేకంగా స్త్రీ వ్యాధి నిపుణులు సూచిస్తుంటారు. -
వరద పారే దారేది..?
[ 21-05-2024]
జిల్లాలో వ్యాపార, వాణిజ్య పట్టణంగా పేరున్న తాండూరులోని పలు కాలనీలకు వర్షా కాలంలో వరద ముప్పు తప్పేలా లేదు. -
పిడుగుపాటుకు మరొకరి మృతి
[ 21-05-2024]
జిల్లాలో తాండూరు, కొడంగల్ నియోజక వర్గాల పరిధిలో పిడుగు పడిన వేర్వేరు ఘటనల్లో ఒకరు మృతి చెందగా, ఓ బాలుడు స్పృహ కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. -
కోర్టు కేసున్న భూమి పట్టా ఎలా మార్చారు?
[ 21-05-2024]
కోర్టు కేసు ఉన్న భూమి పట్టాను ఎలా మార్చారని హక్కుదారులైన మహిళలు తహసీల్దార్తో వాగ్వాదానికి దిగిన ఘటన బషీరాబాద్లో సోమవారం చోటుచేసుకుంది. -
పెట్టుబడులకు లాభాలంటూ మోసం
[ 21-05-2024]
ఆయుర్వేదిక్ కంపెనీలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని జనాలను నమ్మించి ముగ్గురు నిందితులు రూ.8.23 కోట్లు కొట్టేశారు. -
వానమ్మా.. వానమ్మా ఈ కష్టాలు ఏంటమ్మా
[ 21-05-2024]
వర్షాలు వస్తూవస్తూనే నగర ప్రజలకు కష్టాలను తెస్తున్నాయి. కొన్ని రోజులుగా నిత్యం ఎక్కడో ఒకచోట వర్షం కురుస్తూనే ఉంది. రహదారులపై నీరు నిలుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. -
కళాకారులు ఎప్పుడూ ప్రజల హృదయాల్లో ఉంటారు
[ 21-05-2024]
కళాకారులు ప్రజల హృదయాల్లో ఉంటారని అలాంటి వారే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని సినీ నటుడు మురళీమోహన్ కీర్తించారు. -
తెలుగు జాతీయతకు ప్రతీక ప్రకాశం పంతులు
[ 21-05-2024]
తెలుగు జాతీయతకు ప్రతీకగా, ఆంధ్రప్రదేశ్ నిర్మాతగా, అలుపెరుగని కార్యదీక్షాపరుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని మంత్రి శ్రీధర్బాబు కీర్తించారు. -
ఆధ్యాత్మికతకు పట్టం కట్టేలా అక్షరాలు
[ 21-05-2024]
త్యాగరాయ గానసభ నిర్వహణలో ఆధ్యాత్మికవేత్త పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘ఉగ్రం...వీరం’ గ్రంథావిష్కరణ సోమవారం రాత్రి జరిగింది. -
ప్రవాసాంధ్రుల ఆస్తుల రక్షణకు మంత్రి హామీ
[ 21-05-2024]
తెలంగాణలోని ప్రవాసాంధ్రుల ఆస్తులకు రక్షణను కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చినట్లు నగరానికి చెందిన ప్రవాసాంధ్రుడు వడ్డేపల్లి రామకృష్ణ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
సన్నవడ్లకు క్వింటాల్కు ₹500బోనస్.. TG కేబినెట్ కీలక నిర్ణయాలివే..
[ 21-05-2024]
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్