తల్లి పేగుకు.. ముళ్లపోగు
తండ్రి కసాయితనానికి గాయాలపాలైన చిట్టితల్లి కన్నుమూసింది. కన్నతల్లికి పుట్టెడు శోకం మిగిల్చింది. కన్న బిడ్డ మరణం.. కట్టుకున్నోడు జైలు పాలవటంతో ఎటూ పాలుపోని ఆ మాతృమూర్తి విలపిస్తోంది. నిండు గర్భిణి అయిన
కన్నబిడ్డ కన్నుమూత.. భర్త జైలుపాలు
ఖైరతాబాద్, న్యూస్టుడే: తండ్రి కసాయితనానికి గాయాలపాలైన చిట్టితల్లి కన్నుమూసింది. కన్నతల్లికి పుట్టెడు శోకం మిగిల్చింది. కన్న బిడ్డ మరణం.. కట్టుకున్నోడు జైలు పాలవటంతో ఎటూ పాలుపోని ఆ మాతృమూర్తి విలపిస్తోంది. నిండు గర్భిణి అయిన ఆమె నిస్సహాయ స్థితిలో ఉండటం స్థానికులను కలిచివేస్తోంది. ఉస్మానియా ఆసుపత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్న చిన్నారి సకీనా ఫాతిమా (3) మంగళవారం మరణించింది. ఆటోడ్రైవర్గా పనిచేసే బోరబండ వాసి బాసిత్ అలీఖాన్, ఫస్ట్లాన్సర్కు చెందిన సనా ఫాతిమా ప్రేమ వివాహం చేసుకుని ఏసీగార్డ్స్లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. వారికి నలుగురు కూతుళ్లు, ప్రస్తుతం సనా ఫాతిమా నిండు గర్భిణి. శనివారం స్నానాల గదిలో నీటితో ఆడుకుంటున్న సకినా ఫాతిమా.. వద్దని చెప్పినా వినడం లేదన్న కోపంతో తండ్రి తీవ్రంగా కొట్టడంతో పాటు పైకెత్తి నేలకేసి కొట్టాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఉస్మానియాలో చేర్పించారు. తండ్రి కొట్టడంతో గాయాల పాలైన విషయాన్ని ఆసుపత్రి ద్వారా తెలుసుకున్న సైఫాబాద్ పోలీసులు, బాలిక తల్లి ఇచ్చిన సమాచారం మేరకు ఆమె భర్తపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. భర్తను అరెస్టు చేస్తే పిల్లలతో తానెలా బతకాలని.. కేసు వద్దంటూ ప్రాధేయపడింది, పోలీసుల ఎదుట వాపోయింది. పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి సోమవారం న్యాయస్థానంలో హాజరుపర్చి జైలుకు తరలించారు. చికిత్స పొందుతున్న చిన్నారి మృతి చెందడంతో హత్యాయత్నం కేసుని హత్యగా మార్చారు. అటు బిడ్డను కోల్పోయి, ఇటు భర్త జైలుపాలు కావడంతో సనా ఫాతిమా కన్నీరు మున్నీరవుతోంది. ముగ్గురు పిల్లలతో ఇంటిని ఎలా నెట్టుకురావాలని ఆవేదన చెందుతోంది. చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం సైఫాబాద్ పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య పరీక్ష.. బాలింతకు రక్ష
[ 21-05-2024]
పుట్టిన శిశువుతో పాటు తల్లిని కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విషయాన్ని ప్రత్యేకంగా స్త్రీ వ్యాధి నిపుణులు సూచిస్తుంటారు. -
వరద పారే దారేది..?
[ 21-05-2024]
జిల్లాలో వ్యాపార, వాణిజ్య పట్టణంగా పేరున్న తాండూరులోని పలు కాలనీలకు వర్షా కాలంలో వరద ముప్పు తప్పేలా లేదు. -
పిడుగుపాటుకు మరొకరి మృతి
[ 21-05-2024]
జిల్లాలో తాండూరు, కొడంగల్ నియోజక వర్గాల పరిధిలో పిడుగు పడిన వేర్వేరు ఘటనల్లో ఒకరు మృతి చెందగా, ఓ బాలుడు స్పృహ కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. -
కోర్టు కేసున్న భూమి పట్టా ఎలా మార్చారు?
[ 21-05-2024]
కోర్టు కేసు ఉన్న భూమి పట్టాను ఎలా మార్చారని హక్కుదారులైన మహిళలు తహసీల్దార్తో వాగ్వాదానికి దిగిన ఘటన బషీరాబాద్లో సోమవారం చోటుచేసుకుంది. -
పెట్టుబడులకు లాభాలంటూ మోసం
[ 21-05-2024]
ఆయుర్వేదిక్ కంపెనీలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని జనాలను నమ్మించి ముగ్గురు నిందితులు రూ.8.23 కోట్లు కొట్టేశారు. -
వానమ్మా.. వానమ్మా ఈ కష్టాలు ఏంటమ్మా
[ 21-05-2024]
వర్షాలు వస్తూవస్తూనే నగర ప్రజలకు కష్టాలను తెస్తున్నాయి. కొన్ని రోజులుగా నిత్యం ఎక్కడో ఒకచోట వర్షం కురుస్తూనే ఉంది. రహదారులపై నీరు నిలుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. -
కళాకారులు ఎప్పుడూ ప్రజల హృదయాల్లో ఉంటారు
[ 21-05-2024]
కళాకారులు ప్రజల హృదయాల్లో ఉంటారని అలాంటి వారే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని సినీ నటుడు మురళీమోహన్ కీర్తించారు. -
తెలుగు జాతీయతకు ప్రతీక ప్రకాశం పంతులు
[ 21-05-2024]
తెలుగు జాతీయతకు ప్రతీకగా, ఆంధ్రప్రదేశ్ నిర్మాతగా, అలుపెరుగని కార్యదీక్షాపరుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని మంత్రి శ్రీధర్బాబు కీర్తించారు. -
ఆధ్యాత్మికతకు పట్టం కట్టేలా అక్షరాలు
[ 21-05-2024]
త్యాగరాయ గానసభ నిర్వహణలో ఆధ్యాత్మికవేత్త పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘ఉగ్రం...వీరం’ గ్రంథావిష్కరణ సోమవారం రాత్రి జరిగింది. -
ప్రవాసాంధ్రుల ఆస్తుల రక్షణకు మంత్రి హామీ
[ 21-05-2024]
తెలంగాణలోని ప్రవాసాంధ్రుల ఆస్తులకు రక్షణను కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చినట్లు నగరానికి చెందిన ప్రవాసాంధ్రుడు వడ్డేపల్లి రామకృష్ణ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
సన్నవడ్లకు క్వింటాల్కు ₹500బోనస్.. TG కేబినెట్ కీలక నిర్ణయాలివే..
[ 21-05-2024]
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్